Saturday 23 January 2010

సమైఖ్య వాద బ్లాగరుల కొన్ని వింత వాదనలు..మీ ప్రాంత అభివృద్ధికి మీ నాయకులని అడగండి!!??##


మైఖ్య సీమంధ్ర వాదుల మరో ఆయుధం ఏమిటంటే, ఎ పాయింటు దొరకనప్పుడు మీ ప్రాంత అభివృద్ధి కోసం మీ నాయకులని నిలదియక రాష్ట్రం కావాలన్తారెంటి అంటారు. నిజమే, మా ప్రాంత నాయకులంతా వట్టి దగుల్బాజీలు. అయితే ఇలాంటి వాళ్లకి టికేట్లిచ్చి వాళ్ళని నాయకులని చేసింది అధికారం వెలగబెట్టే సిమాంధ్ర నేతలే కదా? ఇప్పుడు ఉద్యమం చేస్తుంది నాయకులు కాదు, ప్రజలు. మా రాష్ట్రం మాకిస్తే ఆ తరువాత మాకు కావలిసిన నాయకులని మేము ఎన్నుకుంటాము.

ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిలో మరో దారి లేక ఐ నాయకులంతా తెలంగాణా వాదం సమర్ధిస్తున్నారు..లేకపోతె ప్రజలలో చులకన అయిపోతామని తెలుసు కాబట్టి. కానీ వీల్లన్తా నిన్నటిదాకా జగన్ జపం లేక చంద్రబాబు జపం చేస్తున్న వాళ్ళే కదా? మరి ఇలాంటి వాళ్లకు ఎందుకు వోటు వేస్తున్నారు అంటే మరో దారి లేదు..అన్ని పార్టీలలో సీమాధ్ర నేతలే అధికారం గుఉపిట్లో ఉంచుకొని తమ కిలుబోమ్మలకి తికేట్లిస్తున్నారాయే. ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరికి వోటు వేయాలి కదా?

ఇక మరికొందరు సమైఖ్య వాదులు తమ బాణాలని కేసీఆర్ మిఇడ ఎక్కు పెడతారు. వాళ్ళు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే కేసీఆర్ తెలంగాణా వాదాన్ని సృష్టించలేదు. కేవలం దాన్ని వాడుకొన్నాడు. ఈ తెలంగాణా సమస్య ఇలా ఉన్నంతకాలం కేసీఆర్ లేకపోతె మరో డీసీఆర్ నాయకుదయ్యే వాడు. కాబట్టి వ్యక్తులపై విమర్శలు మాని సమైఖ్య వాదులు విషయంపై చర్చించడం మొదలు పెడితే అర్ధవంతంగా ఉంటుంది.

Friday 22 January 2010

సమైఖ్య వాద బ్లాగరుల కొన్ని వింత వాదనలు.. హైదరాబాద్ ఉమ్మడి ఆస్థి. ??@#!!


1. హైదరాబాద్ ఉమ్మడి ఆస్థి. హైదరాబాద్ అబ్భివ్రుద్ధిలో అందరి వాటా ఉంది??

- ఒక విధంగా మనం ఇలా చెప్పే వాళ్ళను అభినందించవచ్చు. నిజాయితిగా వీల్లు తమ అసలు సమస్య హైదరాబాదే, సమైఖ్యమనే డొంక తిరుగుడు వాదం కేవలం ఒక కుంటి సాకు మాత్రమె అని ఒప్పెసుకున్తున్నట్లే. హైదరాబాద్ గురించి అప్పుడే అడిగితె చులకన అయిపోతామని వీరు సమైఖ్యమనే ముసుగు తొడుక్కుంటారు.

ఇక్కడ విషయం ఏమిటంటే హైదరాబాద్ ఒక్కటే కాదు, హైదరాబాద్ తో పాటు వైజాగ్, కాకినాడ, తిరుపతి లాంటి నగరాలు కుఉడా చక్కగా అభివృద్ధి చెందాయి. హైదరాబాద్ యాభై ఎల్లకిండా కూడా దేశంలో ఐదో స్థానంలో ఉన్న నగరమే, ఇప్పుడు కూడా దేశంలో ఐదో స్థానంలోనే ఉన్నది. విజాగ్ హైదరాబాద్ కంటే ఎక్కువ వేగంగా అభివృద్ధి చెందినా నగరం. స్టీల్ ఫాక్టరీ, పోర్టు, నేవీ లాటివన్నీ వైజాగ్లో వచ్చాయి. కాకినాడలో ఎన్నో ఫెర్టిలైజర్ ఫాక్టరీలున్నాయి. అంత మాత్రం చేత తెలంగాణా వాదులు ఎమీ ఆ నగరాలలో వాటా అడగట్లేదు కదా? నిజాం కాలంలోనే ఏంటో అభివృద్ధి చెందినా హైదరాబాద్ గురించి ఎందుకు ఏడుపు? దీనికి ఒక బ్లాగరు చెప్పే సమాధానం ఏమంటే హైదరాబాదులో వచ్చే ఆదాయం మిగతా మొత్తం రాష్ట్రంలో వచ్చే ఆదాయం కంటే చాలా ఎక్కువట. అసలు ఏడుపు బయట పెట్టాడు.

మరి హైదరాబాద్ ఆదాయం ఈ మధ్యే పెరిగిందా ఒక్కసారిగా, లేక 1956 నుంచి ఎక్కువేనా? ఒక వేల 1956 నుచి ఎక్కువే అయితే అప్పుడు హైదరాబాద్ ఉమ్మడి ఆస్తి అనడంలో లాజిక్ ఏమిటి? హైదారాబాద్ ఆదాయాన్నే మిగతా ప్రాంతాల్లో ఖర్చు చేసినట్లు కదా? అందులో సింహ భాగం సీమాంధ్రకే ఖర్చు జరిగి ఉంటుందనడంలో సందేహం ఉంటుందా? ఇటీవల హైదరాబాద్లో ఇబ్బడి ముబ్బడిగా తెగనమ్మిన ప్రభుత్వ భూములనుండి వచ్చిన ఆదాయంలో ఎంత భాగం సీమాంధ్రకి జలవనరులని తరలించే జలయజ్ఞ ప్రాజెక్టులకి ఖర్చు చేసి ఉంటారో? మరి ఇవన్ని లెక్కలు తోడితే ఎవరు ఏవరికి ఋణం ఉన్నట్లో తెలిసి పోతుంది.

ఇంకో సారి అదే బ్లాగరు పెద్ద మనిషి ఏమంటాడంటే హైదరాబాదు రాజధాని కనుక దాని అభివృద్ధి కోసం మిగతా ప్రాంతాల అభివృద్ధిని పణంగా పెట్టారట. ఏవిధంగా పణంగా పెట్టారు, ఒక వైపు వైజాగ్ అభివృద్ధి రేటు హైదరాబాదు కంటే ఎక్కువ, హైదరాబాద్ 1956 లో దేశంలో ఎ స్థానంలో ఉందొ ఇప్పుడూ అదే స్థానంలో ఉంది. హైదరాబాద్ రాజధాని కనుక రాజధాని అవసరాలకు ఏమైనా నిధులు ఖర్చు పెట్టారా అంటే అన్నీ నిజాం కాలంలో కట్టిన భవనాలే. మరి పరిరమలకూ, వ్యాపార సంస్థ లకూ ఎక్కడ అనువైన వాతావరణం ఉంటె అక్కడ అబివృద్ధి చెందుతాయి. ధిల్లీ రాజధాని కదా అని ముంబాయి, మద్రాసు, కోల్కతా లాంటి నగరాలు అభివృద్ధి చెందడంలేదా? ఎ విధంగా మిగతా ప్రాంతాల అభివృద్ధిని పణంగా పెట్టారు? ఇలాంటి ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానం ఉండదు.

అసలు ఆంద్ర రాష్ట్ర నాయకులు హైదరాబాదు రాష్ట్రంతో కలవడానికి ముఖ్యమైన ఉద్దేశం వాళ్లకు ఆంద్ర రాష్ట్రంలో సరైన రాజధాని లేకపోవడమే. కర్నూలు లో డెరాలలో సేక్రతెరిఅత్ని పెట్టుకుని దాన్ని రాజధాని అవసరాలకు నిర్మించుకోవడానికి ఏంటో ఖర్చు అవుతుంది కనుక హైదరాబాదుతో కలిస్తే ఫ్రీగా రాజధాని లభిస్తుందని అప్పుడు ఆంద్ర ప్రదేశ్ ఏర్పాటుకు పట్టుబట్టారు. తమ అవసరాలకోసం హైదరాబాదుని రాజధానిగా చేసుకుని ఇప్పుడు అదే నగరంలో వాటా అడుగుతున్నారు. తిన్న ఇంటి వాసాలు లేక్కబెత్తడమంటే ఇదే కదా మరి?

తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పరచడం ఇష్టం లేనట్లయితే ఎందుకు అది సరి కాదో చెప్పాలి. ప్రత్యెక రాష్ట్రం కావాలని నిర్నయిన్చినట్లయితే ఆ తరువాత విభజనకు ఉన్న ఇబ్బండులేమితో చెప్పాలి. కానీ ఒక పక్క సమైఖ్యరాగం పలుకుతూ ఇంకో వైపు హైదరాబాదులో మాకూ వాటా వుందని లంకె పెట్టడం ఏవిధంగా సరి అయిన వాడమో తమను తాము తెలివైన వాళ్ళుగా భావించే సీమాంధ్ర సమైఖ్య వాదులే చెప్పాలి.

Sunday 10 January 2010

చిరంజీవి అమెరికా, రష్యాల వాదన


ఈ మధ్యన చిరంజీవి సమైఖ్య వాదం గురించి చెబుతూ తరుచుగా అమెరికా, రష్యా, జెర్మనీల గురించి జనాలను ఊదరగొదుతున్నాడు. బహుషా మాట్లాడ్డానికి పాయింటులు ఏమీ దొరక్క ఆలోచిస్తుంటే అల్లు అరవిందో, మరొకడో చెప్పి ఉంటాడీ అమెరికా, సోవిఎట్ రష్యా ల ఉదాహరణ. తనకు వాటిపై ఏమాత్రం అవగాహన లేకున్నా మీడియా ముందర వాటినే ఊదరగొడుతున్నాడు.

చిరంజీవి చెప్పేదేమంటే, యునైటెడ్ స్తేట్స్ గా కలిసి ఉండడం వల్ల అమెరికా అభివ్రుద్ధి చెందింది, కానీ విడిపోవడం వల్ల సోవిఎట్ రష్యా భాగస్వామ్య దేశాలు అభివ్రుద్ధి చెందడం లేదని.

తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే అప్పుడు అది మాత్రం యునైటెడ్ ఇండియాలో భాగం కాదా? తెలంగాణా వాల్లు ఏమైనా ఈ దేశం నుండి విడిపోతామని అంటున్నారా? అసలు అమెరికా ఉదాహరణే తీసుకుంటే ఇరవై కోట్ల జనాభా ఉన్న అమెరికాలో యాభై రాష్ట్రాలు ఉండగా వంద కోట్ల జనాభా ఉన్న మనదేశంలో మరో కొత్త రాష్ట్రానికి స్థానం లేదా?

అమెరికా ఒక ఫెడరల్ రిపబ్లిక్. అక్కడ రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఉంటాయి, ఎక్కువ ఆదాయం ఉంటుంది. ఆదాయపు, అమ్మకపు పన్నుల్లో రాష్ట్రాలకు ఎక్కువ వాటా ఉంటుంది. మన దేశంలో రాష్ట్రాలకు ఉండే అధికారాలు చాల పరిమితం. ప్రతి చిన్న విషయానికీ కేంద్రందగ్గర చెయ్యి చాచాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు మనం అమెరికా ఉదాహరణ తీసుకోవాలంటే ఇంకా ఎక్కువ రాష్ట్రాలను ఏర్పాటు చేసి, ఎక్కువ అధికారాలను రాష్ట్రాలకు బదిలీ చెయ్యాలి. కానీ ఈయన ఏంటి, అమెరికాను చూసి సమైఖ్యంగా ఉండడం నేర్చుకుందామంటాడు మరి?

ఇక సోవిఎట్ రష్యా విషయానికి వస్తే, సోవిఎట్ రష్యాలో అంతర్భాగమైన రిపుబ్లిక్లన్నీ బలవంతంగానే సోవిఎట్ రష్యాతో కలిసి ఉన్నాయి, కానీ వాల్లెప్పుడూ స్వతంత్రంగా ఉండడానికే మక్కువ చూపారు. ఇప్పుడు ఈయన చెప్పిన సిద్ధాంతం వినిపించి పాత సోవిఎట్ అంతర్భాగ రిపబ్లిక్లని రష్యా తో కలవమంటే వాల్లు ఇష్టపడతారా? ఇకపోతే ఉత్పత్తిలో గానీ, జీవన ప్రమాణాల్లోగానీ ఆ దేశాలు అప్పటికంటే ఇప్పుడు వెనుకపడ్డయనడానికి చిరంజీవి దగ్గర ఆధారాలు ఎమైనా ఉన్నాయా? అప్పటి కమ్యూనిస్టు నియంత్రిత మీడియా ఇచ్చిన ప్రమాణాలనే వాస్తవాలుగా తీసుకుంటే ఎలా?

ఇలాంటి ప్రపంచ విషయాలపై ఏమాత్రం అవగాహన లేని నాయకులని మనం నేతలుగా ఎన్నుకుంటే సమైఖ్యంగా ఉన్నా విడిపోయినా మన దేస్శం ఎన్నటికీ అభివ్రుద్ధి చెందదు మరి.

Wednesday 6 January 2010

సమైక్యాంధ్ర వాదుల వితండ వాదాలూ, అబద్దపు ప్రచారాలు -2


1. నీటి ప్రాజెక్టులకోసం మీ నాయకులని నిలదీయక రాష్ట్రం కావలంటారేం?

అక్కడికి జలవనరులపై నిర్నయాలు అన్నీ నియోజకవర్గం నాయకులే చేస్తున్నట్టు తెలంగానా వాల్లు వాటికోసం నాయకులని నిలదీయాలట. ఎమ్మెల్యేలకూ, ఎంపీలకూ వాటర్ ప్రాజెక్టులపై నిర్నయాలు తీసుకునే అదికారం ఉందా? ఏ పార్టీ ఎమ్మెల్యే ఐనా వాల్ల అధినేత మాట కాదని ఆ పార్టీలో మన గలడా? పీ జనార్ధన్ రెడ్డి లాంటి అసమ్మతి నేతల మాటలు ఎప్పుడైనా గెలుస్తాయా, అధికారంలో ఉన్నవాడి మాట నెగ్గుతుంది కానీ?

2. తెలంగాణాలో అంతా ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటే టీఆరెస్ గెలవలేదేం?

తెలంగానా ఉద్యమం టీఆరెస్తో రాలేదు. అంతకు చాలా ముందు నుంచే ఉంది. టీఆరెస్లో కొన్ని నాయక్త్వలోపాలు ఉన్న మాట నిజమే కావొచ్చు, టీఆరెస్ గతిపై ప్రజలకు కొన్ని అనుమానాలు ఉండడం నిజమే. వాల్లు టీఆరెస్కి వోటేయనంత మాత్రాన తెలంగాణా కోరుకోనట్లు ఎలా అవుతుంది? టీఆరెస్ కాకుండా మిగతా పార్టీలు ఏవీ కూడా (ఒక్క సీపీఎం తప్ప) మేము తెలంగాణా రాష్ట్రానికి వ్యతిరేకం, సమైక్యాంధ్రనే కోరుకుంటున్నాం అని చెప్పరా? మొనటి దాకా అన్ని పార్టీలూ తెలంగాణాకి కట్టుబడి ఉన్నామనేకదా చెప్పాయి?

3. తెలంగాణా వాదులంతా వాల్ల నాయకుల మాయ మాటలు విని అదే నిజమనుకుంటున్నారు.

ఇది చాలా గమ్మత్తైన వాదన. తెలంగాణా మద్దతుదారులను ఎవరిని అడిగినా విడిపోవడానికి ఓ పది కారణాలు ఈజీగా చెబుతాడు. అదే సమైక్యాంధ్ర వాదులు ఎందుకు కలిసి ఉండాలో అడిగితే నీల్లు నమలుతారు. మరి నాయకుల మాటలు వినేది తెలంగానా వాదులా, లేక సమైక్యవాదులా? ఈ సమైక్య వాదులంతా చిరంజీవి అమెరికా, జెర్మనీ, సోవిఎట్ రష్యా గురించి చెప్పగానే ఒక్కసారిగా కల్లు తెరుచుని కలిసి ఉంటే కలదు సుఖం అనుకుంటున్నారా?

4. తెలుగు వాల్లను కలిసి ఉండకుండా విడగొడుతున్నారు.

ఇదేమిటి? తెలుగు వాల్లంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని రూలు ఎక్కడుంది? హిందీ మాట్లాడే వాల్లు అనేక రాష్ట్రాలుగ విభజించబడలేదా?

5. చిన్న రాష్ట్రాలకు కేంద్రంలో పరపతి ఉండదు.

చిన్న రాష్ట్రాలైన కేరల, హర్యానా, హిమాచల్ లాంటి రాష్ట్రాలు చక్కగా అభివ్రుద్ధి చెందుతాయి. కేంద్రం నుంచి చక్కగా ఫండ్స్ వస్తాయి. కేబినెట్ మినిస్ట్రీలు వస్తాయి. వీల్ల వాదనేమనంటే ఇంతపెద్ద రాష్ట్రమ్ళో ముప్పై నాలుగు ఆరు మంది ఎంపీలు ఉంటే కేబినెట్ మినిస్ట్రీలు రాలేదు, చిన్న రాష్ట్రాలుగా ఉంటే ఎలా వస్తాయని. కేబినెట్ మినిస్త్రీలు రావాలంటే సంఖ్య కాదు, సరకు ఉన్న ఎంపీలు ఉంటే చాలు అన్న విషయం వీల్లు తెలుసుకోరు.

Tuesday 5 January 2010


సమైక్యాంధ్ర వాదుల వితండ వాదాలూ, అబద్దపు ప్రచారాలు -1




తెలంగానా రాష్ట్రం కొరకు ఉద్యమం యాభై ఏల్లుగా సాగుతుంటే, డిసెంబరు పది చిదంబరం ప్రకటనతో రాత్రికి రాత్రి మొదలయ్యిన సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా తెలుగు బ్లాగర్లలో ఈ మధ్య ప్రచారం మొదలయ్యింది. అయితే ఇలా రాత్రికి రాత్రి మొదలైన ఉద్యమానికి కారనాలు ఏమి చెప్పాలో ఎవరికీ అర్ధం కాక, ఎదో ఒకటి చెప్పి గోబెల్సు లాగే దాన్నే పదే పదే గట్టిగా అంటే సరిపోతుంది..పెద్దగ వినపడ్డం వల్ల జనం మన మాటే నమ్ముతారని వాల్లు ఆశ పడుతున్నారు లాగుంది. వీల్ల వాదనలు చాలా చిత్రంగా తలా తోకా లేకుండా, అసలు వాల్లు దేనికోసం ఉద్యమం చేస్తున్నారో కూడా తెలియనంత విచిత్రంగా ఉంటాయి. మచ్చుకు కొన్ని సమైక్య వాదుల వాదనలు.

1. రాష్ట్ర విభజన దేశ సమగ్రతకు పెద్ద సమస్య. ఇది వేర్పాటు వాదుల కుట్ర.

ఈ వాదన చూస్తే కాస్త బుర్ర ఉన్న ఎవ్వరికైనా నవ్వు రాక మానదు. ఒక రాష్ట్ర విభజనకీ, దేశ సమగ్రతకి సంబంధం ఏమిటి? అసలు దేశంలో రాష్ట్రాలే లేకుండా అంతా కలిసి ఉంటే సమగ్రత ఎక్కువగా ఉంటుందా? తెలంగాణా వాల్లేమైనా ఈదేశం నుండి విడిపోతామంటున్నారా? కొత్త రాష్ట్రం ఎర్పడితే అది ఈ దేశంలో భాగం కాద? మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడూ, ఝార్ఖండ్, ఉత్తరాంచల్, చత్తిస్గర్హ్ ఏర్పడ్డప్పుడూ ఈ దేశ సమగ్రతకు ముప్పు ఏమన్నా వచ్చిందా?

2. మీడియా, పోలీసులు తెలంగానా పక్షం??!!

అసలు మీడియా అంతా ఆంధ్రా వాల్ల చేతుల్లో ఉంది. మీడియా తెలంగాన పక్షం అని చెప్పడం విచిత్రంగా లేదూ? వీల్లు చెప్పేదేమంటే మీడియా ఎప్పుడూ తెలంగానా వాల్ల ఉద్యమాన్నే చూపిస్తుంది, ఆంధ్రా వాల్లు విశాఖ పట్నం లోనో, విజయవాడలోనో చేసేది చూపించరని. అవును అసలు ప్రజల్లో ఏమాత్రం మద్దతు లేని, కొంతమంది బడా నాయకులు తమ ప్రాబల్యం కోసం డబ్బులిచ్చి చేపిస్తున్న ఈ రాత్రికి రాత్రి మొదలయిన ఉద్యమాన్ని ఎవడు చూపిస్తాడు, చూపిస్తే ఎవడు చూస్తాడు? అక్కడొ పది మంది, ఇక్కడొ నలుగురు కలిసి ధర్నాలు చేసి దాన్ని ఎవరూ చూపించట్లేదంటారు.

ఇక వీల్లు చెప్పే మరో కారణం ఏమిటంటే తెలంగాణా నాయకుల సమావేషాలు, ప్రసంగాలు ఎక్కువగా చూపిస్తారు, ఆంధ్రా వాల్లవి చూపించరని. మరి అది నిజమే కదా? మిడియా ఎవరి ప్రసంగాలు ప్రజలు వినాలని కోరుకుంటున్నారో వాల్లవే చూపిస్తారు. చిరంజీవి, లగడపాటిల ఉపన్యాసాలు ఎవడైనా వింటాడా మరి?

ఇకపోతే విచిత్రమైన విషయం ఏమిటంటే పోలీసులు తెలంగానా వాల్లవైపట!! ఉస్మానియా విద్యార్తులు క్యాంపస్ లో ఉంటే హాస్టల్లలోకి వచ్చి కొట్టిన పోలీసులు అనంతపురంలో బీఎస్సెన్నెల్ గోడౌన్లు కాలుస్తున్నా అక్కడే ఉండి చూస్తూ ఊరుకున్నారు. కేసీఆర్ని దారి కాచి ఖమ్మం జైలుకి తరలించిన పోలీసులు లగడపాటి హాస్పిటల్ నుండి సినిమాలో లాగా తప్పించుకుని హైదరాబాదు వచ్చినా చోద్యం చూసారు. అయినా వీల్ల కల్లకు పోలీసులు తెలంగానా పక్షపాతుల్లాగానే కనిపిస్తారు.

3. తెలంగానా రాష్ట్రం ఏర్పడ్డంత మాత్రానా అభివ్రుద్ధి సాధ్యమని గ్యారంటీ ఉందా?

అసలు దేనికయినా గ్యారంటీ ఉంటుందా? ఏదైనా మార్పుని కోరుకునే వాడు మార్పు మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆషిస్తాడు. కలిసి ఉంటే అభివ్రుద్ధి జరుగుతుందేమోనని యాభై ఏల్లు వేచి చూసారు. ఇంకా ఎంత కాలం చూడమంటారో చెప్పండి.

4. ఈ విభజన వాదుల బందుల వల్ల నష్టం జరుగుతుంది.

నిజమే మరి. ఎవరు మాత్రం ఇలా బందులూ, ధర్నాలు ఉండాలని కోరుకుంటారు చెప్పండి? తెలంగాణా ప్రక్రియ మొదలవుతుందని చిదంబరం చెప్పగానే మీరు కేంద్ర ప్రభుత్వ నిర్నయానికి కట్టుబడి ఉంటే ఈ గొడవలన్నీ ఉండేవి కావు కదా? సమైక్య వాదులేమైనా బందులూ, ధర్నాలూ, నిరాహార దీక్షలూ లాంటివేవీ చేయకుండా ఊరుకున్నారా మరి? అప్పుడేమయింది మీ ఈ విచక్షణ?