tag:blogger.com,1999:blog-45965905952541011562024-03-19T12:21:46.632+02:00ఏది సత్యం?సత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comBlogger111125tag:blogger.com,1999:blog-4596590595254101156.post-56063174328987366862014-01-23T10:10:00.001+02:002014-01-23T11:04:38.526+02:00సినిమాను సినిమాలా చూడకండి<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<br />
<br />
ఎవరైనా ఏదైనా సినిమాను విమర్శిస్తే వెంటనే కొందరు తెలుగు సినిమోద్ధారకులు బయల్దేరి సినిమాను "సినిమా"లాగా చూడాలంటూ నీఉలు చెప్పడం మొదలు పెడతారు. ఇలా చెప్పేవారి ఉద్దేషం బహుషా సినిమా అంటే వినోదాన్ని ఇచ్చేది కనుక సినిమాను అలాగే చూడాలి, అంతకంటే ఎక్కువ ఆశించొద్దు అని.<br />
<br />
సరే వారు చెప్పినట్లు సినిమాను సినిమాగా ( వినోదాన్ని పంచేది), బట్టలను బట్టలుగా (ఓళ్ళు కప్పేది), ఇళ్ళును ఇళ్ళులాగా (తలదాచుకోవడానికి) చూసుకుంటూ పోతే ఇంకా మంచి బట్టలు, మంచి ఈళ్ళు, మంచి సినిమాలను కనుగొనేదెలాగ?<br />
<br />
మరోరకం విమర్శకులు మీరో సినిమా తీసి చూపించండి, అప్పుడే విమర్శించండి అంటుంటారు. సినిమా తీస్తే గానీ సినిమాను విమర్శించొద్దు, మఖ్యమంత్రి అయితే గానీ ముఖ్యమంత్రిని విమర్శించొద్దు, వంటగాడయితే గానీ వంటను విమర్శించొద్దు అంటే కష్టం.<br />
<br />
అలాగని సినిమా శాస్త్రీయంగా ఉండాలనుకోవడమూ తప్పే. సినిమా శాస్రీయంగా ఉంటే జానపదాలు, సైన్సు ఫిక్షన్లూ (రెంటికీ ఒక్కోసారి పెద్ద తేడా ఉండదు), దెయ్యాల సినిమాలు, హారర్ సినిమాలు తీయడం సాధ్యం కాదు. కానీ సినిమాకు తప్పకుండా ఉండాల్సింది లాజికల్ కన్సిస్టెన్సీ. అంటే దర్శకుడు తాను చెప్పాలనుకునే తర్కానికి సినిమా అంతా సరిపోయేలా చూసుకోవాలి. ఉదాహరణకు "టైం ట్రావెల్" అనేది సాధ్యం అనుకుంటే "బాక్ టు ద ఫ్యూచర్" సినిమా అంతా ఆతర్కానికి సరిపోయేలా ఉంటుంది.<br />
<br />
"నేనొక్కడినే" సినిమాలో నాకు నచ్చని అంశాలు:హీరోకు మొదటి సీనులో మాత్రం కనిపించే హెలూసినేషన్లు మళ్ళీ ఎప్పుడూ కనిపించవు, హీరో మాత్రం అప్పుడప్పుడూ ఇది నిజమా భ్రమా అన్న సందేహంలో ఉంటాడు. రెండోది ఒక సైకలాజికల్ సినిమా తీయాలనుకున్న దర్శకుడు ఒక కమేడియన్ను డాక్టరుగా చూపించి వెకిలి వేశాలు వేయించడం.<br />
<br />
నచ్చిన అంశం, ఇదొక కొత్త ప్రయత్నం, ఏ హాలీవుడ్ సినిమాకు కూడా మక్కీకి మక్కీ కాదు(నాకు తెలిసి). కాస్త వెరైటీగా తీసిన తెలుగు, హిందీ సినిమాల్లో హాలీవుడ్నుండి మక్కీకి మక్కీ కొట్టనివి అరుదు. (నేను చిన్నప్పుడు చూసిన లేత మనసులు అనే సినిమా కూడా ఒక హాలీవుడ్ సినిమాకి కాపీ అని తరువాత మరో ఇంగ్లీషు సినిమా చూస్తుంటే తెలిసింది). ఎవరో ఒకరు వకాయతో బెండకాయ పులుసు చేసే ప్రయత్నం చేయకపోతే బెండకాయ పులుసు ఎన్నటికీ ఆవిశ్కారం కాదు.<br />
<div>
<br /></div>
</div>
సత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.com1tag:blogger.com,1999:blog-4596590595254101156.post-69820017614492560042013-10-20T05:57:00.003+03:002013-10-20T05:57:41.571+03:00నీళ్లు మింగేశారు!<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<br /><div class="content" style="background-color: white; font-family: Conv_Web-Font, sans-serif; font-size: 18px; line-height: 25px; margin-top: 4px;">
-జీవోఎంకు సీమాంధ్ర తప్పుడు నీటి లెక్కలు.. పెన్నాకు కృష్ణాజలాలు, కృష్ణాకు గోదావరి జలాలు<br />-బేసిన్లు మార్చేశారు.. నదులను మళ్లించారు.. ఆవిరి గుప్పిట పట్టారు.. మిగులు జలాలు మింగేశారు<br />-6శాతం వాటాకు 30శాతం చూపించారు.. సుప్రీంను ఆశ్రయించనున్న రిటైర్డ్ ఇంజినీర్లు<br />-నీటి మంత్రి జైత్రయాత్రల్లో బిజీబిజీ</div>
<div class="content" style="background-color: white; font-family: Conv_Web-Font, sans-serif; font-size: 18px; line-height: 25px; margin-top: 4px;">
<br />హైదరాబాద్, అక్టోబర్ 19 (టీ మీడియా):రాష్ట్ర విభజన వేళ ఆఖరి దోఖా జరుగుతోంది. రెండు జీవనదులున్న తెలంగాణకు నీళ్లు దక్కకుండా తరలించుకుపోయే కుట్ర జరుగుతోంది. సర్కారు వ్యవస్థపై నమ్మకంతో ఉన్న తెలంగాణ ప్రజలను కీలక స్థానాల్లో ఉన్న సీమాంధ్ర పెద్దలు ముంచుతున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించిన వారి అక్రమ ప్రాజెక్టులన్నింటికీ నీటి కేటాయింపులు చూపించుకుంటూ లెక్కలు తయారు చేశారు. తెలంగాణ నాయకుడే మంత్రిగా ఉన్న నీటి పారుదలశాఖలో అధికారులు తప్పుడు లెక్కలు తయారుచేస్తుంటే సదరు నాయకుడు జైత్రయాత్రల్లో బిజీబిజీగా ఉన్నారు. సీమాంధ్ర సర్కారు పంపిన లెక్కల ప్రకారమే నీటి పంపకాలు జరిగితే తెలంగాణ మరో 37 ఏళ్లు నీటిపై హక్కుల కోసం కనీసం పోరాడే న్యాయమైన హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది.<br /><img alt="water-copy" class="imgRight" src="http://img.namasthetelangaana.com/updates/2013/Oct/20/water-copy.png" style="border: 1px solid rgb(203, 202, 202); float: right; margin: 0px 5px 15px 10px; padding: 4px;" /><br />కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర విభజన కోసం ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందానికి రాష్ట్ర జలనవనరుల శాఖ తప్పుడు లెక్కలు పంపింది. సీమాంధ్రలోని అక్రమ ప్రాజెక్టులన్నింటికీ నీటి కేటాయింపులు అధికారికం చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా నీటి దోపిడీని అధికారికంగా కొనసాగించే విధంగా కాకి లెక్కలు రూపొందించారు. ఏకంగా కృష్ణా నదిని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దర్జాగా మళ్లించుకునే విధంగా పకడ్బందీ లెక్కలు వేశారు. నదీ పరివాహక ప్రాంతం (క్యాచ్మెంట్ ఏరియా) ప్రకారం నీటి కేటాయింపులు జరిపితే తెలంగాణకు 548 టీ ఎంసీల నీటికి కేటాయించాలి. అయితే ఇప్పటి వరకు తెలంగాణకు కేటాయించిన జలాలు కేవలం 298.96 టీఎంసీలే. ఇపుడు ఈ నీటిని కూడా తెలంగాణకు దక్కకుండా చేస్తున్నారు. మిగులు జలాలను సీమాంవూధలోని పెన్నా బేసిన్కు తరలించారు. మిగులు జలాలు నికరంగా వస్తాయన్న ధీమా లేకపోవడంతో ఆస్థానంలో నికర జలాలనే తరలించాలని సీమాంధ్ర సర్కారు పెద్దలు నిర్ణయానికి వచ్చినట్లు జీవోఎంకు ఇచ్చిన నివేదిక ద్వారా తెలుస్తున్నది.<br /><br /><b>గోదావరి జలాలు కృష్ణాకట..: </b><br />గోదావరిలోని నీటిని అక్రమ పద్దతుల్లో మళ్లించడానికి రూ.19,521 కోట్లతో దుమ్ముగూడెం-నాగార్జున సాగర్ నిర్మించి దీని ద్వారా 165 టీఎంసీల వరద నీటిని కృష్ణాకు మళ్లించేందుకు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కుట్ర జరిగింది. ఇందులో 130 టీఎంసీల నీటిని కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులకు వినియోగిస్తారని, దీంతో కృష్ణా నీటిని అదనంగా వినియోగించుకున్నట్లు కాదని సీమాంధ్ర సర్కారు కేంద్ర మంత్రి బృందానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నది. వాస్తవానికి తెలంగాణ నుంచి వచ్చిన అభ్యంతరాలతో ఈ ప్రాజెక్టుపై సర్వేలకు, మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద దాదాపు రూ. 500 కోట్లు ఖర్చు చేసి తరువాత మూలకు పడేశారు. ఇది అస్తిత్వంలో లేదు.<br /><br />అయినా దీనిని విభజన సందర్భంగా తెరపైకి తీసుకువచ్చి నీటి వాటా కొట్టేసేందుకు లెక్కలు వేసి పంపించారు. పైగా ఈ ప్రాజెక్టును తెలంగాణ కోటా కింద చూపించే యత్నం చేశారు. ఈ నీటిని కోస్తాంధ్రకు చూపించి శ్రీశైలం వద్ద కృష్ణా నదిని సీమ ప్రాజెక్టులకు మళ్లించుకునేందుకు వైఎస్ సర్కారు ఎత్తుగడలో ఈ ప్రాజెక్టు పుట్టుకొచ్చింది. దీనికి రాష్ట్ర విభజన సమయంలో ఆమోద ముద్ర వేయించుకునేందుకు సీమాంధ్ర సర్కారు కుట్ర చేసింది. తెలంగాణ సమాజం అభ్యంతరాలతో మూలకు పడిన ఈ ప్రాజెక్టు తెరపైకి తీసుకురావడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా బేసిన్కు 80 టీ ఎంసీలు మళ్లించ వచ్చు, దీనిపై ట్రిబ్యునల్లో వచ్చిన వాదనల సందర్భంగా 54 టీఎంసీలు ఏపీ వాడుకుంటే మరో 35 టీఎంసీల నీరు కర్ణాటక, మహారాష్ట్ర వాడు కోవడానికి ట్రిబ్యునలే హక్కు కల్పించింది. కానీ జీవోఎంకు ఇచ్చిన నివేదికలో దీని ప్రస్తావనే లేదు. కృష్ణా జల్లాలో ట్రిబ్యునల్స్ కేటాయించిన 298.98 టీఎంసీల నీటిలో 245 టీఎంసీల నీటిని కాజేయాలని పన్నాగం పన్నారు.<br /><br /><b>వాదనల సమయంలోనే తెలంగాణకు అన్యాయం</b><br />బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనల సమయంలోనే తెలంగాణకు సీమాంధ్ర సర్కారు అన్యాయం చేసింది. కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ను 519 అడుగుల నుంచి 526 అడుగుల ఎత్తుకు పెంచుకొని 120 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుంటామని, దీనికి ఆంధ్ర ప్రదేశ్ అనుమతిస్తే 50 టీఎంసీల నీటిని ఆల్మట్టిలో నిల్వ చేసి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఆఫర్ ఇచ్చింది. దీనికి సర్కారు అనుమతి ఇస్తే 50 టీ ఎంసీల నీటిలో దాదాపు 40 టీఎంసీల నీటిని వెనుకబడిన జిల్లా మహబూబ్నగర్కు గ్రావిటి ద్వారా వచ్చేవి. కానీ దీనికి అంగీ కరించని సర్కారు కృష్ణా మిగులు జలాలపైనే ఆధారపడి పెన్నా బేసిన్లో పాజెక్టులు నిర్మి ంచామని, వాదనలు చేసింది. ఈ వాదనల్లో పసలేక పోవడంతో బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ 526 అడుగుల ఎత్తుకు ఆల్మట్టిని నిర్మించుకోవడానికి అనుమతిచ్చింది. దీంతో కర్ణాటక ఇస్తానన్న 50 టీఎంసీల నీటి ఆఫర్ కూడా చేజారింది. ఫలితంగా మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు పూర్తిగా, వరంగల్, ఖమ్మం జిల్లాలు పాక్షికంగా నష్టపోయాయి.<br /><br />బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాలను నదీ పరివాహక ప్రాంతాలకే కేటాయించాలని చెప్పింది. కృష్ణా నదీపరివాహక ప్రాంతం తెలంగాణలో 68 శాతానికి పైగా ఉంది. ఈ లెక్కన మిగులు జలాల్లో 68 శాతం తెలంగాణకే రావాల్సి ఉంది. అయితే కేవలం 30 శాతం మాత్రమే కేటాయించినట్లు జీవోఎంకు ఇప్పుడు నివేదిక పంపారు. మిగులు జలాల పంపిణీలో కూడా కేవలం 77 టీఎంసీలే తెలంగాణ కోటాకు చూపించారు. రాయలసీమకు 107 టీఎంసీలు, కోస్తాకు 43.50 టీఎంసీలు కేటాయించినట్లుగా చూపించారు. ఈ పద్దతుల్లో 100 టీఎంసీలను పోతిరెడ్డి పాడు హెడ్గ్యులేటర్ ద్వారా సీమకు మళ్లించుకున్నారు ఇక నాగార్జున సాగర్ డ్యామ్కు నాలుగు వేల కోట్ల రుణం ద్వారా ఆధునీకరణ చేపట్టినా ఒక్క టీఎంసీ నీరు కూడా ఆదా అయినట్లు లెక్కల్లో చూపించకపోవడం గమనార్హం. కనీసం 15 శాతం నీటిని ఆదా కింద వేసినా కనీసం 40 టీఎంసీల నీరు లెక్కల్లోకి వస్తుందంటున్నారు.<br /><br />ఇదే జరిగితే తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపు మరి కొంత ఆశాజనకంగా ఉంటుంది. ఇదే తీరుగా శ్రీశైలం డ్యామ్లో 33 టీఎంసీల నీరు ఆవిరి అవుతుందని, గోదావరి నదిపై అసలు ప్రాజక్టే లేని ఇచ్చంపల్లికి 35 టీఎంసీలు కేటాయించారు. ఇది కాకుండా 44 టీఎంసీల నీరు ఆవిరి అవుతుందని, దీనిని జలవిద్యుత్ ప్రాజెక్టు కింద వేరుగా చూపారు. ఇదెక్కడి లెక్కనో అర్థం కావడం లేదని ఇదేశాఖలో పనిచేసి పదవీవిరమణ చేసిన ఇంజనీర్లే విస్తు పోతున్నారు.<br /><br /><b>సుప్రీంను ఆశ్రయిస్తాం:</b><br />రాష్ట్ర ప్రభుత్వం నీటి పంపకాలపై కేంద్ర మంత్రివర్గ బృందం (జీవోఎం)కు ఇచ్చిన నివేదిక తెలంగాణకు భవిష్యత్లో కూడా న్యాయం జరిగే అవకాశం లేని విధంగా ఉందని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాదరెడ్డి అన్నారు. నీటి పంపకాలు నదీపరివాహక ప్రాంతాలకే పంపిణీ చేయాలన్నారు. ఒక బేసిన్ జలాలను మరో బేసిన్కు తరలిస్తున్నట్లు చూపించడం అక్రమమన్నారు. విభజన తరువాత తెలంగాణ రాష్ట్రం తరపున వాదనలు విని, తెలంగాణకు న్యాయం చేసే విధంగా తీర్పు ఇవ్వాలని అన్నారు. ఈ మేరకు ట్రిబ్యునల్ తీర్పును వాయిదా వేయాలని కోరారు. కేంద్రం అధికారికంగా రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించిన నేపధ్యంలో తాము బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పును వాయిదా వేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు.<br /><br /><b>ఇచ్చంపల్లికి సమాధి...</b><br />ఇచ్చంపల్లి ప్రాజెక్టును సీమాంధ్ర సర్కారు సమాధి చేసింది. 1978లోనే ఈ ప్రాజెక్టుపై జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం దీని నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. ఆనాడు వెంటనే నిర్మాణం చేపట్టి ఉంటే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. అయితే సీమాంధ్ర ముఖ్యమంత్రులు మూలకు పడేశారు. ఫలితంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తరువాత కాటన్ బ్యారేజి వరకు 650 కిలో మీటర్లు ఒక్క ప్రాజెక్టు కూడా లేక తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది.</div>
</div>
సత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.com2tag:blogger.com,1999:blog-4596590595254101156.post-12208675726459000842012-12-31T17:59:00.001+02:002012-12-31T18:33:49.456+02:00అమానత్కు జస్టిస్, ఆయేషాకు ఇన్జస్టిస్<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<br />
<br />
ఢిల్లీలో ఒక మెడికో దారుణంగా బస్సులో అత్యాచారానికి గురయి, మృత్యువుతో పోరాడి చనిపోయింది. ఇది చాలా బాధాకరమయిన విషయం, ప్రతిఒక్కరు ఖండించాల్సిన విషయం. ఇలాంటి సంఘటనలు పాల్పడిన వారికి తగిన శిక్షపడాలి అని అందరూ ఒప్పుకునే విషయం. ఈ సంఘటనలో బాధితురాలి కుటుంబానికి నాసానుభూతిని ఇవ్వడం మినహా నేను చెయ్యగలిగిందేదీ లేదు. <br />
<br />
అయితే నాకర్ధం కాని విషయం ఏంటంటే రెండువారాలుగా ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర యువత ఆమ్మాయికి న్యాయం చెయ్యాలని భీభత్సమగా నిరశనలు చేస్తునే వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలు, టియర్ గ్యాస్లు ప్రయోస్తున్నారట. ఇంతకూ ఈఆందోళనకారులు ఆశించే న్యాయం ఏమిటి? సంఘటన జరిగిన రెండ్రోజుల్లోగా అందరు నేరస్థులనూ పోలీసులు అరెస్టు చేసి కేసు పెట్టారు. త్వరలోనే విచారణ ముగుస్తుంది, అందరికీ తగి శిక్షలు పడతాయి. ఆనేరస్థులెవరూ బడా బాబులు కొడుకులు గాదు కనుక శిక్ష పడకుండా తప్పించుకోగలరు అనే అనుమానం కూడా ఎవ్వరికీ లేదు. మరి ఆందోళన కారులు ఆశించే న్యాయం ఏమిటి?<br />
<br />
ఆసంఘటన జరిగిన తరువాత మరో మూడు సంఘటనలు దాదాపు అలాంటివే ఢిల్లీలోనూ, మరో రెండు బెంగుళూరులోనూ, ఇంకొన్ని యూపీలోనూ జరిగాయని వార్తల్లో వచ్చింది. ఈసంఘటనల్లో నేరస్థుల్ని అరెస్తు చేశారో లేదో కూడా తెలియదు. మీడియా రిపోర్ట్ చెయ్యడం అయితే చేసింది గానీ మిగతా సంఘటనలనేమీ పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. జనం కూడా మిగతా సంఘటణలను పట్టించుకోలేదు. ఢిల్లీ అమ్మాయికి జరగాల్సిన న్యాయం తప్ప మిగతావారికి న్యాయం జరగాల్సిన అవసరం లేదా అనిపిస్తుంది.<br />
<br />
కొన్ని సంవత్సరాలక్రితం విజయవాడలో ఆయేషామీరా అనే అమ్మాయిపై హాస్టల్లో ఘోరంగా అత్యాచారం చేసి చంపేశారు. ఆకేసులో అసలు నేరస్థులెవరూ కనీసం విచారించినట్లు కూడా లేదు. ఎవడో జేబుదొంగను దొరికించుకుని ఇరికించి జైళ్ళో పెట్టారు. పాపం ఆ ఆయేషాకు న్యాయం జరగాలని ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్లు లేదు.<br />
<br />
అంతకుముందు ఇలాంటిదే మరో సంఘటన ప్రత్యూష అనే జానియర్ ఆర్టిస్టుపై కూడా జరిగింది. అక్కడకూడా ముద్దాయిలు బలమయిన వాళ్ళు కావడంతో శిక్షలు పడ్డట్టులేదు. ఇలాగే ఢిల్లీలో జెస్సికా లాల్ హత్య విషయంలోనూ జరిగింది. కానీ అక్కడ నేషనల్ మీడియా జోక్యం చేసుకోవడంతో అసలు నేరస్థుడికి లేటుగానయినా శిక్ష పడింది.<br />
<br />
రోజూ ఇలాంటి సంఘటనలు ఎక్కడపడితే అక్కడ జరుగుతుంటే, ఎందరో బడాబాబుల పుత్రరత్నాలు కేసులు తప్పించుకుంటే ఎన్నడూ రోడ్లపైకి రాని జనం ఇప్పుడు ఈఢిల్లీ అమ్మాయి విషయంలో మాత్రం ఎందుకు వస్తున్నారో? పోనీ ఇప్పుడయినా ప్రజల్లో చైతన్యం వచ్చిందిలే అనుకుంటే ఆతరువాత కూడా అలాంటి సంఘటనలెన్నో జరిగాయే? అయినా నేరస్థులను అరెస్టుచేసి విచారిస్తుంటే ఇంకా ఏం చేయాలి? ఈ అమ్మాయికి ఇంత అటెన్షను రావడానికి కారణం ఆమే ఢిల్లికి చెందినది కావడమా? లేక నేరస్థులు పెద్ద బలమయిన వర్గాల బ్యాకింగ్ లేని వారు కావడం వల్లనా? లేక ఎవరో అమ్మాయిల దుస్తులవిషయంలో కామెంటు చేసినందుకా? <br />
<br /></div>
సత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.com4tag:blogger.com,1999:blog-4596590595254101156.post-33009497941382281042012-12-05T07:00:00.000+02:002012-12-05T08:29:58.822+02:00నార్వేలో బాలల హక్కులు, ఏపీలో బాలలపై హింస<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; font-size: 15px; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi9Csm_ZkI5KH-FalVVWqmKdXSSMiHYquHAJYfmXArWxDQZCsehTEgLJmBm-fMpb2Uj-XU_UNIPNEJwZap_MjqNGtHJ_gyykMJESgdsl-7z80qZKN-GFmYNu3XaGuPHbj0fiyy6VQdNT6o/s1600/1245737357ew5F0Z.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="320" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi9Csm_ZkI5KH-FalVVWqmKdXSSMiHYquHAJYfmXArWxDQZCsehTEgLJmBm-fMpb2Uj-XU_UNIPNEJwZap_MjqNGtHJ_gyykMJESgdsl-7z80qZKN-GFmYNu3XaGuPHbj0fiyy6VQdNT6o/s320/1245737357ew5F0Z.jpg" width="212" /></a></div>
<br />
ఉద్యోగనిమిత్తం నార్వే వెల్లిన ఒక తెలుగు దంపతులు తమ కొడుకును హింసించారని అక్కడిపోలీసులు అరెస్టు చేశారు, తరువాత కోర్టు శిక్ష విధించింది. ఇక ఆవిషయాన్ని అదేదో ప్రపంచవింత అయినట్టు గత మూడు రోజులుగా మన టీవీ9, ఏబీఎన్,సాక్షి మొదలగు అన్ని ఛానెల్లూ డిస్కషన్లు పెట్టి ఊదరగొడుతున్నాయి. ఆఖరుకు నేషనల్ మీడియాకూడా దీన్ని కవర్ చేసింది.నార్వే ప్రభుత్వానికి పిల్లలపై ఉన్న శ్రద్ధను అభినందించాల్సింది పోయి అక్కడి చట్టన్నే తప్పు పడుతున్నారు. అసలు దేశంలో ఇదితప్ప ఇంకో ఇష్యూలేదు అన్నట్టు కేంద్రమంత్రి వాయలార్ రవి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, లగడపాటి అందరూ కంగారుపడిపోతున్నారు. <br />
<br />
ఈలోగా యధాలాపంగా పేపర్లు చూస్తుంటే ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక మూల ఇంకో వార్త కనిపించింది. నెల్లూరులో ఒకబాలకార్మికుడిని పనిలో పెట్టుకున్న ఒక డాబా వోనరు ఆబాలున్ని తీవ్రంగా కొట్టడంతో బాలుడు చనిపోయాడు. ఆపిల్లవాడి తండ్రి ఇంతకుముందు అదే డాబాలో పనిచేసేవాడట, డాబా వోనరుదగ్గర అతను పన్నెండువేలరూపాయలు అప్పుతీసుకున్నాడట. అప్పుతీర్చక పనిమాన్సేసినందుకు వెట్టిచాకిరీకింద కొడుకును పనిలోపేట్టుకున్నాడా డాబావోనరు. <br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhJyIcHNsiz8lSmKxdkEI-xPlU6qHR9JLpymirg0_NnZNeED8v4Lk5efQhumWnHwXlqSYW30pLnDY0LSLB1HdbyU8bGrecGbkfgenhF86mrcLr8GtokN_5GncqCwvLZtTnOhuiC7NMEBWM/s1600/nellore.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="360" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhJyIcHNsiz8lSmKxdkEI-xPlU6qHR9JLpymirg0_NnZNeED8v4Lk5efQhumWnHwXlqSYW30pLnDY0LSLB1HdbyU8bGrecGbkfgenhF86mrcLr8GtokN_5GncqCwvLZtTnOhuiC7NMEBWM/s400/nellore.jpg" width="400" /></a></div>
<br />
నార్వేలో పిల్లాన్ని కొట్టినందుకు శిక్షవిధిస్తే ఇదేం విడ్డూరం అనిఊదరగొడుతున్న ఛానెల్లలో ఒక్కటికూడా ఈవార్తను మాత్రం ప్రసారం చేయలేదు. ఎందుకు చేస్తారు? మనదేశంలో బాలకార్మికులు ఉండడం వింతకాదు, వెట్టిచాకిరీ వింతకాదు, పిల్లలను కొట్టడం వింతకాదు, కొడితే పిల్లలు చనిపోవడం వింతకాదు. మరి ఎలాంటి విడ్డూరమూలేని ఆవార్తను ప్రసారం చేస్తే టీవీ ఛానెళ్ళ టీఆర్పీ ఎలా పెరుగుతుంది? అలాంటివర్తలు ప్రసారం చేస్తే జనం మాత్రం ఎందుకు చూస్తారు? ఛానెల్ మార్చి ఏడుపుగొట్టు సీరియల్లు చూస్తారు గానీ?<br />
<br />
అయినా ఏఎన్నారైనో జైళ్ళో పెడితే మనకు వార్తగానీ కూలిపని చేసుకునే పిల్లగాడిని కొట్టిచంపితే అది వార్తెలా అవుతుంది? ఎన్నారైలలో మాత్రం ఐటీ ఇంజనీర్లకు ఏమన్నా అయితే వార్తగానీ ఏదుబాయి కెల్లిన కార్మికుడినో జైల్లో పెడితే అది వార్తా?</div>
సత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.com8tag:blogger.com,1999:blog-4596590595254101156.post-43920253668386973082012-11-28T12:30:00.000+02:002012-11-28T12:37:42.422+02:00హెడ్క్వార్టర్స్ చంచల్గూడ<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiswF4_0Rw7MYTxGPxnYga7lPlgLVyGqvgPqI5C-wEqSyMW35bzD7yy6aPmpvvcGmmsOuj0Udv-nxTj6jDlo6cuJpgcgT4prBNDsSnyTt3zFzUpLEVWsN7GDAxoDcL_re6SqwQ6H8RAxgo/s1600/Newswala-i-Cbi_jaganmohan_reddy_chanchalguda_jail_prison4.JPG" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="213" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiswF4_0Rw7MYTxGPxnYga7lPlgLVyGqvgPqI5C-wEqSyMW35bzD7yy6aPmpvvcGmmsOuj0Udv-nxTj6jDlo6cuJpgcgT4prBNDsSnyTt3zFzUpLEVWsN7GDAxoDcL_re6SqwQ6H8RAxgo/s320/Newswala-i-Cbi_jaganmohan_reddy_chanchalguda_jail_prison4.JPG" width="320" /></a></div>
<br />
<br />
జైళ్ళో ఎవరుంటారు? నేరంచేసి శిక్షననుభవిస్తున్న ఖైదీలూ లేదా నేరారోపణలతో విచారణనెదుర్కుంటున్నవారు ఉంటారు. అప్పుడప్పుడూ వారిని కలుసుకోవడానికి వారి కుటుంబ సభ్యులు వెల్లి స్వీట్లు లాంటివి ఇస్తుంటారు. అయితే ప్రస్తుతం మన రాష్ట్రంలో మాత్రం గమ్మత్తయిన పరిస్తితి ఏర్పడింది. ఒక పార్టీ హెడ్క్వార్టరుగా చంచల్గూడ జైలు సేవలందిస్తుంది.<br />
<br />
కాంగ్రేస్ పార్టీ ఆఫీసుగా గాంధీభవన్, తెదేపా ఆఫీసుగా ఎంటీఆర్ట్రస్టు భవన్ , తెరాస పార్టీ ఆఫీసుగా తెలంగాణభవన్ వ్యవహరిస్తుంటే వైకాప ఆఫీసుగా మాత్రం ప్రభుత్వభవనం చంచల్గూడ జైలు మారింది.చక్కగా కిరాయి చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. పార్టీ కార్యకలాపాలు, పాదయాత్ర ప్లానింగు మొత్తం జైలునుండే నడుస్తుంది.<br />
<br />
ముంబయి మాఫియా అంతా దుబాయి నుండి దావూద్ ఇబ్రహీం నడపడం మనం గతంలో విని ఉన్నాం. సూరి లాంటి కొందరు ఫాక్షనిస్టు లీడర్లు గతంలో జైలు నుండే ప్లానింగ్ చేసి ప్రతీకారాలు తీర్చుకోవడం చూశాం. జైలు నుండి పోటీచేసి ఎలక్షన్లలో గెలిచినవారిని చూశాం. ఇప్పుడు వెరైటీగా పార్టీకి జైలు హెడ్క్వార్టరుగా మారడం చూస్తున్నాం.<br />
<br />
చంచల్గూడలో విజిటర్లు కుటుంబ సభ్యులు, వైకాప పార్టీ నాయకులు మాత్రమే కాదు. రోజుకొక తెదేపా నాయకుడు చంచల్గూడకు వెల్లడం, తెల్లారి అతను సస్పెన్షన్కు గురికావడం ఒక తంతుగా మారింది. మొన్న నాని, నిన్న ప్రవెణ్రెడ్డి, ఈరోజు ఉమ్మారెడ్డి..రేపెవరో!! చంద్రబాబుకు చంచల్గూడ జైలు వెన్నులో చలి పుట్టిస్తుంది.<br />
<br />
<br />
పక్కపార్టీలనుండి లీడర్లను కొనడానికి తండ్రిపాలనలో దోచుకున్న లక్షకోట్లు, కిరాయి అవసరం లేని పార్టీ ఆఫీసు, జైల్లో ఉన్నందుకు తల్లీ చెల్లెల్లూ ఏడుస్తూ కూడగట్టుతున్న సింపతీ. ఎలక్షన్లయ్యాక గెలిచినపార్టీకి మద్దతిస్తే కేసులు కూడా మాఫీ కావచ్చు. మొత్తానికి జగన్కి అంతా అనుకూలంగా నడుస్తున్నట్టుంది.<br />
<br />
అయితే జగన్కూ చంద్రబాబుకూ చాలా పోలికలు కనబడుతున్నాయి. ఇద్దరిదీ రెండు కళ్ళసిద్ధాంతం, ఇద్దరూ తమ లేదా తమ తండ్రి పాలన స్వర్ణయుగమని, అవతలివారిది దుష్టపాలన అనీ చెప్పుకుంటారు. ఇద్దరూ మరోవ్యక్తిని నమ్మరు. ఇద్దరి పార్టీల్లోనూ నంబర్ టూ ఎవరూ ఉండరు. ఇప్పుడు జగన్ జైల్లో పడ్డట్టే బహుషా భవిష్యత్తులో చంద్రబాబు కూడా జైలుకెల్లే వంతు వస్తుందేమో.<br />
<br /></div>
సత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.com1tag:blogger.com,1999:blog-4596590595254101156.post-70853318309257473842012-11-17T10:00:00.000+02:002012-12-08T21:51:56.785+02:00వ్యతిరేకం కాదు (కథ) <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<br />
<br />
"ఈదోమలు పాడుబడ, ఒక్కటె శెవులల్ల గుయ్య్ గుయ్య్ మంటయ్!" నిద్రపట్టక పక్కమీద మెసులుతున్న చిన్నారావు గొణిగిండు.<br />
<br />
"సప్పుడు జెయ్యకుంట పండుకోరాదు?" నిద్రలోనే కసిరింది భార్య రాజమ్మ.<br />
<br />
పడుకోనయితె పడుకుండుగని చిన్నారావుకు ఎంతకూ నిద్ర ఒస్తలేదు. ఒక్కటే ఆలోచనలు...ఏం జేశేది? ఈసారి ఎలక్షన్లలో గెలిచేది ఎట్ల?<br />
<br />
తన సమస్య అట్లాంటిది మరి. చిన్నారావు ఊరికి సర్పంచి. మంచి మాటకారీ, రాజకీయ చతురుడు. కొండగడపలొ రాజకీయాలల్లో పట్టున్న నాయకుడు. తను అగ్రకులం వాడే అయినా ఊళ్ళోని బీసీలు, దళితులు అందరినీ మాయజేసి, మభ్యపెట్టి మరీ అందరి మద్దతునూ కూడగట్టి రెండుసార్లు ఊరికి సర్పంచి అయిండు. ఊళ్ళో రాజకీయంగా చిన్నారావుకు తిరుగులేదు. ఇప్పటిదాకా అంతాబాగానే ఉందిగానీ ఇప్పుడు కొత్తగాతన బామ్మర్ది జెయ్యబట్టి చిన్నారావుకు సమస్యొచ్చింది.<br />
<br />
చిన్నారావు బామ్మర్ది ఏడుకొండలు డిగ్రీ ఫెయిలయి ఇంట్లో ఉంటుంటే తన చేతికింద ఉంటడని రాజమ్మ తన ఇంట్లోనే ఉంచుకుంటుంది. ఏడుకొండలు కాస్త రౌడీటైపు. తాగడం, ఆడవారిపై అసభ్యంగా ప్రవర్తించడం లాంటి అలవాట్లు మొదట్నుంచీ ఉన్నాయి.<br />
<br />
ఊర్లో మంచినీళ్ళబాయి దగ్గరికొచ్చిన మాలపిల్ల గౌరిని ఏడిపించబోతే అక్కడ ఉన్న కొందరు దళిత యువకులు చితక్కొట్టి పంపించారు.పక్కూరికి పనికెల్లి వస్తున్న నలుగురు దళితయువకులను దారికాచి దాడిచేశాడు. దాడిలో దళిత యువకులకు బాగా కత్తి గాట్లుపడి ఇప్పుడు వాళ్ళు పట్నంలో పెద్దదావకాన్ల ఉన్నరు.<br />
<br />
<br />
<br />
బామ్మర్దిది తప్పని ఒప్పుకుందామంటే ఇంట్లో భార్యక్కోపం. సర్లే మనకేంది అని ఊరుకుందామంటే రెండునెలల్లో ఎన్నికలాయె, దళితుల వోట్లు లేనిదే గెలవడమెట్ల?ఇట్లనే ఆలోచిస్తుంటె చిన్నారావుకు అంతకుముందు పేపర్లో జదివిన రెండుకళ్ళ సిద్ధాంతం యాదికొచ్చింది. "అరె, నాపరిస్థితి గుడ గిట్లనె ఉంది, గిదేజేద్దాం. రేప్పొద్దున ఏదో ఒకటి జెప్పి మాలోల్ల నోరు మూయిద్దంలే", అనుకుంటూ నిద్రలోకి జారుకుండు.<br />
<br />
* * * * *<br />
<br />
<br />
తెల్లారి తనదొడ్డిలో పనిజేసే కిష్టయ్య, యాదయ్యలను తీసుకుని దళితవాడకు బయల్దేరిండు. కిష్టయ్య, యాదయ్యలు దళితులే..వాళ్ళకూ జరిగిన అన్యాయం చూస్తుంటే కోపమొస్తుంది. అట్లని యజమాని మాట యినకబోతె పొట్టగడిచేదెట్ల అనుకుని సప్పుడు గాకుండ ఉంటుండ్రు.<br />
<br />
<br />
సర్పంచి వచ్చిండు, బామ్మర్ది గురించి ఏం మాట్లాడుదమో ఇందమని గూడెంల పెద్దలందరు గుడిసెలనుంచి బయటకొచ్చిన్రు.<br />
<br />
<br />
యాపచెట్టుకింద ఉన్న గుండ్రాయి మీద గూసొని చిన్నారావు వచ్చినోళ్ళను గుడ కూసొమ్మని సైగ జేశిండు.<br />
<br />
"నర్సప్పా! ఎల్లయ్య! కూసుండ్రా. మీపిలగాండ్లకు దెబ్బలు దాకినయని తెలిశింది, నాకు శాన బాదయింది. గిది జెప్పుదామనె గిట్లొచ్చిన."<br />
<br />
<br />
"ఇది జేయించింది మీ బామ్మర్ది ఏడుకొండలే" కాస్త దూరంగా నిల్చున్న శేఖర్ అన్నడు. శేఖర్ దళితుడే అయినా పట్నంల హాస్టల్ల ఉండి చదువుకుంటుండు.<br />
<br />
"నాకు మీరొకటి, నా బామ్మర్ది ఒకటి కాదు. మీరు, నాకుటుంబం, నాకు రెండు కండ్లసుంటోళ్ళు. నాపరిస్థితి అర్ధం జేసుకోండ్రి."<br />
<br />
"మరి తప్పు జేశినందుకు మీబామ్మర్దికి ఏం శిక్ష ఏస్తరు?"<br />
<br />
"అరె ఏంది శేకర్, గట్ల మాట్లాడుతవ్? శిక్ష ఏసెటొందుకు నేనెవర్ని? దానికి కోర్టులున్నయ్!"<br />
<br />
"పోలీస్ స్టేషన్ల మా దరకాస్తుగుడ దీసుకుంటలేరు. అడిగితె ఎస్సై మీపేరు జెపుతుండు."<br />
<br />
<br />
"నేనత్లెందుకు జెపుత నర్సప్పా? ఇదంత నాశత్రువులు నామీద జేస్తున్న కుట్ర. జెర మీరు నన్నర్దం జేసుకోండ్రి. ఇగొ, నాపొలంల పనిజేసే కిష్టయ్య, యాదయ్యలను గుడ తీసుకొచ్చిన. వీళ్ళు మీకులపొల్లె. వీల్లు కుడ నాతరఫున మీతోపాటు పోరాటం జేస్తరు."<br />
<br />
"మరి మాపొరగాండ్లను కొట్టింది కుడ నీమనుషులేగద దొర?దానికేం జెయ్యాలె?రెండు దిక్కుల మీరే కొట్లాడుతరా?"<br />
<br />
కాస్సేపు చిన్నారావుకేమనాలో తోచలేదు. చివరికి మెల్లగా అన్నాడు. "నేను మీ పోరాటానికి వ్యతిరేకం కాదు, నా మాట నమ్ముండ్రి."<br />
<br />
"గట్లనా! అయితే మాతో పాటు పోలీస్ స్టేషన్లకొచ్చి మాపిర్యాదు తీసుకొమ్మని ఎస్సైకి జెప్పున్రి. శేయించింది మీ బామ్మర్ది, మీ మనుషులేనని సాక్ష్యం జెప్పున్రి".<br />
<br />
"అరె, గట్ల మాట్లాడుతరేంది నర్సప్ప? నేను మీకు వ్యతిరేకం గాదన్న గని అనుకూలమన్ననా? మీపంచాయితి మీరు జూసుకోండ్రి."<br />
<br />
"మా పంచాయితి మేము జేస్తుంటె పోలీస్ స్టేషన్ల మోకాలడ్డం బెట్టింది మీరే కద?ఊరికి సర్పంచిగ ఇవిషయంల మీ వైఖరేంది?"" <br />
<br />
"గిదంత నా శత్రువుల కుట్రని శెప్పినగద, మల్ల గట్లడుగుతరేంది? మీరు మాత్రం ఎలక్షన్లల్ల మీ వోట్లు నాకే ఎయ్యలి, మరిశిపోకుండ్రీ."<br />
<br />
"ఏస్తమేస్తం. గట్లనె మీ బావబామ్మర్దుల నాటకాలన్ని జూస్తం." ఆవేశంతో అన్నాడు శేఖర్.<br />
<br />
"ఇన్నిరోజులు నేనేం జెప్పినా నమ్మెటోండ్లు, ఇప్పుడు వీళ్ళుగుడ తెలివి మీరిండ్రు. ఇంక వీళ్ళను మోసం జేయడం కష్టం. ఊర్లొ పోశమ్మ గుడి సుట్టు పొర్లుదండాలు బెడితెనన్న గెలుస్తనో?" అనుకుంటూ చిన్నారావు అక్కడినుంచి కదిలిండు.<br />
<div>
<br /></div>
<br />
<br />
<br />
<br />
<br />
<br /></div>
సత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.com4tag:blogger.com,1999:blog-4596590595254101156.post-23909519631833693102012-11-16T09:37:00.005+02:002012-11-16T14:31:07.413+02:00పాపం పురోహితులు...<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<br />
<span style="color: #0033cc; font-family: Conv_NTR, sans-serif;"><span style="font-size: 22px;">-</span></span><span style="background-color: white; color: #333333; font-family: arial, helvetica, sans-serif; font-size: 14px; line-height: 21px; text-align: -webkit-right;">-ఘంటా చక్రపాణి</span><br />
<br />
<div style="text-align: -webkit-right;">
<span style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"><span style="font-size: 14px; line-height: 21px;"><br /></span></span></div>
<span style="background-color: white; color: #333333; font-family: 'Trebuchet MS', Arial, Helvetica, sans-serif; font-size: 12px;"></span><br />
<div class="content" style="background-color: white; font-family: Conv_Web-Font, sans-serif; font-size: 18px; line-height: 25px; margin-top: 4px;">
ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలకంటే సినిమాలే ఎక్కువ వివాదాస్పదం అవుతున్నాయి. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ మొదలైన గొడవలు‘దేనికైనాడీ’అని మోహన్బాబు కుటుంబం నడివీధిలో నిలబడి బ్రాహ్మణులను సవాలు చేయడంతో తారాస్థాయికి చేరుకున్నాయి. ‘వుమెన్ ఇన్ బ్రాహ్మనిజం’ సినిమా బ్రాహ్మణులను ముఖ్యంగా బ్రాహ్మణ స్త్రీలను కించపరిచే విధంగా అసభ్యంగా చూపిందని, అలాగే దేనికైనాడీ సినిమాలో కూడా బ్రాహ్మణకులాన్ని వెకిలిగాచూపి అవమానించారన్నది బ్రాహ్మ ణ సంఘాల అభియోగం. అయితే ఒకటి రెండు దళిత సంఘాలు మినహా ఈ అభియోగాలను ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. మోహన్బాబు ఇంటిముందు, సినిమా థియేటర్ల ముందు బ్రాహ్మణులు చేస్తున్న ధర్నాలు, ఆందోళనల్లో కూడా మిగతా కులసంఘాలు ప్రజాసంఘాలు పాల్గొంటున్నట్టు లేదు. అలాగే రాజకీయ పార్టీలు కూడా బ్రాహ్మణుల ఆందోళనలో భాగం కావడం లేదు. దేవుడికి అపచారం జరిగిందనో, గుడి దగ్గర గొడవ జరిగిందనో ఆందోళనలకు దిగే హిందూ మత ప్రచారక సంఘాలు, పార్టీలు కూడా ఈ విషయంలో పెదవి మెదపడం లేదు. పోనీ బ్రాహ్మణులంతా సంఘటితంగా ఉన్నారా అంటే అదీ లేదు.<br />
<br />
ఇప్పుడు సాగుతున్న ఆందోళనల్లో ఆత్మాభిమానం కలిగిన పేద బ్రాహ్మణులు, కొద్దో గొప్పో ఉద్యమాలతో మమేకమై కదిలిన వాళ్ళు మినహా అగ్రవర్గ బ్రాహ్మణుపూవరూ కనిపించడం లేదు. ఈ బలహీనత తెలిసే మోహన్బాబు మరింత రెచ్చగొట్టే రీతిలో మాట్లాడుతున్నా డు. ఈ సినిమా ఎంత రచ్చకెక్కితే ఆయనకు అంత వ్యాపారం జరుగుతుంది. చాలా కాలంగా పరాజయాల పాలై చితికిపోయిన ఆయన కుటుంబానికి ఒక రకంగా బ్రాహ్మణుల ఆం దోళన జీవం పోసింది. ఆ సినిమాల్లో ఏముంది? ఎందుకవి వివాదాస్పదమయ్యాయి? అన్న విషయా లు వదిలేస్తే, ఏ కులాన్నైనా వెకిలిగా చూపడం, అవమానపరిచే రీతిలో కుల పాత్రలను రూపొందించి కథ నడపడం అనైతికం. కానీ తెలుగు సినిమాలో విలన్లు, రౌడీలు తెలంగాణ ప్రాంతం వాల్లైనట్టే పనిమనుషులు ఉత్తరాంధ్ర వాళ్ళో లేక ఇంకొక వెనుకబడిన ప్రాతం వాళ్ళో అయి ఉంటారు. అలాగే దేశ ద్రోహులు, దుర్మార్గులు మైనారిటీలో, దళితులో లేదా బహుజన కులాల వాళ్ళో అయి ఉంటారు. తెలుగు సినిమా మొదటినుంచీ కులాన్ని, మతాన్ని ప్రస్తావించకుండానే ఆయా పాత్రల వేషధారణ వాళ్ళు ఏ కులం వాళ్ళో చెప్పేస్తుంది. పాత సినిమాల్లో స్మగ్లర్లంతా రాబర్ట్లో, థామస్లో ఉన్నట్టే, వాంప్లు లూసీలు, జూలీ లు ఉంటారు. అలాగే ఈ కాలంలో వీధి రౌడీలంతా నర్సింగ్లు, శ్రీశైలం పేర్లతోనే ఉంటారు. ఒక్క రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాల్లో తప్ప మరెక్కడా ప్రతినాయకులకు అగ్రవర్ణం పేర్లుండవు.<br />
<br />
సమాజంలో బ్రాహ్మణులు అగ్రవర్ణాక్షిగేసరులే అయినప్పటికీ సినిమా రం గం మాత్రం వాళ్ళను అల్పులుగానే చూపిస్తోంది. బూతులు మాట్లాడేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, చాపల్యం ఉన్నవాళ్ళు, తిండిపోతులు ఇట్లా అనేక అల్పపు పాత్రల్లో వారి వేషధారణ, చేష్టలతోనే చెప్పించే సన్నివేశాల్లో మొదటి నుంచీ బ్రాహ్మణులే కనిపిస్తారు. తెలుగు సినిమా మొదటి నుంచీ బ్రాహ్మణుడిని విదూషకుడిగానే పరిగణిస్తూ వచ్చింది తప్ప ఎప్పుడూ నాయకుడిగా చూపలేదు. దానికి తమిళ సినిమా ప్రభావం, ద్రావిడ ఉద్యమం కూడా ఒక కారణమై ఉండవచ్చు. దానికి తోడు సినిమారంగంలో పెట్టుబడి ఒక కార ణం. తెలుగు సినిమా ఇవాళ ఈస్థాయికి రావడానికి ఒకటి రెండు కులాలు, ఒకటి రెండు జిల్లాలే కారణం. మొదటి నుంచీ కోస్తా ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాలే సినిమాను ఏలుతూ వచ్చాయి. ఆ తరువాత గోదావరి జిల్లాలు తోడయ్యాయి.<br />
<br />
ఈ జిల్లాల్లో హరిత విప్లవం, భూస్వామ్యం, వ్యవసాయరంగ విస్తరణ, అభివృద్ధి, అది తెచ్చిన సంపద నేరుగా మద్రాస్కు వెళ్లి పెట్టుబడిగా మారి సినిమా రంగాన్ని ఆక్రమించింది. అప్పటిదాకా గ్రామాల్లో పెత్తనం సాగించిన భూస్వాములు, రైసు మిల్లర్లు, చిన్న చితకా రాజకీయ నాయకులు నేరుగా నిర్మాతలుగా, కొంత తెలివితేటలు ఉన్న వాళ్ళు డైరెక్టర్లు గా మారిపోయారు. మొదట నాటక రంగంలో అనుభవం ఉన్నవాళ్ళు, అభినయం తెలిసిన వాళ్ళు, సినిమాకు పనికొచ్చే వాక్శుద్ధి ఉన్నవాళ్ళు బ్రాహ్మణులే అయినందువల్ల వాళ్ళు నటులుగా ఉండేవాళ్ళు. కానీ భూస్వామ్య కుటుంబాల పిల్లలు ఎదిగి వచ్చాక వాళ్ళే కథానాయకులుగా తెరమీదికి వచ్చారు. వాళ్ళే గడిచిన మూడు తరాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నా రు.<br />
<br />
ఒక దశలో కమ్మ భూస్వామ్య వర్గాలు తెలుగు సినిమా రంగాన్ని పూర్తిగా కైవసం చేసుకున్నాయి. అయితే దాన్ని గోదావరి జిల్లాల కాపులు తరువాతి కాలంలో కొంతమేరకు నిలువరించే ప్రయత్నం చేశారు. తొలి తరంలో కొద్దో గొప్పో త్రిపురనేని రామస్వామి చౌదరి, రఘుపతి వెంకయ్య లాంటి వారి సంస్కరణవాదుల ప్రభావం ఉండడం, వాళ్ళ సినిమాల్లో కొద్దో గొప్పో సం దేశం, సామాజిక ఎజెండా ఉండేది. తరువాతి కాలంలో ఈ వర్గాలే సినిమా స్టూడియోలు స్థాపించి క్రమక్షికమంగా దాన్నొక లాభసాటి వ్యాపారం చేసుకున్నాయి. మధ్యలో కొంత కమ్యూనిస్టు భావాలున్న వాళ్ళు, ప్రజానాట్యమండలిలో పనిచేసి అభ్యుదయ భావాలున్న అనేకమంది సినిమా రంగంలో చేరి కొంతకాలం ప్రజాపక్షం ఉండే విధంగా చూశారు. ఆ తరం అంతరించిపోయాక సినిమా పూర్తిగా ఏకపక్షమే అయ్యింది. ఈ వ్యాపారులు నేరుగా కులం పేర్లతో నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి వంటి కులాల పేర్లు కలిగిన సినిమాలు తీయడం మొదలుపెట్టి వాళ్లే ఆ గ్రామాన్ని, ప్రాంతాన్ని మొత్తం సమాజాన్ని కాపాడేవాళ్లుగా సినిమాలు తీసే స్థాయికి చేరుకున్నారు. సినిమా రంగాన్ని శాసిస్తున్న కులాలు, ప్రాంతమే ఇప్పుడు పత్రికలు, టీవీ మాధ్యమాల మీద కూడా ఆధిపత్యం సాగిస్తున్నాయి. మొత్తంగా సమాజం మీద బలమైన భావ ప్రసరణ, ప్రభావం కలిగించే మాధ్యమాలన్నీ ఒకేవర్గం చేతుల్లో ఉన్నాయి. కాబట్టి బ్రాహ్మణులు ఆత్మగౌరవం కోసం చేస్తున్న నిరసన పెద్దగా ప్రచారానికి కూడా నోచుకోవడం లేదు.<br />
<br />
తెలుగు సినిమాలో బ్రాహ్మణుల పాత్ర గానీ, భాగస్వామ్యం గానీ లేకుం డా పోవడం దీనికి ఒక కారణమైతే, మొత్తం సామాజిక వ్యవస్థకు వాళ్ళు దూరం కావడమే ఇవాళ్టి దురవస్థకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మాటల రచయితలుగా, కవులుగా, గాయకులుగా చాలాకాలమే ఉన్నా వాళ్ళు పెట్టుబడిదారుడైన నిర్మాత చేతిలో డబ్బుకు దాసోహమైపోయారు. అందుకే మోహన్బాబు తన సినిమా కథ రాసింది, నటించిందీ బ్రాహ్మణులేనని దబాయిస్తున్నారు. ఈ మాటే ఒక టీవీ చర్చలో నేను ఏవీఎస్ అనే నటున్ని అడిగితే ‘మేం పొట్టకూటి కోసం నిర్మాతలు ఏం చెపితే అది చేసేవాళ్ళం’ అని చె ప్పారు. అంతే కాదు ‘డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళు చెప్పింది చేయాల్సి ఉంటుంది’ అని కూడా అన్నారు.<br />
<br />
ఆయన మాటల్లో తన నిస్సహాయత కనిపించింది. బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలను వేషాలు వేసి బతికేవాళ్ళు అడ్డుకోవాలనుకోవడం భ్రమ. అది వాళ్ళ వృత్తి. నిజానికి సినిమా రంగంలో చిల్లర వేషాల్లో తప్ప బ్రాహ్మణులు పెద్దగా కనిపించరు. బ్రాహ్మణులు అందివచ్చిన అవకాశాల్ని ఉపయోగించుకుని సృజనాత్మక కళారంగాలు వదిలి మిగతా వృత్తులలోకి మారిపోయారు. చదువుకున్న వాళ్ళు ఉద్యోగాల్లో, డబ్బులున్న వాళ్ళు వ్యాపారాల్లో, వారసత్వ బలమో బలగమో ఉన్న వాళ్ళు రాజకీయాల్లో స్థిరపడిపోయారు. ఒక రకంగా ఇప్పుడు సినిమా రంగంలో మిగతా కులాల్లాగే బ్రాహ్మలూ మైనారిటీలే. వాళ్ళు చాలా కాలం కిందే వదిలేసిన రచ నా వ్యాసంగంలో శూద్ర కులాల్లోని సృజనశీలురు చేరిపోయారు. అయినంత మాత్రాన బ్రాహ్మణులను కించపరచవచ్చా అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. నిజానికి ఏ కులాన్ని గానీ కులవృత్తిని గానీ కించపరిచే విధంగా చిత్రించడం అవివేకం, హక్కుల ఉల్లంఘన కూడా. అది బ్రాహ్మణులైనా, దళితులైనా, ఇతర ఏ కులమైనా వర్తించవలసిన నియమం. కానీ తెలుగు సినిమా నీతి నియమాలను వదిలేసి ఇప్పుడు పూర్తిగా కార్పొరేట్ వ్యాపారమై కూర్చుంది. ఇప్పుడు తెలుగు సినిమా ఒక బ్రాండ్స్ ఫ్యాక్టరీ! ఆ నాలుగు కుటుంబాల్లోని వారసులను బట్టి కథలు, వాళ్ళ రేంజ్కి తగిన మాటలు, పాటలు ఆ మేరకు వందల కోట్ల పెట్టుబడి దానినుంచి వేలకోట్ల వ్యాపారం.<br />
<br />
వ్యాపారంలో లాభానష్టాలే ఉంటాయి తప్ప నైతిక విలువలు ఉండవు. సినిమా కూడా అంతే. కానీ ఇప్పుడు బ్రాహ్మణులు అందులో నీతి ఉండాల ని అంటున్నారు. అది ఒక రకంగా అత్యాశే అవుతుంది. ఎందుకంటే ఒకప్పటిలా సమాజం ఎలా ఉండాలో శాసించే స్థాయిలో ఇప్పుడు బ్రాహ్మణులు లేరు. పైగా సమాజంలోని చాలా వర్గాలకు బ్రాహ్మణులు చాలా దూరంగా ఉంటూ వచ్చారు. పైగా ఇప్పుడు బ్రాహ్మణ వ్యతిరేక భావజాలం బలపడడం కూడా ఒక కారణం. బ్రాహ్మణవాద విలువలకు, బ్రాహ్మణీయ సంస్కృతికి వ్యతిరేకంగా కూడా చాలా సినిమాలే వచ్చాయి. స్వయంగా ఎన్టీఆరే పలు సినిమాలు బ్రాహ్మణీయ విలువలను విమర్శిస్తూ యమగోల వంటి పలు సినిమాలు తీశారు. అప్పుడు కూడా వ్యతిరేకత వచ్చినా ఆ సినిమాల్లో ఆయన భావజాల విమర్శ చేశారు తప్ప వెకిలి తనంతో బ్రాహ్మణులను అవమాన పర్చలేదు.అడ్డదిడ్డంగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మోహన్బాబు మాత్రం ఆ పని చేస్తున్నాడు. బ్రాహ్మణుల సామాజిక బలహీనత ఆయనకు అర్థమయ్యింది.<br />
<br />
దేశంలో సినిమా రంగానికి ఉన్న స్వేచ్ఛ మరే రంగానికీ లేదు. ఎవరైనా ఎలాంటి సినిమాలైనా తీయవచ్చు. సెన్సార్ సర్టిఫికేట్ ఉంటే చాలు ఎక్కడైనా ప్రదర్శించుకోవచ్చు. మన సెన్సార్ బోర్డు పూర్తిగా రాజకీయ నాయకుల తాబేదార్లతో, ప్రొడ్యూసర్ల ఏజెంట్లతో, బ్రోకర్లతో నిండిపోయింది. అందు లో విలువల గురించి ఆలోచించే వాళ్లున్నా వాళ్ళ మాట చెల్లుబాటు కాదు. ఒక దశలో సెన్సార్ బోర్డ్ దేనికైనాడీ సినిమాను ఆలస్యం చేసింది. కానీ మోహన్బాబు తనదైన శైలిలో సెన్సార్ బోర్డ్ మీద విరుచుకుపడ్డారు. దీంతో సెన్సార్బోర్డులో ఉన్న బ్రాహ్మణ సభ్యులు కూడా కళ్ళు మూసుకుని సినిమాను చూసి నోరు మెదపకుండా విడుదల చేశారు. సినిమా కేవలం వ్యాపారమే పరమావధిగా ఉండదు. కీలకమైన విషయాల పట్ల సమాజపు ఆలోచ నా ధోరణిని మార్చే ప్రయత్నం కూడా చేస్తుంది. చాలా సినిమాల్లో ఒకానొక ముస్లిం పేరుతో విలన్ ఉంటాడు.<br />
<br />
అత డు దుబాయిలో ఉండే డాన్ అని సినిమాలో చెప్తున్నా అంతర్లీనంగా అటువంటి ముస్లింలు మన అంతర్గత భద్రతకు ముప్పు అనే సందేశం అందులో ఉంటుంది. అటువంటి ప్రయత్నమే తెలంగాణ విషయంలో కూడా అనేక సినిమాల్లో జరిగింది. తాజాగా కెమెరామెన్ గంగతో రాంబాబు అనేక పాత్రల్లో, సంభాషణల్లో, సన్నివేశాల్లో తెలంగాణవాదాన్ని,వాదుల్ని చీల్చిచెండాడే ప్రయత్నం చేసింది. ఒక్క సినిమాలే కాదు, మొత్తం మీడి యా ఇప్పుడు తెలంగాణ అనేది ఒక సమస్య అనే భావిస్తున్నాయి తప్ప అది అనేక చారివూతక సమస్యలకు, తప్పిదాలకు పరిష్కారమని చెప్పలేకపోతున్నాయి.<br />
<br />
ఒక రకంగా బ్రాహ్మణులు ఒక కులంగా సామాజిక వర్గంగా హక్కులకోసం ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నప్పుడు వారికి మద్దతునివ్వడం ప్రజాస్వామిక లక్షణం. కానీ వారికి ఆశించినంత మద్దతు దొరకకపోవడం విచారకరం. సమాజంతో బ్రాహ్మణులు మమేకం కాకపోవ డం కూడా ఇవ్వా ళ వారిది ఒంటరి పోరాటం కావడానికి కారణం. తెలుగు సినిమాల్లో అశ్లీలత రెండు మూడు దశాబ్దాలుగా వెర్రితలలు వేస్తూనే ఉన్నది. స్త్రీని భోగ వస్తువు గా మాత్రమే చూపే సినిమాలు, వాటికి వ్యతిరేకంగా అనేక రూపాల్లో పోరాటాలు జరిగాయి. చైతన్యవంతమైన మహిళా సంఘాలు, విద్యార్థి వర్గాలు వీటికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నాయి. ఆ సందర్భంగా ఒక్క బ్రాహ్మణులే కాదు, కుల సంఘాలేవీ అందులో క్రియాశీలంగా పాల్గొన లేదు. మన సమాజానికి స్త్రీని అసభ్యంగా చూపిస్తే ఎదిరించే శక్తి లేదు. అటువంటి స్పృహ ఉంటే ‘వుమెన్ ఇన్ బ్రాహ్మనిజం’ వంటి సినిమా వచ్చేది కాదు. కేవలం బ్రాహ్మణ స్త్రీలనే కాదు, ఏ స్త్రీని కూడా అలా చూపకూడదన్న సార్వజనీన విలువ గానీ, అటువంటి ప్రయత్నాలకు మద్దతు గానీ లేకపోవడం వల్ల అటువంటి సినిమాలు వస్తున్నాయి.<br />
<br />
అలాగే దళితులనో, మిగతా వృత్తుల వాళ్లనో కించపరుస్తూ సినిమాలు తీసినప్పుడో, వార్తలు రాసినప్పుడో బ్రాహ్మణులు కూడా వాటిని వ్యతిరేకించి ఉంటే, అటువంటి ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ సాగిన పోరాటాల్లో బ్రాహ్మణులు కూడా భాగస్వాములై ఉంటె ఇవాళ బ్రాహ్మ ణ సంఘాల ప్రయత్నానికి మరింత బలం చేకూరేది.కేవలం సినిమాల్లోనే కాదు మొత్తం సామాజిక రాజకీయ రంగాల్లో బ్రాహ్మణులు ఒంటరివాైరై పోతున్నారు. ఇటువంటి వివాదాలు తలెత్తినప్పుడు జోక్యం చేసుకోవలసినవూపభుత్వం చోద్యం చూస్తున్నది. గతంలో అనేక సందర్భాల్లో సినిమాల పట్ల అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ సినిమాలను నిలిపివేసిన సందర్భాలున్నాయి. ప్రభుత్వం స్వయంగా ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ ఆ సినిమా చూసి అభ్యంతరాలు నిజమేనని చెప్పినప్పటికి ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లేదాకా మిన్నకుండిపోయింది. ఇది బ్రాహ్మణుల రాజకీయ బలహీనతను సూచిస్తున్నది. బ్రాహ్మణ మేధావులు కూడా ఇప్పుడు బ్రాహ్మణుల గురించి మాట్లాడడం అంటేనే భయపడుతున్నారు. బహుశా రెండు మూడు దశాబ్దాలుగా జరుగుతున్న సిద్ధాంత చర్చలు, కులవ్యవస్థ వ్యతిరేక ఉద్యమాలు అవి వ్యాపింప చేసిన భావజాలం కారణంకావచ్చు.<br />
<br />
అవేవీ బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు. ఆ భావజాలానికి వ్యతిరేకం. కులం పుట్టుకకు కారణాలు ఎలావున్నా ఆ కులా న్ని పోషించడంలో, కాపాడడంలో రాజ్యంతో పాటు ఇతర కులాల పాత్రను విస్మరించలేము. బ్రాహ్మణులు ఈ సమాజంలో భాగం. పౌరులకు లభించే అన్నిహక్కులు బ్రాహ్మణులకు కూడా ఉంటాయి. రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులన్నీ బ్రహ్మణులకు కూడా ఉంటాయి. ఉండాలి. అటువంటి ప్రజాస్వామిక ధోరణి అలవాటు కాకపోవడం వల్లే ఇవ్వాళ బ్రాహ్మణులు ఏకాకులుగా మిగిలిపోయారు. రేపు ఎవరినైనా ఏ కాకులు చేయగలిగే సత్తా ఈ పెట్టుబడికి, ఉన్నది. అది గమనించాలి. </div>
<div align="right" style="background-color: white; margin-top: 4px;">
<div style="color: #333333; font-family: arial, helvetica, sans-serif; font-size: 14px; line-height: 21px;">
-ఘంటా చక్రపాణి</div>
<div style="color: #333333; font-family: arial, helvetica, sans-serif; font-size: 14px; line-height: 21px;">
సమాజశాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు</div>
<div style="color: #333333; font-family: arial, helvetica, sans-serif; font-size: 14px; line-height: 21px;">
ghantapatham@gmail.com</div>
<div style="color: #333333; font-family: arial, helvetica, sans-serif; font-size: 14px; line-height: 21px;">
<br /></div>
<div style="text-align: left;">
<span style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"><span style="font-size: 14px; line-height: 21px;">---నమస్తే తెలంగాణ నుంచి</span></span></div>
</div>
<div style="background-color: white; color: #333333; font-family: arial, helvetica, sans-serif; font-size: 14px; line-height: 21px; margin-top: 4px;">
</div>
<div style="background-color: white; color: #333333; font-family: 'Trebuchet MS', Arial, Helvetica, sans-serif; font-size: 12px; margin-top: 10px;">
<br /></div>
</div>
సత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.com8tag:blogger.com,1999:blog-4596590595254101156.post-5606533217201057332012-10-31T18:49:00.002+02:002012-11-01T10:27:26.371+02:00బ్రాహ్మణులపై దాడిని ఖండిద్దాం!!<div dir="ltr" style="text-align: left;font-size:16px" trbidi="on";>
<br />
<br />
<br />
మనప్రజాస్వామ్యంలో ఆందోళనకారులపై దాడులు కొత్తకాదు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ప్రజలు ఆందోళన చేస్తున్నప్పుడు చంద్రబాబు, పేదలకు భూములు పంచాలని సీపీఐ, సీపీఎం ఆందోళన చేస్తుండగా ముదిగొండలో వైఎస్సార్ కాల్పులు జరిపించారు. గతకొద్ది సంవత్సరాలుగా తెలంగాణవాదులపై ప్రభుత్వం పోలీసులు, కేంద్రబలగాలతో విచక్షణారహితంగా దాడులు చెస్తుంది. ఇవన్నీ ప్రభుత్వదాడులు కాగా తెలంగాణలో సభలు నిర్వహించుకోవడానికి సీమాంధ్రనుంచి దుడ్డుకర్రలు పట్టుకున్న కిరాయిమూకలను రక్షణకోసం తెచ్చుకున్న చంద్రబాబు, వై.ఎస్. విజయమ్మా కూడా ఆందోళణకారులపై దాడులు చేశారు.<br />
<br />
ఈరోజు ఇలాంటిదే మరో సంఘటన హైదరాబాద్లో జరిగింది. అయితే ఇది ఎప్పటిలాగా తెలంగాణవాదులపైనో, బడుగువర్గాలపైనో కాదు, ఈరోజు జైగిన దాడి బ్రాహ్మణులపై, అర్చకులపై. దాడులు చేసింది మోహన్బాబు కిరాయి రౌడీలు. దుడ్డుకర్రలతో రౌడీలు దాడిచేసిన ఈఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయని సమాచారం.<br />
<br />
<br />
ఈసంఘటణకు నేపధ్యం ఇది: ముందు మోహన్బాబు తన చుంచుమొహం కొడుకు హీరోగా ఒక సినిమా తీశాడు. అందులో అర్చకులను, పురోహితులను కించపరిచేట్లుగా చూపించారుట. సెన్సారువారు అడ్డుచెబితే పలుకుబడితో సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకోవడమేగాక సెన్సార్ సభ్యురాలిపై మోహన్బాబు విమర్శలు చేశాడు. దీనితో నొచ్చుకున్న అర్చకులు కొద్దిరోజులనుండీ సినిమా ఆపేయాలని ఆందోళన చేస్తున్నారు. మోహన్బాబు ఇంటిముందు ఈరోజు వారు ఆందోళన చేస్తుంటే కిరాయిమూకలు వారిని చితకకొట్టారు.<br />
<br />
కొందరు రాస్తున్నట్లుగా ఇది హిందూమతంపై దాడి, హిందువులందరిపై దాడి లాంటి వాదనలు నేను ఒప్పుకోను గానీ ఈసినిమా ఒక వర్గం వారి జీవనవిధానంపై జరిగిన దాడి. ఈరోజు ఆందోళనకారులపై జరిగిన కిరాయిమూకల దాడి ప్రజాస్వామ్యంపై దాడి. ఇలాంటి దాడులను ఖండించి డబ్బూ, పలుకుబడి ఉంది కాబట్టి ఏం చేసినా చెల్లుతుందని విర్రవీగుతున్న మోహన్బాబులాంటి వారికి బుద్ధి చెప్పాల్సిందే. <br />
<br /></div>సత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.com9tag:blogger.com,1999:blog-4596590595254101156.post-39700646523897999552012-10-28T08:30:00.000+02:002012-10-28T08:47:01.256+02:00సామాజికన్యాయం జరిగింది<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhQkTg6UnANEeSLuM56C7NTo3lkVlUZbuspxyqgPOJv50t_cyxHIin6HV7dIm87A2VRY9OQ6SPirbZr7kWd81zXe4p7D3uK1qlBkwNak2W5dw60N_-ukCAe7Y846OWPnUcnH6food3LH2c/s1600/chiru.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="213" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhQkTg6UnANEeSLuM56C7NTo3lkVlUZbuspxyqgPOJv50t_cyxHIin6HV7dIm87A2VRY9OQ6SPirbZr7kWd81zXe4p7D3uK1qlBkwNak2W5dw60N_-ukCAe7Y846OWPnUcnH6food3LH2c/s320/chiru.jpg" width="320" /></a></div>
<br />
<br />
<br />
ప్రజారాజ్యం అనేపేరుటో పార్టీని స్థాపించి "సామాజికన్యాయం తీసుకొస్తా", "ముఖ్యమంత్రినై తిరిగివస్తా" అంటూ ప్రచారం చేసిన చిరంజీవికి ఎలక్షన్ ఫలితాలు వచ్చినతరువాత ముఖ్యమంత్రి గావడం అంత వీజీ గాదని అర్ధమయింది. ఆతరువాత అదృష్టం కలిసొచ్చి రాజశేఖర్ రెడ్డి చనిపోవడం, జగన్ కాంగ్రేశ్ను వదిలి కొత్తపార్టీ పెట్టడంతో వచ్చిన అనిశ్చిత స్థితితో అదృష్టం కలిసొచ్చింది.<br />
<br />
కాంగ్రేస్వారు అడగకున్నా తానే కాంగ్రేస్కు అడిగితే మద్దతు ఇస్తామని చెప్పిన చిరంజీవి కొన్నాళ్ళకు కాంగ్రేస్ ద్వారామాత్రమే సామాజిక న్యాయం (తన సామాజికవర్గానికి న్యాయం) జరగగలదని డిచ్లేర్ చేసి మరీ కాంగ్రేస్లో పీఆర్పీని విలీనం చేశాడు.<br />
<br />
ఆలస్యం జరిగినా చివరికి కాంగ్రేస్ ద్వారా సామాజిక న్యాయం జరిగింది. తనసామాజిక వర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి, ఆతరువాత తన గ్రూపుకు చెంది, తనసామాజికి వర్గానికి కూడా చెందిన ఇద్దరికి రాష్ట్ర మంత్రిపదవులు దక్కడమే గాక ఎట్టకేలకు చిరంజీవికి ముందు కుదుర్చుకున్న బేరం ప్రకారం కేంద్రమంత్రిపదవి కూడా లభించింది. <br />
<br />
కంగ్రాచ్యులేషన్ చిరంజీవి. టూరిజం పేరుమీద దేశమంతా టూర్లేయొచ్చు. ఎలాగూ రాజ్యసభమెంబరువు గనక వచ్చే ఎలక్షన్లలో పోటీచేస్తే ఎక్కడ వోడిపోతామో అన్న టెన్షన్ లేదు, అసలు పోటీ చేయాల్సిన అవసరమే లేదు. 2014 తరువాత కాంగ్రేస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు గనక ఆతరువాత మంత్రిపదవి దక్కుద్దా అనే టెన్షన్ కూడా లేదు!!<br />
<br />
<div>
<br /></div>
</div>
సత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.com1tag:blogger.com,1999:blog-4596590595254101156.post-65442696967899254232012-08-11T08:00:00.000+03:002012-08-11T09:33:48.915+03:00అమెరికాలో రోడ్డుప్రమాదానికి గురయిన తెలుగువారు<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<br />
<div style="clear: right; float: right; margin-bottom: 1em; margin-left: 1em;">
<img height="225" src="http://www.truckaccidentlaw.org/blog/wp-content/uploads/2012/02/slidell-la-semi-truck-accident.jpg" width="400" /> </div>
ఈరోజు ఐదుగురు తెలుగువారు అమెరికాలో ఓక్లహామాలో ఫ్రీవేపై ఘోరరోడ్డుప్రమాదానికి గురయి అక్కడికక్కడే మరణించారు. ఐదుగురూ హైదరాబాదుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీరులు కాగా అందులో ఒకరు వివాహితుడు, మిగతా నలుగురూ ఇంకా పెళ్ళికానివారని నేను చదివిన వార్త సారాంశం.<br />
<br />
ఇలాంటి వార్తలు గత కొద్ది సంవత్సరాలుగా చానాసార్లు నేను చదివి ఉంటాను. అమెరికాకు కొత్తగా వెల్లినవారు అక్కడి డ్రైవింగ్కు అలవాటు పడకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో కారు నడుపుతుండడం వలన ఇలాంటి ప్రమాదాలు ఈమధ్య బాగా పెరిగాయి. నలుగురైదుగురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు రెండుమూడు నెలలకోసం అమెరికాకు వెలితే అందరూ కలిసి ఒక అద్దెకారు తీసుకోవడం సాధారణం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా పరిమితమయిన అమెరికాలో కారులేకపోతే కాళ్ళు లేనట్లే.<br />
<br />
నలుగురిలో ఎవరికైనా ఇండియాలో కారు నడిపిన అలవాటు ఉంటే నేను కారు నడుపుతాలే అని మిగతావారికి నచ్చజెప్పి కారు అద్దెకు తీసుకుంటాడు. అయితే ఇండియా డ్రైవింగ్కూ అమెరికా డ్రైవింగ్కూ చాలా తేడా గనక తప్పులు జరుగుతుంటాయి. సాధారణంగా రూల్స్ సరిగ్గా పాటిస్తే ప్రమాదాలు తక్కువే..కానీ ఫ్రీవేల్లో స్పీడ్కు అలవాటు పడాలి. అది కొత్తగా ఇండియానుండి వచ్చినవారికి కష్టం. అలాగే ఇండియాలో ఎలాంటి డ్రైవింగ్ రూల్సూ ఉండవు కనుక కొత్తగా అమెరికా వెల్లినవారికి అక్కడ రూల్స్ ప్రకారం డ్రైవింగ్ చెయ్యడం కష్టమవుతుంది.<br />
<br />
ఏదేమైనా ఇలా తరుచూ ప్రమాదాలు జరగడం భాధాకరం. అసలు అమెరికాలో ఇలా పూర్తిగా కారుపై ఆధారపడే వ్యవస్థను ఎందుకు తయారుచేశారో నాకర్ధం కాదు. యూరప్లోలా బస్సులూ, ట్రైన్లూ ఉంటే వారికి ఇలా వచ్చీరాని డ్రైవింగ్తో కారునడిపే అవసరం ఉండదు కదా? కనీసం ఇండియన్ సాఫ్ట్వేర్ కంపనీలు అమెరికాకు ఒక గ్రూపును పంపినపుడు అందులో ఒకరికైనా అక్కడ డ్రైవింగ్ అలవాటు ఉండేలా చూసుకుంటే బెటరు. అలా వీలుకాకపోతే ప్రత్యేక శిక్షణ అయినా ఇవ్వాలి. <br />
<div>
<br /></div>
</div>సత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.com3tag:blogger.com,1999:blog-4596590595254101156.post-26696045981256718132012-07-09T19:28:00.001+03:002012-07-09T19:28:50.895+03:00కార్టూన్ బాగుంది!<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
కార్టూన్ బాగుంది. ఇదే కార్టూన్లో మాయావతిని తీసేసి చంద్రబాబును పెట్టినా అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. శ్రీధర్ గారూ, కాస్త గమనించండి.<br />
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhX-wD4pitaSzNcnQ5eGjy-QN_TqcbuJgZC_wkfApswyCMxfiRqNoFRTimU340aTXnNUidFYMfgAAwiflFWYTedwObVzwPOQXtOLQkKd7AKUz-cyPXsTI1_P8sVqvg0fZvYXb7h9z9UJPA/s1600/cartbig080712.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="320" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhX-wD4pitaSzNcnQ5eGjy-QN_TqcbuJgZC_wkfApswyCMxfiRqNoFRTimU340aTXnNUidFYMfgAAwiflFWYTedwObVzwPOQXtOLQkKd7AKUz-cyPXsTI1_P8sVqvg0fZvYXb7h9z9UJPA/s320/cartbig080712.jpg" width="235" /></a></div>
<br /></div>సత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.com1tag:blogger.com,1999:blog-4596590595254101156.post-25742661012811944292012-03-18T09:23:00.000+02:002012-03-18T10:53:34.554+02:00సమైక్యాంధ్ర మనకెందుకు?<div dir="ltr" style="text-align: left;" trbidi="on"><br />
బిడ్డా,<br />
తెలంగాణ వస్తే నీకేమొస్తది?<br />
కూడొస్తది, గూడొస్తది<br />
తాగేటందుకు నీళ్ళొస్తయి<br />
మన పొలం తడుస్తది<br />
మన తమ్ముల్లకు నౌకర్లొస్తయి<br />
గందుకే పెద్దాయినా<br />
మనతెలంగాణ మనగ్గావాలె!!<br />
<br />
బాబుగోరూ,<br />
సమైక్యాంధ్ర మనకెందుకు?<br />
హైదరబాదుల కబ్జాలకు<br />
నాకంపనీ కాంట్రాక్టులకు<br />
కాలువకింది బినామీపొలాల్లో<br />
మూడోపంటకు నీల్లకొరకు<br />
అంతా నాబాగుకోసమే<br />
మీరంతా సమైక్యంగుండాలి!<br />
<br />
</div>సత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.com14tag:blogger.com,1999:blog-4596590595254101156.post-58959828212297338532012-02-24T14:05:00.000+02:002012-02-24T14:06:26.128+02:00సీమాంధ్ర అసెంబ్లీ సర్వం తిట్లమయం<div dir="ltr" style="text-align: left;" trbidi="on"><br />
<div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjpGTmRjSXKFRag8Paaq0kF63DAKz3lCUjnN_3ksn5-0447EsGuHaT0X9Un5sHLWbnujR8JU90pPeaMk0v3G2lzX0p0A2FSi-_08gRplNROXBl-blxV_M580FW5aZ44Ol4KuHuKQRcOvw4/s1600/andhra-assembly-telangana-6.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="213" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjpGTmRjSXKFRag8Paaq0kF63DAKz3lCUjnN_3ksn5-0447EsGuHaT0X9Un5sHLWbnujR8JU90pPeaMk0v3G2lzX0p0A2FSi-_08gRplNROXBl-blxV_M580FW5aZ44Ol4KuHuKQRcOvw4/s320/andhra-assembly-telangana-6.jpg" width="320" /></a></div><br />
<br />
నాలుగురోజులు తెలంగాణ అంశంపై చర్చజరగాలని కోరుతూ తెరాస ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఘొరావ్ చేస్తే చివరికి తెరాస ఎమ్మెల్యేలనందరినీ బయటికి గెంటివేసి అధికార, ప్రతిపక్షపార్టీలు కలిసి అసెంబ్లీని నడుపుకుంటున్నారు. మధ్యలో ఒకటీ అరా సీట్లు కలిగిన బీజేపీ, లోక్సత్తా కాకుండా తమేపార్టీలో ఉన్నామో తెలియని వైఎస్సార్ అభిమాన(?)ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.<br />
<br />
ఇంతకూ తెలంగాణపై చర్చను కాదని, తెరాసను గెంటివేసి వీరు దేనిగురించి చర్చించారు అంటే షరా మామూలే. ఒకర్నొకరు తిట్టుకోవడం, ఎవరిడబ్బాలు వాళ్ళు కొట్టుకోవడం. మీదంతా అవినీతిమయం అని ప్రతిపక్షం అంటే మీహయాంలోనే అవినీతి మొదలయింది అని అధికార పార్టి అంటుంది. నువ్వు కేందరం సీట్లో కూర్చోబెడితే కూర్చునే డమ్మీ ముఖ్యమంత్రివి అని ప్రతిపక్షం అంటే నువ్వు మామను వెన్నుపోటుపొడిచి కుర్చీలాక్కున్నావని అధికారపక్షం.<br />
<br />
ఏమాటకామాటే చెప్పుకోవాలి, తిట్లపురాణం ఇప్పుడు కాస్త తగ్గింది, అదే మన ప్రియతమ మహామేత ఫాక్షనిస్టు ముఖ్యమంత్రి హయాంలో నయితే తిట్లు మరోలాఉండేవి. నిన్ను కడిగేస్తా, అసలు తల్లికడుపులోనుంచి ఎందుకు బయటికి వచ్చానో అనుకునేలా చేస్తా అంటూ సవాళ్ళు వినిపించేయి. ఈతిట్లు వినడంకోసమేనా వీల్లను గెలిపించి పంపించింది? ఏనాడయినా అర్ధవంతమయిన చర్చలు వీరెప్పుడయినా జరగనిచ్చారా? ఒక ఆరోపణ వస్తే ఆఅరోపణకు సమాధానం ఇచ్చుకోవాలి గానీ మీహయాంలో కూడా ఇలాగే ఉండేది అంటే అది సమాధానమా? దొంగలూ దొంగలూ ఊళ్ళు పంచుకున్నట్టు!<br />
<br />
తెలంగాణ అంశంపై రెండు సంవత్సరాలుగా రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతుంటే తెలంగాణ అంశంపై చర్చించడానికి వీరికి భయం. ఈఅంశం కేంద్రం దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ చర్చించాల్సిన అవసరం లేదు అని తప్పించుకుంటున్నారు. రాష్ట్రానికీ, రాష్ట్రప్రజలకూ సంబంధించి నిర్ణయం కేంద్రం తీసుకోవాలంటే ఆనిర్ణయం మంచిచెడ్డలగురించి చర్చించాల్సిన అవసరం వీరికి లేదా? వీరు చర్చించి ఆసమస్యకు పర్ష్కారాన్ని వెతకలేకపోవచ్చు, వీరిచర్చ కేంద్రనిర్ణయంపై ప్రభావం చూపలేకపోవచ్చు కానీ రాష్ట్రభవిష్యత్తుకు సంబంధించి రాష్ట్రప్రతినిధులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది, ఎన్నాల్లిలా తప్పించుకు తిరుగుతారు చేవలేని దద్దమ్మల్లా?<br />
<br />
నలుగురైదుగురు రైతులు ఆత్మహత్యచేసుకుంటే అదో పెద్ద ఇష్యూ అవుతుంది, అసెంబ్లీనుంచి పార్లమెంటుదాకా చర్చిస్తారు, అన్నిరాజకీయపార్టీలూ ఆసమస్యపై రైతుయాత్రలనీ, పోరుయాత్రలనీ చేస్తాయి, మరి వందలకొద్ది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటే సమస్యే లేనట్టు ఎన్నాల్లు నటిస్తారు? ఈమాత్రం సభ జరిగితే ఎంత జరగకపోతే ఎంత? వీల్ల చర్చలద్వారా జనానికి ఏంఒరుగుతుంది?</div>సత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.com4tag:blogger.com,1999:blog-4596590595254101156.post-51205064709748681132012-01-23T07:35:00.000+02:002012-01-23T08:55:45.278+02:00చంద్రబాబు దండయాత్ర దేనికోసం?<div dir="ltr" style="text-align: left;" trbidi="on"><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiz2jeSgsGJWfChhBVxowsAKnQE8euFkW2eX0MUpyNd6-epjRhc5gSnjd4LyzBukjK86G3a3kZMWRwaxrCApcm8mmFIKnrrvggLZ0pltGhh34NxC_brhr_weM92kOmlZXWX9FLpZLE3-es/s1600/chandra-babu-dandayatra.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="214" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiz2jeSgsGJWfChhBVxowsAKnQE8euFkW2eX0MUpyNd6-epjRhc5gSnjd4LyzBukjK86G3a3kZMWRwaxrCApcm8mmFIKnrrvggLZ0pltGhh34NxC_brhr_weM92kOmlZXWX9FLpZLE3-es/s320/chandra-babu-dandayatra.jpg" width="320" /></a></div><br />
చంద్రబాబు మొత్తానికి రైతుయాత్ర పేరుతో తెలంగాణా ప్రజలపై తన దండయాత్రను దిగ్విజయంగా ముగించాడు. గత రెండు సంవత్సరాలుగా తెలంగాణాలో అడుగుపెట్టడానికి మొహం చెల్లకపోగా కనీసం ఎక్కడయినా తెదేపా మీటింగు జరిగితే చంద్రబాబు ఫోటో కూడా పెట్టుకోకుండానే సభ జరుపుకునే పరిస్థితి నుంచి బయటపడి నేనూ తెలంగాణాలో తిరిగాను అని చెప్పుకునేలా ఒక యాత్రను కొనసాగించాడు.<br />
<br />
రైతులకోసం జరిపిన పోరుయాత్ర అని చెప్పుకున్నా నిజానికి అది రైతులకోసం కాదనేది అందరికీ తెలిసిందే. ఇంతకూ తెలంగాణా ప్రజలను భయభ్రాంతులను చేస్తూ వేలాది గూండాలను వందలాది సుమోల్లో తరలించి దుడ్డుకర్రలు వెంట తెచ్చుకుని, వేలాది పోలీసుల పహారాలో తన యాత్రను సాగించి చంద్రబాబు సాధించింది ఏమిటి? సీమాంధ్ర నుండి తరలించిన చంద్రదండు గూండాలతో ఇక్కడ అడ్డువచ్చిన పేదవిద్యార్థులను దుడ్డుకర్రలతో కొట్టించి ఈయన ఇక్కడి రైతుల లేదా ప్రజల్ హృదయాలను గెలుచుకుంటాడా? ఇలా బెదిరింపులు, రౌడీజులుంతో చేసిన దండయాత్రలతో తనకు ఇక్కడ వోట్లు పడవు సరికదా ఇంకా ఏమన్నా ప్రజలమద్దతు ఇక్కడ ఉంటే అదికూడా పోతుందని నక్కజిత్తుల బాబుకు తెలియదా? మరి ఇంత తెలిసీ ఇలా ప్రజావ్యతిరేక దండయాత్ర సాగించింది దేనికోసం అనేది ఒక పెద్ద ప్రశ్న.<br />
<br />
ఇలా దౌర్జన్యపు దండయాత్రలు చేసి ఇక్కడి ప్రజల మద్దతు రాబట్టడ సాధ్యం కాదని చంద్రబాబుకు బాగా తెలుసు. అసలు తాను డిసెంబరు 9 తరువాత చేసిన మోసానికి మల్లీ ఇక్కడ ఎప్పటికైనా ప్రజల మద్దతు కూడగట్టుకొని సీట్లు గెలుచుకోవడం అస్సధ్యమని బహుషా చంద్రబాబుకు ఈపాటికి అర్ధం అయుంటుంది. అయినా చంద్రబాబు తన దండయాత్రను సాగించడమేకాకుండా మొదట T-JAC కానీ, టీఆరెస్ కానీ అంతగా పట్టించుకోకపోతే తానే కవ్వించి తన చంచాలతో టీఆరెస్పై, కోదండరాంపై రోజూ అడ్డమైన కూతలు కూయించి మరీ ఉద్రిక్తవాతావరణం తయారు చెయ్యడం దేనికోసం?<br />
<br />
దీనికి సమాధానం చంద్రబాబు తెలంగాణా యాత్ర తెలంగాణలో వోట్లకోసం కాదు, సీమాంధ్రలో వోట్లకోసం. ఇప్పుడీవిధంగా తెలంగాణాపై దండయాత్ర ముగించిన చంద్రబాబు సీమాధ్రప్రజలకు నేణు తెలంగాణ అడ్డుకోవడానికి ఎంతకైనా తెగించగలను అనే సిగ్నల్ ఇచ్చినట్టయింది. చూశారా తెలంగాణప్రజలు నన్ను వ్యతిరేకిస్తున్నా నేను తెలంగాణాలో యాత్ర చేశాను, అంతేకాదు నాతోపాటు కొంతమంది ఫాక్షనిస్టు నేటలను, వేలమంది గూండాలను కూడా తీసుకెల్లి అక్కడ అడ్డం వచ్చినవాల్లను కొట్టించాను. అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉండే నేను ఇక్కడీనుండి అక్కడీకి గూండాలను తీసుకెల్లి మరీ కొట్టించానంటే ఇక నాకధికారం ఇస్తే ఎలాగుంటుందో చూడండి, బషీర్బాగ్ లో కాల్పులు జరిపినట్లు తెలంగాణ పేరు చెప్పినవాన్ని చెప్పినట్లు కాల్చి పారేస్తాను. కాబట్టి మీరు నాకే వోటేయండి అని ఈయాత్ర ద్వారా చంద్రబాబు సీమాంధ్ర ప్రాంతం వారిని వేడుకొన్నట్లు కనిపిస్తోంది.<br />
<br />
ఇందుకోసమే చంద్రబాబు తన చంచాలతో మీటింగుల్లో 2014 తరువాత చంద్రాబాబే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పించాడు. మరి చంద్రబాబు తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కావాలంటే రాష్ట్రం విడీపోతే అది సాధ్యం కాదు. కాబట్టి రాష్ట్రం విడిపోకుండా చూడడమే మా అజెండా అని చెప్పకనే చెప్పాడు.<br />
<br />
మరి చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందా? ఈయన దండయాత్రలను చూసి సీమాంధ్ర ప్రజలు తమ ప్రాంతంలో చంద్రబాబుకు వోట్లేస్తారా? సీమాంధ్ర ప్రజల్లో రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తుంది కొద్దిమంది భూస్వామ్య వర్గాలు, ఒకట్రెండు సామాజిక వర్గాలు తప్ప బీదా మధ్యతరగతి వర్గాలకు రాష్ట్రాన్ని కలిపి ఉంచితే ఒరిగేదేం ఉండదు. వారికి కావాల్సింది అక్కడీ ప్రజలకు ఎవరు న్యాయం చేస్తారనే. చంద్రబాబూ, జాగ్రత్త.. నీనక్కజిత్తులు ప్రజలకందరికీ తెలిసిపోయాయి, ఇంకా మోసం చేద్దామనుకుంటే లాభం లేదు. <br />
<br />
<br />
<br />
<br />
</div>సత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.com1tag:blogger.com,1999:blog-4596590595254101156.post-54244527890794929852012-01-22T11:27:00.002+02:002012-01-22T11:27:54.530+02:00ఎన్టిఆర్ వధ, టీడీపీ చెర<div dir="ltr" style="text-align: left;" trbidi="on"><span style="color: #003399; font-family: arial;"><span style="font-size: 17px;"><b><br />
</b></span></span><span style="background-color: white; color: #333333;"></span><br />
<div class="content" style="background-color: white; color: #333333; font-family: arial, helvetica, sans-serif; font-size: 15px; line-height: 24px; margin-top: 4px;"><span class="subHead2" style="color: #901853; font: normal normal bold 15px/normal arial; margin-bottom: 15px; margin-left: 0px; margin-right: 0px; margin-top: 15px;">ఎన్టిఆర్ మహాత్మాగాంధీ, అంబేద్కర్ అంతటి మహనీయుడు. ఆయన విగ్రహం పార్లమెంటులో ప్రతిష్టించాలి.<br />
-టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు<br />
<br />
నేను స్థాపించిన తెలుగుదేశంలోనే కాంగ్రెస్ అక్రమ శిశువులు, గోముఖ వ్యాఘ్రాలు, మేక వన్నె పులులు తలెత్తుతున్నాయని ముందుగా తెలుసుకోలేకపోయాను...నేనే దేవున్ని అని చెబుతూ చాపకింద నీళ్లలాగా, పుట్టలో తేళ్లలాగా, పొదల్లో నక్కల్లాగా కుట్రలు, కుతం త్రాలు అల్లారు...ఇంతనీచానికి ఒడిగట్టిన చంద్రబాబు ఎన్టిఆర్ మా దేవుడు ఆయన విధానాలే అమలు జరుపుతానంటున్నాడు. చేతులు జోడించి, నమస్కారం చేసి, తుపాకి పేల్చి గాంధీని పొట్టనపెట్టుకున్న గాడ్సేను మించిన హంతకుడు చంద్రబాబు.<br />
<br />
-1995 ఆగస్టులో తనకు వ్యతిరేకంగా జరిగిన విద్రోహంపై ఎన్టిఆర్ ఆగ్రహం ఇది.<br />
<br />
‘నారా, నారా, పోరా, పోరా...’, ‘గతంలో ఎన్టిఆర్ను వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల భాస్కర్రావు కొంతయినా చరిత్ర మిగిల్చుకున్నారు. చంద్రబాబుకు అదికూడా మిగలదు’. </span><br />
<br />
-ఎన్టిఆర్ను గద్దెదింపినందుకు నిరసనగా 1995 డిసెంబరులో నిర్వహించిన మాక్<br />
అసెంబ్లీలో చంద్రబాబునాయుడుపై మోత్కుపల్లి నర్సింహులు ఆక్రోశం ఇది.<br />
<br />
నారా చంద్రబాబునాయుడుకు నాడున్న ఇమేజి అది. ఎన్టిఆర్ ఆభిమానుల్లో ఉన్న ఆగ్రహానికి ప్రతీక ఆ నినాదం. చంద్రబా బు ఎన్టిఆర్కు చేసి న ద్రోహాన్ని జీర్ణించుకోలేనివారు ఇప్పటికీ కోట్లాది మంది ఉన్నా రు. అందుకే చంద్రబాబు తెలుగుజాతి ఆత్మగౌరవం గురించి, ఎన్టిఆర్ ఖ్యాతి గురించి మాట్లాడుతుంటే మనసు వెక్కిరిస్తూ ఉంటుంది. బతికి ఉన్నప్పుడు చిత్రవధ చేసి ఆయనను బలితీసుకున్న చంద్రబాబు ఇప్పుడు ఆయన విగ్రహాలకు దండలు వేస్తున్నారు. ఒక్క ఎన్టిఆర్నే కాదు తిరుగుబాటులో తన పల్లకీ మోసిన తోడల్లుడు దగ్గుబాటి వెంక బావ మరిది హరికృష్ణను, అనేక మంది సీనియర్ నాయకులను ఆయన ఆ తర్వాత కరివేపాకులాగా తీసి పారేశారు. రాజకీయాల్లో ‘యూజ్ అండ్ త్రో’ విధానాన్ని పక్కా గా అమలు చేసిన నేత చంద్రబాబే. స్నేహమయినా, బంధుత్వమయినా ఉపయో గపడితేనే కలుపుకుంటారాయన. ఆంతరంగికులను సైతం ఎప్పటికప్పుడు మార్చే చంద్రబాబుకు శాశ్వత శత్రుత్వాలు, మిత్రుత్వాలు, శాశ్వత బంధుత్వాలు ఉండవు.<br />
<br />
విధా నాలయినా అంతే. ఎప్పటికప్పుడు మార్చకపోతే ఆయన చంద్రబాబే కాదు. ఇప్పటికీ వెల్లడి కాని విషయం- అభినవ గాడ్సే ఎన్టిఆర్ వారసుడెలా అయ్యారు? ఎన్టిఆర్ను అర్ధంతరంగా బలితీసుకున్నవాడు ఆయన కుటుంబానికి ఆత్మబంధు అయ్యారు? ‘వివూదోహ చంద్రబాబు’ను ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా, పార్టీ రక్షకునిగా సమ్మతిని, సమర్థనను మాన్యుఫాక్చర్ చేసిన శక్తులు ఏవి?<br />
విషాదం ఏమంటే 1995లో ఎన్టిఆర్కు జరిగిన దుర్మార్గంపై ఇంతవరకు లోతైన పరిశోధన జరుగక పోవడం. వైస్రాయ్లో జరిగిన కుట్ర చరివూతను రికార్డు చేయకపోవడం. చంద్రబాబు, ఆయన వందిమాగధ మీడియా రాసిన అనుకూల చరిత్ర తప్ప, అసలేం జరిగిందన్న అంశంపై ఎవరూ శ్రద్ధపెట్టకపోవడం యాదృచ్ఛికంగా జరుగలేదు. అధికారంలో ఉన్నవారి చరిత్రే తర్వాతి తరాలకు చరివూతగా సంక్రమిస్తోంది. ఓడిపోయి పడిపోయిన వారి చరిత్ర రికార్డుల్లోకి రాకపోవడం అనాదిగా ఉంది.<br />
<br />
వర్తమానంలోనూ అదే జరుగుతోంది. గెలిచినవాడి చరిత్ర చీకటి పార్శ్వాలు బయటికి రావడం లేదు. ఎన్టి ఆర్పైన, చంద్రబాబుపైన, ఆ కాలపు రాజకీయాలపైన కొన్ని పుస్తకాలు వచ్చినమాట వాస్తవం. కానీ అన్నీ రాయించినవి, చేసిన నేరాలను సమర్థించుకునేవే తప్ప, వాస్తవాలను ఆవిష్కరించే చరిత్ర రాలేదు. ఇప్పటికీ అందరినీ వేధించే ప్రశ్న ఒక్కటే-1984ఆగస్టులో నాదెండ్ల భాస్కర్రావు చేసిన ప్రయత్నమే, 1995 ఆగస్టులో చంద్రబాబు చేశారు. నాదెండ్లది వెన్నుపోటు ఎలా అయింది? చంద్రబాబు ది ప్రజాస్వామ్యం ఎలా అయింది? ఒకే తరహా ఘాతుకానికి రెండు నిర్వచనాలు ఎలా సాధ్యం? నాదెండ్ల ఎందుకు విఫలమయ్యాడు? చంద్రబాబు ఎలా సఫలీకృతు డయ్యాడు? చంద్రబాబును గెలిపించిన శక్తులేవి?<br />
<br />
నాదెండ్ల అసంతృప్తి, అవమానాలతోనే తిరుగుబాటు ప్రయత్నం చేశారు. చంద్రబాబు కూడా ఇవే కారణాలు చెప్పారు. నాదెండ్ల లక్ష్యం అధికారాన్ని చేజిక్కించుకోవడమే. చంద్రబాబు అంతిమంగా ఆ లక్ష్యాన్ని చేరుకున్నారు. నాదెండ్ల తిరుగుబాటు చేసినప్పుడు ఆయనతో ఉన్నది చాలా కొద్ది మంది. చంద్రబాబు పరిస్థితీ అదే. కానీ చంద్రబాబు అతివేగంగా పావులు కదిపి బలసమీకరణలో సక్సెస్ అయ్యారు. నాదెండ్ల విఫలమయ్యారు. ఇక్కడే చాలా శక్తులు పనిచేశాయి. నాదెండ్ల తిరుగుబాటు జెండా ఎగరేయగానే ఎన్టిఆర్ను అధి కారంలోకి తేవడానికి భూమీ ఆకాశం ఏకంచేసిన పత్రికలు దానిని ‘వెన్ను పోటు’గా, ‘ప్రజాస్వామ్యానికి విద్రోహం’గా చిత్రీకరిస్తూ అభివూపాయాన్ని కూడగట్టాయి. అన్ని రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకి రావడానికి, ఎన్టిఆర్కు వెన్నుదన్నుగా నిలవడానికి భూమికను పత్రికలు సృష్టించాయి. నాదెండ్ల వెంట ఎంతమంది ఉన్నారో, ఎన్టిఆర్తో ఎంత మంది ఉన్నారో ఎప్పటికప్పుడు లెక్కలు వేస్తూ నాదెండ్ల వెనుక ఎమ్మెల్యేలు చేరకుండా సైకలాజికల్ వార్ఫేర్ నిర్వహించాయిపజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని పత్రికలు ముందుండి నడిపించాయి. రాజకీయాలు, పత్రికలు కలసిపోయి పనిచేశాయి. నాదెండ్ల పప్పులు ఉడకలేదు.<br />
<br />
1995లో సీను రివర్సయింది. ఎన్టిఆర్ను అధికారంలోకి తీసుకురావడానికి ఆరాట పడిన పత్రికలకు ఆయనపై మోజు తీరిపోయింది. ఎన్టిఆర్ మునుపటిలా పత్రికలు, పారిక్షిశామికవేత్తలు చెప్పినట్టు నడుచుకునే రోజులు పోయాయి. అమాయక ఎన్టిఆర్ కాస్తా ముదిరిపోయారు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచే ప్రయత్నం చేస్తూ వచ్చా రు. ఆయన స్వతంవూతించి వ్యవహరించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఎన్టిఆర్పై యుద్ధం మొదలయింది. ఆయనతో ఎదురుపడి యుద్ధం చేయడం అసాధ్యం. ఆయనను ఓడించడం మామూలుగా అయ్యేపనికాదు. పైగా అఖండ విజయం సాధించి అప్పటికి ఎంతోకాలం కాలేదు. అందుకే లక్ష్మీపార్వతిని బూచిగా చూపడం మొదలు పెట్టారు. ఆమెను వివాహం చేసుకోవడం, ఆమెకు మర్యాద మన్ననలు ఇవ్వడం ద్వారా ఎన్టిఆర్ తెలుగుజాతి కొంపలు కూల్చుతున్నారన్నంత యాగీ చేశాయి ఆ పత్రికలు.<br />
<br />
ఆమె వల్ల ప్రజాస్వామ్యం పాడుబడిపోతున్నదని, కుటుంబ గౌరవం నవ్వులపాలవుతున్నదని ఆ పత్రికలు రచ్చ చేశాయి. ఆమె ఎన్టిఆర్తో కలసి చైతన్యరథంపై ఎన్నికల ప్రచారం చేసినప్పుడు ఎటువంటి చర్చ జరగలేదు. ఎవరూ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కానీ అధికారం అనుభవించే విషయం వచ్చే సరికి మాత్రం ఆమె పాత్ర కంటగింపయింది. మంత్రిపదవుల పంపకం దగ్గర మొదలయిన అసంతృప్తి, డిసిసిబి చైర్మన్ల ఎంపిక వరకు వచ్చే సరికి ముదిరి పాకాన పడ్డ ది. చంద్రబాబునాయుడు పావులు కదపడంమొదలు పెట్టా రు. మంతనాలు ప్రారంభించారు. తెలుగు దేశంలో అత్యధికులు చంద్రబాబుతో వెళ్లడానికి భయపడ్డారు. కానీ అప్పటికే లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా మీడియాను యధేచ్ఛగా వాడుకుంటున్న చంద్రబాబు తిరుగుబాటు కుట్రలో మీడియాను ప్రధాన భాగస్వాములను చేశాడు.<br />
<br />
నాడు నాదెండ్లకు అడ్డం తిరిగిన మీడియా ఈసారి చంద్రబాబును భుజానికెత్తుకుంది. వీలైనంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు వైపు సమీకరించడానికి అదే మీడియా మరోసారి సైకాలాజికల్ వార్ఫేర్ నిర్వహించింది. జర్నలిస్టులను, ఎడిటర్లను ప్రత్యక్షంగా రంగంలోకి దింపారు చంద్రబాబు. వాడొస్తున్నాడని వీడికి, వీడొస్తున్నాడని వాడికి జర్నలిస్టులతో, ఎడిటర్లతో చెప్పించి నమ్మబలికారు. వైస్రాయ్లో ఎంతమంది చేరారో తెలియదు, కానీ మెజారిటీ ఎమ్మెల్యేలు పోగయ్యారని, ఎన్టిఆర్ పని అయిపోయిందని కొందరు జర్నలిస్టులు ఎమ్మెల్యేలకు అదేపనిగా ఫోను చేసి భయపెట్టారు. దగ్గుబాటి సన్నిహితులకు ఫోను చేసి ఆయన వెంట ఉండే ఎమ్మెల్యేలంతా చంద్రబాబుతో రావడానికి తయారయ్యారని, చంద్రబాబుతో చేతులు కలుపకపోతే ఏకాకి అవుతారని ఊదరగొట్టారు.<br />
<br />
దగ్గుబాటి వర్గం ఎమ్మెల్యేలకు ఫోను చేసి దగ్గుబాటి కుటుంబ సభ్యులందరితోపాటే చంద్రబాబుతో వచ్చేస్తున్నారని చెప్పారు. మరోవైపు వచ్చిన ఎమ్మెల్యేలను కట్టిపడేయడానికి ఏమేమి చేయాలో అవన్నీ చంద్రబాబు వైస్రాయ్ నీడలో గుట్టుగా చేసుకుపోయారు. బయట జరుగుతున్నది లోపలివారికి, లోన జరుగుతున్నది బయటి వారికి తెలియనీయలేదు. పత్రికలకు ప్రజాస్వామ్యం కనిపించలేదు. ప్రజలు ఎన్టిఆర్ను చూసి గెలిపించారన్న సోయి లేకపోయింది. తెలుగుదేశాన్ని కాపాడడానికి తాను తిరుగుబాటు చేయాల్సివచ్చిందని చంద్రబాబు చెప్పారు. పత్రికలు దానిని జస్టిఫై చేశాయి. ప్రతి సంఘటనను విమర్శనాత్మకంగా విశ్లేషించే సిపిఐ, సిపిఎంలు సైతం పత్రికలు, రాజకీయ మ్యానిపులేటర్లు సృష్టించిన కొత్త నిర్వచనాన్నే స్వీకరించాయి. చంద్రబాబుకు జైకొట్టాయి. తాను నిర్మించిన రాజకీయ మహాసౌధం తన కళ్లముందే చేజారిపోవడం చూసి, తన రక్తం పంచుకుపుట్టినవారే తనపై కుట్రచేసిన తీరును చూసి, తాను గెలిపించిన వారే తనపై కత్తిగట్టిన మోసాన్ని చూసి, వగచి, విలపించి, గుండెలు పగిలి, ఐదుమాసాలు తిరగకుండానే ఎన్టిఆర్ కన్నుమూశారు.<br />
<br />
ఎప్పుడయినా చంద్రబాబు ఉపయోగించే ట్రిక్కు ఒక్కటే. ఎవరినయినా దెబ్బకొట్టాలంటే వారికి వ్యతిరేకంగా ఒక అబద్ధాన్ని ఆయనే సృష్టిస్తారు. ఆ అబద్ధాన్ని వందిమాగధ పత్రికలు పతాక శీర్షికల్లో అచ్చేస్తాయి. ఆ అబద్ధాన్ని పదేపదే వాగడానికి కొన్ని పెంపుడు కుక్కలను చంద్రబాబే ఎగదోస్తుంటాడు. ప్రభుత్వంలో లక్ష్మీపార్వతి జోక్యం అనే ఒక అబద్ధాన్ని ప్రచారంలో పెట్టి, నాడు ఎన్టిఆర్ను దెబ్బకొట్టారు.<br />
అధికారంలోకి వస్తూనే ఎన్టిఆర్ను మరిపించడానికి, చంద్రబాబును మహానుభావుడిని చేయడానికి పత్రికలు మేళ తాల సహితంగా ఆరున్నొక్కరాగం అందుకున్నాయి. ఆయన లోని సుగుణాలను కీర్తించడానికి, ఆయనను బిల్ క్లింటన్ సరసన కూర్చోబెట్టడానికి, ఆయనకు స్టార్ ఆఫ్ ఏసియా కిరీటం తొడగడానికి మీడియా తన్మయత్వంతో పనిచేసుకుంటూ పోయింది.<br />
<br />
నిజానికి, చంద్రబాబుకు జనామోదం ఎప్పుడూ లభించ లేదు. 1996, 1998 లోక్సభ ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును శిక్షించారు. ఎన్టిఆర్ను వెన్నుపోటు పొడిచినందుకు జనంలో ఆగ్రహం ఉండడం వల్లే రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మెజారిటీ లోక్సభ స్థానాలను(22) గెల్చుకోగలిగింది. టీడీపీ కూటమి ఒకసారి 20, రెండోసారి 15 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. 1999లో కూడా కార్గిల్ యుద్ధ నేపథ్యం, వాజ్పేయి ఇమేజి ఎన్డిఏతోపాటు చంద్రబాబును గెలిపించింది. చంద్ర బాబు గొప్పతనమేమీ లేదు. ఎన్టిఆర్ అకాలమరణానికి కారకుడయిన చంద్రబాబును తెలుగు ప్రజలు ఇప్పటికీ క్షమించలేదు. ఎప్పటికీ క్షమించలేరు. ఆ పాపం చంద్రబాబును పటి ్టకుదుపుతూనే ఉంది.<br />
<br />
ఇక ముందు కూడా అదే జరుగనున్నది. తెలుగుదేశంపై ఇప్పటికీ ఏదైనా అభిమానం మిగిలి ఉందీ అంటే అది ఎన్టిఆర్పై ఉన్న అభిమానమే తప్ప, చంద్రబాబుపై అభిమానం కాదు. చంద్రబాబు తెలంగాణలో కూడా ఇప్పుడు పాత ట్రిక్కులనే ఉపయోగిస్తున్నారు. అబద్ధాల ప్రచారం, పెంపుడు కుక్కల వీరవిహారం, వంది మాగధ పత్రికల పులకింత ఇవన్నీ చంద్రబాబు నాటకంలో భాగం. కానీ ఆ రోజు ఎన్టి ఆర్ మోసపోయి ఉండవచ్చు. ఇప్పుడు తెలంగాణ మోసపోవడానికి సిద్ధంగా లేదు.</div><div class="content" style="background-color: white; color: #333333; font-family: arial, helvetica, sans-serif; font-size: 15px; line-height: 24px; margin-top: 4px;">-కట్టా శేఖర్రెడ్డి</div></div>సత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4596590595254101156.post-27268368359912078632011-12-23T08:08:00.000+02:002011-12-23T09:16:07.999+02:00సామల సదాశివ మాస్టారుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు<div dir="ltr" style="text-align: left;" trbidi="on"><span class="subHead2" style="background-color: white; color: #901853; font-size: 15px; font: normal normal bold 15px/normal arial; margin-bottom: 15px; margin-left: 0px; margin-right: 0px; margin-top: 15px; text-align: -webkit-auto;">‘స్వర లయలు’వ్యాస సంపుటికి దక్కిన గౌరవం<br />
సంగీతం విని స్వర లయలు రాసి<br />
మారుమూల పల్లె నుంచి ఎదిగిన మహారచయిత<br />
పలు భాషల్లో అందెవేసిన చెయ్యి<br />
సంతోషంగా ఉందన్న సరస్వతీ పుత్రుడు<br />
ఇది తెలంగాణకే అవార్డు</span><br />
<img alt="musal-talangana patrika telangana culture telangana politics telangana cinema" src="http://namasthetelangaana.com/updates/2011/Dec/22/musal-telangana-News.jpg" style="background-color: white; border-bottom-color: rgb(77, 81, 87); border-bottom-style: solid; border-bottom-width: 2px; border-image: initial; border-left-color: rgb(77, 81, 87); border-left-style: solid; border-left-width: 2px; border-right-color: rgb(77, 81, 87); border-right-style: solid; border-right-width: 2px; border-top-color: rgb(77, 81, 87); border-top-style: solid; border-top-width: 2px; color: #333333; float: right; font-family: arial, helvetica, sans-serif; font-size: 15px; line-height: 24px; margin-bottom: 2px; margin-left: 2px; margin-right: 2px; margin-top: 2px; text-align: -webkit-auto;" /><span style="background-color: white; color: #333333; font-family: arial, helvetica, sans-serif; font-size: 15px; line-height: 24px; text-align: -webkit-auto;">ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 21(టీ న్యూస్): దశాబ్దాల సాహితీ సేద్యానికి అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ మాగాణ ప్రతిభ మరోసారి దేశాన తలెత్తి నిలిచింది. అడవి బిడ్డల ఒడిలో పుట్టిన కలం అక్షరాలను సానపడుతున్న తీరుకు జాతీయ అవార్డు ఆదిలాబాద్కు నడిచివచ్చింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు డాక్టర్ సామల సదాశివ మాస్టారును కేంద్ర ప్రభుత్వం ఈ యేడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక చేసింది. హిందుస్తానీ శాస్త్రీయ సంగీత నేపథ్యంలో ఆయన రాసిన ‘స్వరలయలు’ పుస్తకానికి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఫిబ్రవరి 14న ఈ అవార్డును ఢిల్లీలో ప్రదానం చేయనున్నారు. తెలుగు, ఉర్దూ, పార్శీ తదితర భాషల్లో సాహిత్యానికి ఆయన చేస్తొన్న కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించడం విశేషం. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్8 చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన రాజీవ్ పురస్కారాన్ని అందుకున్నారు. 2010 సంవత్సరానికి కళారత్న పురస్కారాన్ని కూడా అందుకున్నారు. తాజాగా ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఆయనను వరించింది. అవార్డును అందించిన ఈ పుస్తకాన్ని వేద్కుమార్ సారథ్యంలోని చెలిమి ఫౌండేషన్ ప్రచురించింది.</span><br />
<br />
<span class="subHead2" style="background-color: white; color: #901853; font-size: 15px; font: normal normal bold 15px/normal arial; margin-bottom: 15px; margin-left: 0px; margin-right: 0px; margin-top: 15px; text-align: -webkit-auto;">మరాఠీ సంగీతం వినీ వినీ స్వర లయలు రాశాను</span><br />
<span style="background-color: white; color: #333333; font-family: arial, helvetica, sans-serif; font-size: 15px; line-height: 24px; text-align: -webkit-auto;">అవార్డు రావడం సంతోషంగా ఉంది. అయితే నేను ఎప్పుడు అవార్డుల కోసం ఏదీ రాయలేదు... ఇనాం కేలియే నహీ లిక్తా... (బహుమతుల కోసం రాయను ) స్వరలయలను మరాఠాలో సూరానిలయ్ అంటారు. మరాఠీ సంగీతం వినీ వినీ స్వరలయలు రాశాను. చాలా సంతోషం. గత రెండేండ్ల క్రితమే అవార్డు వస్తుందని ఒక అభిమాని చెప్పాడు. యాద్ జిందగీ హై... సంతోషం </span><br />
<span style="background-color: white; color: #333333; font-family: arial, helvetica, sans-serif; font-size: 15px; line-height: 24px; text-align: -webkit-auto;">- సామల సదాశివ</span><br />
<br />
<span class="subHead2" style="background-color: white; color: #901853; font-size: 15px; font: normal normal bold 15px/normal arial; margin-bottom: 15px; margin-left: 0px; margin-right: 0px; margin-top: 15px; text-align: -webkit-auto;">తెలంగాణ ఆణిముత్యం, సరస్వతి ముద్దుబిడ్డ సదాశివ</span><br />
<span style="background-color: white; color: #333333; font-family: arial, helvetica, sans-serif; font-size: 15px; line-height: 24px; text-align: -webkit-auto;">అడవుల జిల్లా ఆదిలాబాద్ లో పుట్టి పెరిగిన సాహితీవేత్త సామల సదాశివకు జాతీయ సాహిత్యఅకాడమీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణకే ఆణి ముత్యంగా గుర్తింపు తెచ్చుకున్న సదాశివ పండితుల, పామరుల నుంచి కూడా అభినందనలు అందుకుంటున్నారు... ఈ ఆణిముత్యం తెలంగాణ మాగానంలోని మారుమూల దహెగాం మండలం తెనుగుపప్లూలో జన్మించి జిల్లా కేంద్రంలో స్థిరపడ్డారు. 2011, మే 11న 84 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ వైతాళికుడి శిష్యులు, అభిమానులు, అనుచరులు అక్షర కుసుమాలతో ఘనంగా నీరాజనం పలుకుతూ ఆయనను సాహిత్యం ద్వారా వెలుగులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు... సదాశివ కావ్యసుధ పేరుతో ఆ రచనలను గ్రంథస్తం చేశారు. మూడు సంవత్సరాల క్రితం ఈ గ్రంథంను కాగజ్నగర్ పట్టణంలో ఆయన శిష్యులు ఘనంగా ఆవిష్కరించారు. సాహితీ లోకంలో సామల సదాశివ గురించి తెలియని వారుండరు.</span><br />
<br />
<span class="subHead2" style="background-color: white; color: #901853; font-size: 15px; font: normal normal bold 15px/normal arial; margin-bottom: 15px; margin-left: 0px; margin-right: 0px; margin-top: 15px; text-align: -webkit-auto;">పుట్టింది మారుమూల తెనుగుపప్లూలో...</span><br />
<span style="background-color: white; color: #333333; font-family: arial, helvetica, sans-serif; font-size: 15px; line-height: 24px; text-align: -webkit-auto;">సామల సదాశివ దహెగాం మండలంలో తెనుగుపప్లూలో 1928, మే 11న జన్మించారు. ఆయన తల్లిదంవూడులు సామన నాగయ్య పంతులు,చిన్నమ్మలు. ఎంఏ, బీఎడ్, డీ లిట్ చదివారు. డైట్ కళాశాల, ఆదిలాబాద్ ప్రిన్సిపాల్గా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్థుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో ఆయన నివసిస్తున్నారు. తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, ఫారసి, మరాఠీ భాషలలో ఆయన పాండిత్యాన్ని సాగించారు. ఉర్దూ, ఫారసీ, హిందీ, మరాఠీ భాషలకు చెందిన ప్రసిద్ధ కవుల, రచయితల సాహిత్యాన్ని ఆయన అనువదించారు. మూడు వేల వ్యాసాలు ఉర్దూలోనూ, 450 వ్యాసాలు తెలుగులోనూ రాసి ప్రముఖ దిన, వార, పక్ష, మాస పత్రికలలో ప్రచురింపజేశారు. హైదరాబాద్, వరంగల్, కొత్తగూడెం, విశాఖపట్నం, ఆదిలాబాద్, ఆకాశవాణి కేంద్రాల నుంచి అసంఖ్యాకంగా ప్రసంగాలు, ఇంటర్వ్యూలు ఇచ్చారు.</span><br />
<br />
<span style="background-color: white; color: #333333; font-family: arial, helvetica, sans-serif; font-size: 15px; line-height: 24px; text-align: -webkit-auto;">సామల సదాశివ 1963 నుంచి 1983 వరకు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉర్దూ సలహా సంఘం సభ్యులుగా, 1991 నుంచి 1994 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులుగా పని చేశారు. ఆయన చేసిన అంజత్ రుబాయిలు అనువాదానికి 1964లో రాష్ర్ట ప్రభుత్వం ఉత్తమ అనువాద రచనగా గుర్తించింది. 1968లో పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ ప్రదానం. 1994లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ప్రతిభా పురస్కారం, 2002లో కాకతీయ విశ్వ విద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ ప్రదానం, 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్8 రాజశేఖర్ రెడ్డి ప్రతిభా రాజీవ పురస్కారం ప్రదానం. 2011, డిసెంబర్ 21న స్వరలయలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటన. </span><br />
<br />
<span class="subHead2" style="background-color: white; color: #901853; font-size: 15px; font: normal normal bold 15px/normal arial; margin-bottom: 15px; margin-left: 0px; margin-right: 0px; margin-top: 15px; text-align: -webkit-auto;">ప్రచురించిన పుస్తకాలు</span><br />
<span style="background-color: white; color: #333333; font-family: arial, helvetica, sans-serif; font-size: 15px; line-height: 24px; text-align: -webkit-auto;">ప్రభాతము (పద్య సంకలనం), సాంబ శివ శతకము (పద్యాలు), నిరీక్షణము (పద్య సంకలనం), మంచి మాటలు (పద్యాలు), అపశృతి(నవల), ఉర్దూ సాహిత్య చరిత్ర (అనువాదం), అంజద్ రుబాయిలు(అనువాదం), మౌలానా రూమీ మన్నవి (ఫారసీ నుంచి అనువాదం), మీర్జా గాలీబ్ (జీవితం - రచనలు), ఉర్దూ కవుల కవితా సామాగ్రి (కేశవసూత్, మరాఠీ కవి జీవితం ), ఫారసీ కవుల ప్రసక్తి, అర్తి (పద్య కవిత), మలయమారుతాలు(వ్యాసాలు), ఉర్దూభాష కవితా సౌందర్యం (వ్యాస సంపుటి), యాది (జ్ఞాపకాలు), సంగీత శిఖరాలు (వ్యాసాలు) </span><br />
<br />
<span class="subHead2" style="background-color: white; color: #901853; font-size: 15px; font: normal normal bold 15px/normal arial; margin-bottom: 15px; margin-left: 0px; margin-right: 0px; margin-top: 15px; text-align: -webkit-auto;">ప్రచురించాల్సినవి</span><br />
<span style="background-color: white; color: #333333; font-family: arial, helvetica, sans-serif; font-size: 15px; line-height: 24px; text-align: -webkit-auto;">రేవతి (నవల), రాముడు( పిలాసఫీ ఆఫ్ రామా), సునోబాయి సాదూ(కభీర్ దోహల అనువాదం), సాహిత్య అవలోకనం (ఉర్ధూ సాహిత్య చరిత్ర), సాకీనామా(పద్యకావ్యం), విశ్వమివూతము(పద్యకావ్యం), సదాశివలేఖలు పాచీన ఆధునిక భాషా సాహిత్య విమర్శ) </span><br />
<br />
<br />
<span class="subHead2" style="background-color: white; color: #901853; font-size: 15px; font: normal normal bold 15px/normal arial; margin-bottom: 15px; margin-left: 0px; margin-right: 0px; margin-top: 15px; text-align: -webkit-auto;">ఇది తెలంగాణకే అరుదైన గౌరవం</span><br />
<span style="background-color: white; color: #333333; font-family: arial, helvetica, sans-serif; font-size: 15px; line-height: 24px; text-align: -webkit-auto;">ప్రముఖ రచయిత, తెలంగాణ ఆణిముత్యంగా అందరూ భావించే సామల సదాశివగారి రచనకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించడం, అది అతనికే కాక తెలంగాణ గడ్డకే లభించిన అవార్డుగా భావించాలి.</span><br />
<br />
<span class="subHead2" style="background-color: white; color: #901853; font-size: 15px; font: normal normal bold 15px/normal arial; margin-bottom: 15px; margin-left: 0px; margin-right: 0px; margin-top: 15px; text-align: -webkit-auto;">నవల ప్రక్రియకు అరుదైన గౌరవం</span><br />
<span style="background-color: white; color: #333333; font-family: arial, helvetica, sans-serif; font-size: 15px; line-height: 24px; text-align: -webkit-auto;">కేంద్రసాహిత్య అకాడమీ వెల్లడించిన పురస్కారాల్లో పలుభాషల నవలలు ఉండడం ఈ యేటి విశేషం. జీవితంలో అనేక సంఘటనలను కావ్యంగా మలచడంలో భారతీయ సృజనకారులు చేస్తొన్న కృషిని అకాడమీ గుర్తించింది. ఈ విభాగంలో హిందీ నవలా రచయిత కాశీనాథ్ సింగ్ రచించిన ‘‘రహేనా పర్ రగ్గు’’, కన్నడ రచయిత గోపాలకృష్ణ రచించిన ‘‘స్వప్న సరస్వత’’ నవలలకు ఈ గౌరవం దక్కింది. నవలలతో పాటు పలువరు కవులు రాసిన కవుల కావ్యాలకు అవార్డు ప్రకటించిన అకాడమీ ప్రముఖ కాలమిస్టు రామచంద్ర గుహ రచించిన ‘‘ఇండియా ఆఫ్టర్ గాంధీ’’ చారివూతక కథనానికి కూడా కేంద్రసాహిత్య అకాడమి అవార్డును ప్రకటించింది.</span> <br />
<span style="background-color: white; color: #333333; font-family: arial, helvetica, sans-serif; font-size: 15px; line-height: 24px; text-align: -webkit-auto;">(</span><span style="color: #333333; font-family: arial, helvetica, sans-serif;"><span style="font-size: 15px; line-height: 24px;">నమస్తే తెలంగాణ నుంచి)</span></span></div>సత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.com1tag:blogger.com,1999:blog-4596590595254101156.post-42065973618589760712011-11-21T07:05:00.000+02:002011-11-21T07:38:38.126+02:00పసలేని పరకాలవాదం<div dir="ltr" style="text-align: left;" trbidi="on"><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj3CNx59HHa8Swhg-ztd0PACcWBxI1PGO01Ml04n5IPwcIc6i_LBs9D4QCbOIWvod_PuzP3ax2OzUCQ8Jl4_4UCDxiDQOV-ePkb6BpR7Hal6eWjl6Ju_bVkep-txvgKOzXhJv-E-ZSZV4E/s1600/Screenshot.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="246" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj3CNx59HHa8Swhg-ztd0PACcWBxI1PGO01Ml04n5IPwcIc6i_LBs9D4QCbOIWvod_PuzP3ax2OzUCQ8Jl4_4UCDxiDQOV-ePkb6BpR7Hal6eWjl6Ju_bVkep-txvgKOzXhJv-E-ZSZV4E/s400/Screenshot.jpg" width="400" /></a></div><br />
మూడు నాల్గు పార్టీలు మారి నాలుగుసార్లు ఎలక్షన్లలో నిలబడి డిపాజిట్టు కోల్పోయినప్పటికీ రాష్ట్రంలో పరకాల అంటే పెద్దగా ఇంతకుముందు ఎవరికీ తెలియదు. పీఆర్పీలో టికెట్ దొరక్క బయటికి వచ్చి అదోవిషవృక్షం అంటూ పరకాల హడావిడీ చేసినతరువాత మాత్రం కొన్నిరోజులు పరకాలకు టీవీల్లో మంచి పబ్లిసిటీ దొరికింది. ఆతరువాత మల్లీ ఎవరూ పట్టించుకోకపోయేసరికి ఎలాగోలా మల్లీ టీవీ హెడ్లైన్లలోకెక్కాలని ఈమధ్యన విశాలాంధ్ర మహాసభ అంటూ ఒక వెబ్సైటు పెట్టుకుని హడావిడీ చేస్తున్నాడు. అసలిది విశాలాంధ్ర మహాసభ కాదు, ఇదొక విషాంధ్ర మహాసభ, వీరికంటూ ఒక వాదం గట్రా ఏంఈలేదు, తెలంగాణా వాదాన్ని, తెలంగాణ ఉద్యమకారులను తిట్టడమే వీరి ఏకైక అజెండా అని జనాలు చెప్పుతున్నారనేది వేరే విషయం. <br />
<br />
సరే ఈవెబ్సైటుతో మీడియా వర్క్షాప్ గట్రా అంటూ హడావిడీ చేసి తెలంగాణవాదుల్ని రెచ్చగొట్టి ఎలాగయితేనేం పరకాల మల్లీ వార్తల్లోకి వచ్చాడు. ఎలాగూ పరకాలకు కావల్సిందదే, వార్తల్లోకి ఎక్కడం, పబ్లిసిటీ పెంచుకోవడం. ఇప్పటికే మూడు పార్టీలు మార్చి వెల్తూ వెల్తూ పీఆర్పీని తిట్టిని తిట్లకు ఎలాగూ ఇప్పుడూ ఎవరూ ఈయన్న పార్టీలోకి చేర్చుకోరు.<br />
<br />
ఈవిషాంధ్ర మహాసభ వెబ్సైటూ, బ్లాగూ నడుపుతూ ఇంతవరకూ సాధించింది ఏంతయ్యా అంటే ఫలానా తెలంగాణ నాయకుడు ఫలానా టైంలో సమైక్యాంధ్రకు జైకొట్టాడు అంటూ పేపర్ కటింగులు పెట్టడం, లేదా తెలంగాణ వాదుల్ని వేర్పాటువాదులు అంటూ తిట్టిపొయ్యడం. మొదట్లో కొన్నిరోజులు అసలు తెలంగాణకు నీటిపారుదలలో ఎలాంటి వివక్షా జరగలేదంటూ లోక్సత్తా రిపోర్టును సాక్ష్యంగా చూపుతూ హడావిడీ చేశారు కానీ అవన్నీ తప్పని బ్లాగుల్లో నిరూపించబడడంతో సమాధానం చెప్పలేక నోర్మూసుకున్నారు.<br />
<br />
పరకాల ఈమధ్య టీవీల్లో బాగా హడావిడీ చేస్తున్నాడు. పరకాలకు, ప్రొఫెసర్ హరగోపాల్కు మధ్యన మహాటీవీలో ఒక చర్చా కార్యక్రమం జరిగింది. ఆసక్తి కరంగా ఉంది కదా అని నేనూ ఓపిగ్గా అన్ని వీడియోలు చూశాను. లండన్లో పీహెచ్డీ చేసిన ఈమహానుభావుడు ఏంచెబుతాడో చూద్దామంటే అసలు ఎంతసేపూ చెప్పిందే చెప్పి బోరుకొట్టించడం లేకపోతే ఎదుటివారిని ఎగతాళి చెయ్యడం తప్ప ఈయన వాదన శూన్యం. కాలికేస్తే మెడకేస్తాను, మెడకేస్తే కాలికేస్తాను అదే నావాదన అని నిరూపించుకుంటున్న ఈయన ఒకే అర్ధం వచ్చే విషయానికి వరుసగా పది పర్యాయపదాలు చెబుతూ అదే వాదన అని భ్రమ పడుతున్నాడు.<br />
<br />
"సమైక్యవాదం ఒక గొప్ప ఉదాత్తమమయిన వాదం, తెలంగాణ అన్నిరంగాలలోనూ ఈఈ సూచీల్లో మిగతా ప్రాతాల్లోకన్నా ముందుంది, తెలంగాణలో లక్షలాది ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు." ఇవే విషయాలను పదే పదే వల్లించడం తప్ప ఇంక ముందుకు వెల్లడు, ఆయా వాదనలపై హరగోపాల్ అడిగే సహేతుక ప్రశ్నలకు ఈఅయన దగ్గర సమాధానం ఉండదు, పైగా మల్లీ మల్లీ వేర్పాటువాదుల వాదనలో పస లేదు అంటూ అరవడం. అసలు తెలంగాణవాదుల్ని వేర్పాటువాదులు అని పిలిచేవారినీ, అలా పిలవడాన్ని సమర్ధించే టీవీ చానెల్లను బొక్కలో వెయ్యాలని నా అభిప్రాయం, ప్రస్తుతం ఉన్న సీమాంధ్రప్రభుత్వంలో అది సాధ్యం కాదుగానీ.<br />
<br />
జీడీపీలు, తలసరి ఆదాయాలు అభివృద్ధిని చెప్పలేవు, వాస్తవపరిస్థుతులు అలాలేవు. అన్నీ బాగా ఉంటే మరి క్రిష్నా పక్కనే ఉండగా నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య, మహబూబ్నగర్లో కరువు ఎందుకు ఉంటుంది అంటే అందుకు సీమాంధ్ర ఎలా కారణం అంటూ దాటవేస్తాడు. తెలంగాణ అన్ని రంగాల్లో మిగతాప్రాంతాలకంటే చాలా అభ్వృద్ధి చెందిందనే ఈయన వాస్తవపరిస్థుతులు చెబుతుంటే తప్పించుకోవడం ఎందుకు? అక్కడ వాదన మహబూబ్నగర్ ఎండిపోవడానికి సీమాంధ్ర ప్రజలే కారణమని కాదు, ఈయన చెప్పే తెలంగాణ చాలా అభివృద్ధి చెందింది అనేది తప్పని చెప్పడం.<br />
<br />
లక్షలాది ప్రజలు తెలంగాణలో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు అని పదేపదే వల్లిస్తాడు, మరి అందుకు సాక్ష్యం ఏది, ఏదయినా మహాసభ నిర్వహించారా, ర్యాలీ జరిగిందా అంటే సమాధానం ఉండదు. కానీ ఇదిగో నలమోతు తెలంగాణవాడే అని చెబుతాడు. ఆ బాషా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టయితే ఈయనకు నలమోతు ఒక్కడే లక్షలాది ప్రజల్లాగా కనిపిస్తున్నారేమో.<br />
<br />
సమైక్యభావన గొప్ప ఉదాత్తమమయిన భావన అనేది ఈయన మరో పాయింటు. మరి సమైక్యవాదంలో ప్రజలను సంతృప్తి పరచడానికి ఏదయిన ఆదాయవనరు ఉందా, సమైక్యవాదంలో కలిపిఉంచే అంశమేంటి అనడిగితే దానికీ సమాధానం ఉండదు. ఊరికే మమ్మల్ని సమైక్యవాదం ప్రచారం చేసుకోనీయట్లేదు అంటూ దొంగ ఏడుపులు మాత్రం ఏడుస్తుంటాడు. అయ్యా పరకాలా, నీవాదానికి నిజంగా నువ్వు చెప్పేట్లు లక్షలాది ప్రజల మద్దతు ఉంటే ఒకరు నీవాదాన్ని వినిపించకుండా ఆపలేరు, ప్రజలే నీకు మద్దతుగా వస్తారు, ఇక్కడ ఎవరూ సమైక్యంగా ఉండాలని కోరుకోవట్లేదు కాబట్టే నీకు ఒక మీటింగు పెట్టుకోవడం కూడా గగనమవుతుంది. నువ్విక్కడీకొచ్చి వేర్పాటువాదులూ లాంటి భాషను ఉపయోగితూ ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పెద్దలను అగౌరవపరచడం రెచ్చగొట్టడం తప్ప మరోటి కాదు, ఈవిషయం నీక్కూడా తెలుసుననుకో, అయినా ఇలా చెప్పాల్సి వస్తుంది.</div>సత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.com6tag:blogger.com,1999:blog-4596590595254101156.post-74915891120133208052011-11-16T16:30:00.000+02:002011-11-16T16:31:28.424+02:00విస్తృత స్థాయి చర్చలు<div dir="ltr" style="text-align: left;" trbidi="on"><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjEc8nhWJEfJQ4r6XLGheTRBecYz12YCJ4cCf1nIt173wrfwvPKOmCThuAzqRJirgowdgP_NCPPsLyKfbG7n3XsLLaJLoNPRTB5jVZgjWxurucfZpvRdGm1f3pXFekFJ_T3c_xB86wjfYc/s1600/sonia_manmohan2_20101102.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="213" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjEc8nhWJEfJQ4r6XLGheTRBecYz12YCJ4cCf1nIt173wrfwvPKOmCThuAzqRJirgowdgP_NCPPsLyKfbG7n3XsLLaJLoNPRTB5jVZgjWxurucfZpvRdGm1f3pXFekFJ_T3c_xB86wjfYc/s320/sonia_manmohan2_20101102.jpg" width="320" /></a></div><br />
<b>జూన్ 2011:</b><br />
<br />
తెలంగాణ అంశంపై యూపీయే ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు చెందిన అన్ని కాంగ్రేస్ మరియూ ఇతర పార్టీల నేతలతో చర్చలు జరుపుతుంది. ఇది చాలా సున్నితమైన అంశం, అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం కనుక ఈవిషయంపై తొందరపాటుతో వ్యవహిరించకుండా అన్నివర్గాలవారి అంగీకారంతో అందరికీ అనుకూలమైన నిర్ణయం తీసుకుంటాం.<br />
<br />
<b>నవంబరు 2011:</b><br />
<br />
తెలంగాణ అంశంపై యూపీయే ప్రభుత్వం జాతీయస్థాయిలో అందరు యూపీయే భాగస్వామ్య పార్టీలతోనూ మరియూ ఇతర వర్గాలతోనూ విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతుంది. తెలంగాణ అంశం ఒక్క తెలంగాణప్రాంతానికి సంబంధించిన వ్యవహారం మాత్రమేకాదు, ఇది దేశంలోని అన్ని ప్రాంతాలనూ ప్రభావితం చేసే విషయం. తెలంగాణ డిమాండ్ పరిష్కరిస్తే దేశంలో ఇంకా ఇలాంటి డిమాండ్లు పుట్టుకొచ్చే అవకాశం ఉంది. కనుక అందరినీ సంప్రదించినతరువాత కీలక నిర్ణయం తీసుకుంటాం.<br />
<br />
<b>జనవరి 2012: </b><br />
<br />
తెలంగాణ అంశంపై యూపీయే ప్రభుత్వం ప్రపంచంలోని అన్ని పెద్ద దేశాల నేతలతో అత్యంత విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతుంది. ఈఅంశానికి సంబంధించి మన విదేశాంగ మంత్రి బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, టాంజానియా దేశాలనేతలతో రాబోయే నాలుగు నెలల్లో కీలక చర్చలు నిర్వహిస్తారు. తెలంగాణ డిమాండ్ లాంటిదే టాంజానియాలోనూ ఒక డిమాండ్ ఉంది, మరియూ ముందు ముందు ఈసమస్యను పరిష్కరిస్తే ఉగాండా, కాంబోడియా లాంటి దేశాల్లో కొత్త డిమాండ్లు ఉత్పన్నమయే అవకాశం ఉంది. కనుక అందరితో చర్చించిన తరువాత ప్రభుత్వం ఒక చక్కని శాశ్వత పరిష్కారాన్ని ప్రకటిస్తుంది.<br />
<br />
<b>మార్చి 2013:</b><br />
<br />
ఇప్పటికే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చలు పూర్తిచేశాం. ఈచర్చలు చాలా వేగవంతంగా పూర్తిచేయగలిగాం, చర్చలు చాలావరకు సత్ఫలితాలనిచ్చాయి. అయితే రాబోయే కాలంలో ఒక్క భూమిమీదే కాక ఇంకా ఎక్కడైనా జీవరాశి ఉంటే అక్కడకూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమయే అవకాశాలు ఉన్నాయి. దీనికోసం యూపీయే ప్రభుత్వం ఏలియన్లతో కూడా చర్చించాలని నిర్ణయించుకుంది, దానికోసం ఒక కమిటీని రూపొందించాం. ఈకమిటీ అసలు భూమండలం కాక ఎక్కడయినా జీవరాశి ఉందా అన్న విషయంపై ముందుగా అధ్యయనం చేసి ఒక నివేదిక ఇస్తుంది. ఆతరువాత అక్కడి జీవరాశితో ఒక కమ్యూనికేషన్ చానెల్ను తయారుచేసి సంప్రదింపులు చేయడంకోసం మరో కమిటీని నియమిస్తాం.<br />
<br />
మొత్తానికి ఈసమస్య ఎంతో సంక్లిష్టమయిన సమస్య అయినా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చాలా వేగవంతంగా చర్చలు పూర్తిచేయగలిగాం. ఇకముందు కూడా అదేవేగంతో విశ్వవ్యాప్త సంప్రదింపులు పూర్తిచేస్తామని ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాం.<br />
<div><br />
</div></div>సత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.com2tag:blogger.com,1999:blog-4596590595254101156.post-75127829287383424982011-11-08T21:37:00.001+02:002011-11-08T22:40:40.285+02:00తొంభై ఐదేళ్ళ యువకుడు<div dir="ltr" style="text-align: left;" trbidi="on"><span class="Apple-style-span" style="background-color: white; font-family: georgia; line-height: 16px;">సంవత్సరం క్రితం రాసిన టపా..బ్లాగరులకోసం మరొకసారి.</span><br />
<h2 class="date-header" style="font-family: georgia; font-size: 12px; font-style: italic; font-weight: normal; line-height: 1.4em; margin-bottom: 0.5em; margin-left: 0px; margin-right: 0px; margin-top: 1.5em;"><span class="Apple-style-span" style="background-color: #f3f3f3;">Thursday, 23 December 2010</span></h2><div class="post hentry" style="color: #333333; font-family: arial, helvetica, 'times New Roman'; font-size: 13px; margin-bottom: 1.5em; margin-left: 0px; margin-right: 0px; margin-top: 0.5em; padding-bottom: 1.5em;"><span class="Apple-style-span" style="background-color: #f3f3f3;"><a href="http://www.blogger.com/post-edit.g?blogID=4596590595254101156&postID=7512782928738342498&from=pencil" name="2537087721556410978"></a></span><br />
<h3 class="post-title entry-title" style="color: black; font-size: 22px; font-weight: normal; line-height: 1.4em; margin-bottom: 0px; margin-left: 0px; margin-right: 0px; margin-top: 0.25em; padding-bottom: 4px; padding-left: 0px; padding-right: 0px; padding-top: 0px;"><a href="http://edisatyam.blogspot.com/2010/12/blog-post.html" style="color: black; display: block; font-weight: bold; text-decoration: none;"><span style="background-color: #f3f3f3; color: green;">తొంభై ఐదేళ్ళ యువకుడు</span></a></h3><div class="post-header-line-1"></div><div class="post-body entry-content" style="font-size: 14px; line-height: 1.6em; margin-bottom: 0.75em; margin-left: 0px; margin-right: 0px; margin-top: 0px;"><span style="background-color: #f3f3f3; color: maroon;">శ్రీ కొండా లక్ష్మన్ బాపూజీ గారు ప్రస్తుత తరం ప్రజలకి అంతగా తెలియని వెనుకటి తరం కాంగ్రేస్ నాయకుడు. తొంభై అయిదు సంవత్సరాలు పైబడ్డ వయసులో కూడా కొండా లక్ష్మన్ గారు తెలంగాణా ఉద్యమంలో అత్యంత చురుగ్గా పాల్గొంటూ అనేక కార్యక్రమాలలో ముఖ్య అథిధిగా, వక్తగా ఉద్యమానికి తోడ్పడుతున్నారు..<br />
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhenxIbAKvgsPiQXkCB-QCyLe6othyphenhyphenbxpM_D4I3YSL0K7uof2Wzyfoh7E-9dRtV92OWZEXKlSJAyGrhPfnGatgMBLVpojXMICd6Ux83ouH2WE1cJoN-vBrMz3P8DS9jDoLnHppSpUfiMfU/s1600/konda.gif" style="color: #83653b; text-decoration: none;"><img alt="" border="0" id="BLOGGER_PHOTO_ID_5553981579382563698" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhenxIbAKvgsPiQXkCB-QCyLe6othyphenhyphenbxpM_D4I3YSL0K7uof2Wzyfoh7E-9dRtV92OWZEXKlSJAyGrhPfnGatgMBLVpojXMICd6Ux83ouH2WE1cJoN-vBrMz3P8DS9jDoLnHppSpUfiMfU/s320/konda.gif" style="border-bottom-color: rgb(204, 204, 204); border-bottom-style: solid; border-bottom-width: 1px; border-left-color: rgb(204, 204, 204); border-left-style: solid; border-left-width: 1px; border-right-color: rgb(204, 204, 204); border-right-style: solid; border-right-width: 1px; border-top-color: rgb(204, 204, 204); border-top-style: solid; border-top-width: 1px; cursor: pointer; display: block; height: 168px; margin-bottom: 10px; margin-left: auto; margin-right: auto; margin-top: 0px; text-align: center; width: 110px;" /></a><br />
స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న కొండా లక్ష్మన్ గారు 1956లొ ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాతి మొట్టమొదటి అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. ఆ తరువాత రాష్ట్ర మంత్రిగా విభిన్న ప్రభుత్వాలలో పనిచేసిన ఈ నేత 1969లో తెలంగాణా ఉద్యమానికి మద్దతుగా తన పదవికి రాజీనామా చేశి ఉద్యమంలో భాగస్వామ్యం తీసుకున్నారు. ఆదిలాబాద్ వాస్తవ్యుడైనప్పటికీ నల్లగొండ జిల్లా నుండి అసెంబ్లీకి ప్రాతినిఘ్యం వహించారు. తెలంగాణా ప్రజా సమతి ఫౌండింగ్ మెంబర్ కూడా అయిన కొండా లక్ష్మన్ గారు నేటికీ అదే ఉద్యమస్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు.<br />
<br />
సుమారు నలభై ఏళ్ళుగా తెలంగాణా ఆశయం కోసం పనిచేసిన కొండా లక్ష్మన్ గారు టీఆరెస్ పార్టీ ఆఫీసు కోసం తన నివాస గృహాన్ని అద్దె లేకుండానే ఇవ్వగా అక్కసుతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టాంక్బండ్ పక్కన ఉన్న వారి ఇంటిని అధికారబలంతో రాత్రికి రాత్రి నేలమట్టం చేయించాడు.<br />
<br />
తన ఇద్దరు కొడుకులలో ఒక కొడుకు ఇండియన్ ఎయిర్ఫోర్సులో పైలట్గా పని చేసి విమాన ప్రమాదంలో మృతి చెందగా మరో కొడుకు అమెరికాలో ఉంటూ ఇటీవలే అనారోగ్యంతో చనిపోయారు. తొంభై ఏల్ల వయసులో కూడా తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న బాపూజీ గారు ఈ వయసులో కూడా ఉద్యమానికి సంబంధించి ఎవరు ఏ సమావేశానికి ఆహ్వానించినా తప్పకుండా వెలుతారు. ఈ తొంభై అయిదేళ్ళ యువకుడి ఉద్యమస్ఫూర్తికి నా జోహార్లు.</span><br />
<div style="clear: both;"></div></div><div class="post-footer" style="color: #555555; font-family: georgia; font-size: 12px; font-style: italic; letter-spacing: 0px; line-height: 1.4em; margin-bottom: 0.75em; margin-left: 0px; margin-right: 0px; margin-top: 0.75em;"><div class="post-footer-line post-footer-line-1"><br />
</div><div class="post-footer-line post-footer-line-2"></div></div></div></div>సత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4596590595254101156.post-7176973451501453512011-11-03T11:02:00.000+02:002011-11-03T11:06:31.219+02:00వంచన దోపిడీ పునాదులుగా (నాటకం) -2<div dir="ltr" style="text-align: left;" trbidi="on"><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhYAeUPbdrE3rYL_nVxHlowG0CMb4ockX0j2_6hKO4A4f8YRVkpUeLdckLRxrwRWJd0bFOxighkb48nFq7BazduqeWpXg396HiqQWRVI5NLJbo1RFV431rddNAv9GBMjXiePh9jTrzCJPc/s1600/us3-lie-cheat-steal.jpeg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="317" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhYAeUPbdrE3rYL_nVxHlowG0CMb4ockX0j2_6hKO4A4f8YRVkpUeLdckLRxrwRWJd0bFOxighkb48nFq7BazduqeWpXg396HiqQWRVI5NLJbo1RFV431rddNAv9GBMjXiePh9jTrzCJPc/s320/us3-lie-cheat-steal.jpeg" width="320" /></a></div><br />
<div style="text-align: center;"><b><span class="Apple-style-span" style="font-size: large;">సీన్ - 3</span></b></div><br />
టెంట్ హౌజ్ నుండి తెచ్చి వేసిన ఒక షామియాన కింద సంజీవ్, ప్రకాశ్, బ్రహ్మానంద్, గోపాల్ కూర్చుని మంతనాలు చేస్తుంటారు. పక్కనే కాస్త దూరంగా కొందరు మేకలు కాసుకునేవారు మాట్లాడుకుంటూ వీల్లే మన ముఖ్యమంత్రీ, మంత్రులూ నంట, ఈషామియానాలోనే మన పెబుత్వం నడుస్తుందంట నీకు తెలుసా అని చెవులు కొరుక్కుంటుంటారు.<br />
<br />
<b>సంజీవ్: </b> శ్రీరాం గాడి చావు పుణ్యమా అని రాష్ట్రం, పదవులూ అయితే దక్కాయి గానీ ఏమిటీ విధి వైపరీత్యం? షామియానాలకింద అసెంబ్లీలూ, సెక్రెటేరియట్లూనూ!!<br />
<br />
<b>ప్రకాశ్: </b> నా పరిస్థితి అయితే పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుంది. ఇంతకుముందు చక్కగా మంత్రి పదవి వెలగబెడుతూ క్రిష్ణా రామా అంటూ ఉండేవాడిని. ఇప్పుడు ముఖ్యమంత్రినయ్యాను గానీ ఒక అసెంబ్లీ లేదు, ఒక కారు లేదు. ఎండలో కూర్చోవాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు జీతాలడుగుతున్నారు, ఇద్దామంటే ఒక్క పైసా లేదు.<br />
<br />
<b>గోపాల్: </b>ఇప్పుడేం చేద్దాం?<br />
<br />
<b>బ్రహ్మానంద్: </b>ఇలా ఎక్కువరోజులు భరించలేం, ఏదో ఒకటి చేసి ఈపరిస్థితినుండి బయట పడాలి. కేంద్రం ఏమన్నా డబ్బిస్తుందంటావా?<br />
<br />
<b>గోపాల్: </b>కేంద్రామా నా బొందా, ఒక చిప్ప ఇస్తుంది.<br />
<br />
<b>ప్రకాశ్: </b>ఎలాగోలా మనం భాగ్యనగర్ను దక్కించుకున్నామంటే మన కష్టాలన్నీ తీరిపోయి మల్లీ భాగ్యం చేతికొస్తుంది. దానికోసం ఏం చెయ్యాలో మార్గాలు వెతకాలి.<br />
<br />
<b>గోపాల్: </b>మనదగ్గర రాజధాని కాదు గదా ఒక జిల్లాను పరిపాలించడానికి కూడా సరిపోయే నగరం ఒక్కటంటే ఒక్కటి లేదు.<br />
<br />
<b>సంజీవ్: </b>మరెందుకాలస్యం? తొందరగా భాగ్యనగర్ను దక్కించుకునేందుకు పావులు కదుపుదాం. అక్కడ మిగులు బడ్జెట్ కూడా ఉందంట. మన కష్టాలన్నీ తీరిపోతాయి.<br />
<br />
<b>బ్రహ్మానంద్: </b>మనం కలవమంటే వాల్లు కలుస్తారా? మన సంగతి తెలిసినవారు ఎవరైనా మనల్ని నమ్ముతారంటావా?<br />
<br />
<b>సంజీవ్: </b> వాల్లు మనల్ని నమ్మరనేది నిజం, కానీ ఎలాగయినా నమ్మించాలి మరో మార్గం లేదు.<br />
<br />
<b>ప్రకాశ్: </b>ఐదుగురు పెద్దమనుషులను కూర్చోపెట్టి పంచాయితీ పెడదాం వాల్లేం అడిగితే అది ఒప్పుకుని సంతకాలు పెడదాం. అమలయేనాటికి ఎవడు బతికుంటాడో, ఎవడు చస్తాడో ఎవరికి తెలుసు?<br />
<br />
<b>సంజీవ్: </b>ఈ ఐడియా బాగానే ఉంది గానీ ముందు ఢిల్లీ ఒప్పుకుంటుందా?<br />
<br />
<b>ప్రకాశ్: </b> నీకన్నీ అనుమానాలే. మనం గట్టిగా లాబీయింగ్ చెయ్యాలి గానీ ఢిల్లీని ఒప్పించడం పెద్ద కష్టమా?<br />
<br />
<b>గోపాల్:</b> మరి అక్కడి ప్రజలసంగతో? వారు ఇందుకు అస్సలు ఒప్పుకోరు. మొదట్నుంచీ మన జనాలు వాల్లను తక్కువగా చూస్తారనీ, వాల్ల యాసను వెక్కిరిస్తారనీ వారికి తెలుసు కదా?<br />
<br />
<b>ప్రకాశ్: </b>అందరం తెలుగువాల్లమే అనీ, తెలుగు జాతి ఐక్యత అనీ ప్రచారం చెయ్యాలి. తెలుగుతల్లి విగ్రహాలు ఊరూరా పెట్టాలి. మన శ్రీరాం గాడి బొమ్మను కూడా అక్కడ ఊరూరా పెడదాం. మెల్లగా జనాలు దారికొస్తారు.<br />
<br />
<br />
</div>సత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.com1tag:blogger.com,1999:blog-4596590595254101156.post-65495213570993491232011-11-02T19:20:00.000+02:002011-11-02T19:20:56.192+02:00పొట్టి శ్రీరాములు గురించి తెలంగాణవాదిగా!!<div dir="ltr" style="text-align: left;" trbidi="on">ఈమధ్యన కొందరు తెలుగు బ్లాగరులు తెలంగాణవాదులు పొట్టిశ్రీరాములును ద్వేషిస్తున్నట్టూ, అవమానిస్తున్నట్టు ప్రచారాలు చేస్తున్నారు. నిజానికి పొట్టి శ్రీరాములుపై తెలంగాణవాదులకు ఎలాంటి ద్వేషం లేకపోగా ఒక గాంధేయవాదిగా, తాను నమ్మినదానికోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తిగా గౌరవం ఉంది. తెలంగాణవాదులు ఎక్కడా పొట్టి శ్రీరాములును ద్వేషించలేదు, దూషించలేదు. కొండకచో కొందరు ఆవేశపూరిత ఉద్యమకారులు పొట్టి శ్రీములు విగ్రహాలను తొలగించడానికి ప్రయత్నం చేసినా అది పొట్టి శ్రీరాములుపై కోపం కాదు, తెలంగాణవాదుల కోపం కేవలం తమప్రాంతానికి సంబంధం లేని వ్యక్తి విగ్రహాన్ని తమ ప్రాంతంలో ఊరూరా (హైదరాబాద్ మాత్రమే కాదు, ప్రతి జిల్లాలో అని గమనించాలి) ప్రతిష్టించి తమ అభిజాత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం పైనా, చరిత్రను వక్రీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ అవతరణకు పొట్టిశ్రీరాములుకు ముడిపెట్టడం పైనా.<br />
<br />
<br />
ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ముందుగా దీక్ష చేసింది గొల్లపూడి సీతారాం. అతని దీక్ష తరువాత కేంద్రప్రభుత్వం సూత్రప్రాయంగా ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు ఒప్పుకుంది. ఆతరువాత పొట్టి శ్రీరాములు దీక్ష చేసింది మద్రాసు నగరం రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడాలి అనే ప్రధాన డిమాండ్తో కాగా అతని డిమాండ్ తీరకుండానే పొట్టి శ్రీరాములు గతించారు.<br />
<br />
నిజానికి ఎలాగూ దక్కదని తెలిసీ మద్రాసు నగరం కోసం పొట్టి శ్రీరాములును దీక్షకు ఉసిగొల్పిందీ, అతను దీక్షకు పూనుకుంటే ఈడిమాండ్ నెరవేరడం కాష్టమని చెప్పి దీక్ష విరమణకోసం ప్రయత్నం చెయ్యనిదీ ఆంధ్ర నాయకులే. దీక్ష చివరిరోజుల్లో అపస్మారక స్థితిలో ఉండి తన స్వంత నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు విరమింపజేయాల్సింది ఆంధ్రనాయకులే అయినా వారు దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చెయ్యలేదు. ఈవిధంగా పరోక్షంగా పొట్టి శ్రీరాములు మృతికి కారణం ఆంధ్ర నాయకత్వమే.<br />
<br />
ఇక స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, ఆంధ్రరాష్ట్ర ఉద్త్యమానికి ముందు పొట్టి శ్రీరాములు ఒంటరిగా దళిత అభ్యున్నతికై ఉద్యమిస్తూ రోడ్డుపై బ్యానర్ పట్టుకుని కాల్లకు చెప్పుల్లేకుండా తిరుగుతుంటే ఏఆంధ్రా నాయకులూ అతనికి సహకారం ఇచ్చిన పాపాన పోలేదు. అప్పుడు ఆంధ్రా ప్రజానీకమే పొట్టి శ్రీరాములును పిచ్చివాడికింద జమకట్టి అవమానించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినతరువాత ఒక్కసారిగా పొట్టి శ్రీరాములు హీరోను చేసి ఆంధ్రాకంటే కూడా ఎక్కువ విహ్రహాలను తెలంగాణలో ప్రతిష్టించింది కూడా ఆంధ్రా నాయకులే. పాఠ్యపుస్తకాల్లో పొట్టి శ్రీరాములు మూలంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందనే అర్ధం వచ్చేలా పాఠాలు చొప్పించిందీ ఆంధ్రా నాయకత్వమే. పొట్టి శ్రీరాములు ఆత్మ నేడు ఎవరిచర్యలవల్ల క్షోభిస్తుందో!!<br />
<br />
ఇప్పుడు తెలంగాణవాదులు మాకు సంబంధం లేని వ్యక్తుల విగ్రహాలు మాప్రాంతంలో వద్దు, చరిత్రను వక్రీకరించి నవంబరు ఒకటి ఆంధ్రప్రదేశ్ అవతరణకు, పొట్టి శ్రీరాములుకు ముడిపెట్టొద్దంటే తెలంగాణవాదులను ద్రోహులు అంటూ అవాకులు పేలుతున్నదీ ఆంధ్రా నాయకులూ, బ్లాగరులే.పొట్టి శ్రీరాములు విగ్రహానికి దండేయాల్సింది నవంబరు ఒకటిన కాదు, అక్టోబరు ఒకటి రోజు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ గూర్చి.<br />
<br />
<br />
<br />
</div>సత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.com7tag:blogger.com,1999:blog-4596590595254101156.post-44904030536641246132011-11-02T12:38:00.001+02:002011-11-02T12:39:09.663+02:00వంచన, దోపిడీ పునాదులుగా (నాటకం) -1<div dir="ltr" style="text-align: left;" trbidi="on"><div style="text-align: center;"><b><span class="Apple-style-span" style="font-size: large;">సీన్-1: </span></b></div>ప్రకాశ్, గోపాల్, సంజీవ్, బ్రహ్మానంద్ కలిసి గదిలో మంతనాలు చేస్తున్నారు<br />
. <br />
<b>సంజీవ్: </b> భజగోవిందం, భజగోవిందం. అంతా అయిపోయింది. ఆఖరుకు ఎమ్మెల్యే పదవి కూడా దక్కలేదు. ఈకమ్యూనిస్టులు చెయ్యబట్టి సొంత నియోజకవర్గంలో ఓడిపోయాను. ఇంతబతుకూ బతికి ఇంటెనుక చచ్చినట్టు ముఖ్యమంత్రినవుదామని కలలు గంటే ఎమ్మెల్యేగిరీ దక్కలేదు.<br />
<br />
<b>బ్రహ్మానంద్: </b> నాపరిస్థితి కూడా సేం టు సేం. నేనెవరితో చెప్పుకునేది?<br />
<br />
<b>గోపాల్: </b> బాగుంది వరస. నేను మాత్రం ఎమన్న ఎక్కువ బావుకున్నానా? నేనూ మీవంతే. ఇంగ్లీసోడి చదువులు చదువుకున్నందుకు ఇన్నాల్లూ కాంగ్రేస్ పార్టీలో నాయకత్వం వెలగబెట్టాము గానీ ఇప్పుడా ఇంగ్లీసోడు వెల్లిపొయ్యాక మన ఇంగ్లీసుకు విలువ లేదు. సొంతనియోజక వర్గంలో ప్రజలు మనల్ని నమ్మడం లేదు. ఇప్పుడేం మార్గం?<br />
<br />
<b>గోపాల్, సంజీవ్, బ్రహ్మానంద్: </b> ప్రకాశ్, నువ్వే ఏదో ఒక మార్గం చెప్పు. నువ్వు చక్కగా మంత్రి పదవి వెలగబెడుతున్నావుగా?<br />
<br />
<b>ప్రకాశ్:</b> నాగోడెవరితో చెప్పుకునేది? ఈ రాజా ఢిల్లీకి వెల్లినవాడు అక్కడే ఉండక వెనక్కొచ్చి ముఖ్యమంత్రి పదవి లాగేసుకున్నాడు. మనకు ఇక బతికుండగా ముఖ్యమంత్రి పదవి దక్కడం కష్టం.<br />
<br />
<b>సంజీవ్:</b> అయితే ఇప్పుడు ఏమిటి సాధనం?<br />
<br />
<b>ప్రకాశ్: </b> దీనికొక్కటే మార్గం ఉంది. మనం వెంటనే మనకో ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆందోళన చేద్దాం. ప్రజల్లో మల్లీ పలుకుబడి వస్తుంది. ఒకవేళ రాష్ట్రం గానీ వస్తే గిస్తే మనం ముగ్గురం ముఖ్యమంత్రి పదవులు పంచుకోవచ్చు.<br />
<br />
<b>బ్రహ్మానంద్:</b> మనం ఉద్యమం చేస్తే ఎవరు నమ్ముతారు? పోనీ నిరాహార దీక్షలూ గట్రా చేద్దామంటే మనకసలే అలవాటు లేదాయే?<br />
<br />
<b>ప్రకాశ్: </b> మన చేతికి మట్టంటించుకోవడం ఎందుకు? ఏదారే పోయే శ్రీరాం గాన్నో దీక్షకు కూర్చోపెడితే సరి, చస్తే వాడే చస్తాడు. పదవులు మనం కొట్టేయొచ్చు.<br />
<br />
<b>సంజీవ్: </b> బాగుంది ఈ ఐడియా. మరి ఎప్పుడు మొదలెడుదాం?<br />
<br />
<b>గోపాల్: </b> ఆలస్యం అమృతం విషం, శుభస్య శీఘ్రం. <br />
<br />
<div style="text-align: center;"><span class="Apple-style-span" style="font-size: large;"><b>సీన్- 2:</b></span></div>ప్రకాశ్, గోపాల్, సంజీవ్, బ్రహ్మానంద్ గదిలో తీవ్రంగా వాదులాడుకుంటున్నారు.<br />
<br />
<b>సంజీవ్:</b> ముఖ్యమంత్రి పదవి నాకే దక్కాలి. లేకపోతే నేను నామద్దతు విరమించుకుంటాను. మా ప్రాంతం కొత్తరాష్ట్రంలో కలవనివ్వను.<br />
<br />
<b>గోపాల్:</b> నేనొప్పుకోను, నాకే దక్కాలి. నీక్కావాలంటే ఉపముఖ్యమంత్రి పదవి తీసుకో.<br />
<br />
<b>ప్రకాశ్:</b> మీరు కాస్త ఊరుకోండి. వయసు పైబడ్డవాన్ని. ఈసారికి నన్ను ముఖ్యమంత్రిని కానివ్వండి. తరువాత మీఇష్టం.<br />
<br />
పక్కగదిలో నుంచి బలహీనంగా మాటలు వినిపిస్తున్నాయి. "ఆకలి. ఆకలి. నాక్కాస్త అన్నం పెట్టండి. నేను తట్టుకోలేకపోతున్నాను. నాకింకా ఈదీక్ష వద్దు. కాస్త అన్నం పెట్టండి, వచ్చేజన్మలో మీకడుపులో పుడతాను."<br />
<br />
<b>గోపాల్: </b>చచ్చేట్టున్నాడు. ఏం చేద్దాం? కాస్త తిండి పడేద్దామా?<br />
<br />
<b>సంజీవ్:</b> పైవాడు ఇంకా మన ఉద్యమానికి పూర్తిగా స్పందించలేదు. ఇప్పుడు దీక్ష విరమిస్తే ఎలా?<br />
<br />
<b>ప్రకాశ్: </b>అవున్నిజమే. ఇప్పుడు తిండి ఇవ్వొద్దు.<br />
<br />
పక్క గదిలో నుండి దబ్బుమని కింద పడ్డ శబ్దం. ముగ్గురూ అక్కడికి వెల్తారు.<br />
<br />
<b>సంజీవ్: </b>చచ్చినట్టున్నాడు. ఇప్పుడేమిటి చెయ్యడం?<br />
<br />
<b>ప్రకాశ్: </b> ఇదే మంచి అదును. మన వాల్లకు చెప్పి అల్లర్లు చేయిద్దాం. బెజవాడ, నెల్లూరు, వైజాగ్ అన్నీ ఒక్కసారి అదిరిపోవాలి. ఈదెబ్బకు కేంద్రం దిగి రావాలి.<br />
<br />
<br />
<br />
<br />
</div>సత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.com2tag:blogger.com,1999:blog-4596590595254101156.post-29168031373413293202011-11-01T10:41:00.000+02:002011-11-01T10:41:07.644+02:00జీడీపీలు సులభంగా పెంచండిలా!!<div dir="ltr" style="text-align: left;" trbidi="on">జీడీపీ, తలసరి ఆదాయాలగురించి వినని వారుండరు. చిన్నప్పుడు మనందరం సోషల్ పుస్తకాల్లో దేశాల ఆర్ధిక స్థితులను పోల్చడానికి ఈ ఇండెక్స్లు వాడడం చూసేఉంటాం. జీడీపీ (Gross Domestic product) ఒక ప్రాంతంలో ఒక సంవత్సరంలో జరిగిన ఉత్పత్తిని సూచిస్తే తలసరి ఆదాయం ఆప్రాంతంలో ఒక వ్యక్తి సగటు ఆదాయాన్ని సూచిస్తుంది. <br />
<br />
ఈసూచీలు ఇంకా అనేక ఇతర సూచీలతో కలిపి చూసి మనం రెండు దేశాల ప్రజల జీవన ప్రమాణాలని పోల్చవచ్చు. అయితే statistics మీద అవగాహన లేనివారు వీటిని ఇష్టం ప్రకారం ఉపయోగిస్తే మొదటికే మోసం వస్తుంది. తలసరి ఆదాయం ఒక ప్రాంతంలో మనిషియొక్క సగటు ఆదాయాన్ని చెపుతుంది కానీ అక్కడ ఉన్న ఆర్ధిక అసమానతలు, బీదా బిక్కీ ప్రజల స్థితి తెలియదు. అందుకే మనదేశంలో వెనుకబడిన జిల్లాల పట్టీ తయారు చేసేప్పుడు మన కేంద్రప్రభుత్వం జీడీపీలూ, తలసరి ఆదాయాలు తీసుకోదు, అక్కడి కూలీ రేట్లు, వ్యవసాయం, జీవనోపాధి మార్గాలు, లిటరసీ రేట్లు లాంటి ఇతర ఇండికేటర్లను తీసుకుంటారు. <br />
<br />
ఉదాహరణకు ఫలానా జిల్లాలో తలసరి ఆదాయం బాగా తక్కువగా ఉందనుకోండి. అక్కడ నిజమైన అభివృద్ధి జరిగి ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే చాలా శ్రమించాలి. ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచాలి, వ్యవసాయం నీటిపారుదలలో అభివృద్ధి సాధించాలి ఇంకా ఎన్నో సాధించాలి. అయితే ఇవన్నీ చేయకుండా కూడా చాలా సులభంగా ఆజిల్లా ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచొచ్చు. ఎలాగంటారా లగడపాటి, కావూరు, జగన్, చంద్రబాబు లాంటి కొందరు బడా బాబులను అక్కడి జనాభా లెక్కల్లో నమోదు చేస్తే సరి. వారి ఆదాయం కూడా అక్కడి ప్రాంతం లోకే వస్తుంది కాబట్టి తలసరి ఆదాయం అమాంతంగా పెరిగిపోతుంది. <br />
<br />
ఇక జీడీపీ ఎలా పెంచాలంటారా? వెనుకబడిన ప్రాంతంలో ఎలాగూ వ్యవసాయభూములు తక్కువధరకు దొరుకుతాయి. అక్కడ కొన్ని భూములను ప్రభుత్వం లాగేసుకుని ఒక SEZ కట్టిందనుకోండి, అప్పుడు జీడీపీ అమాంతంగా పెరిగిపోతుంది. ఆSEZలో లోకల్ ప్రజలు ఎలాగూ ఉండరు, అప్పటికే అభివృద్ధి సాధించిన ప్రాంతాల్లో విద్యావకాశాలు, చదువుకునే స్థోమత ఎక్కువ ఉంటాయి కనుక అక్కడివారే పెద్ద ఉద్యోగాలు ఎలాగూ చేజిక్కించుకుంటారు. కంపనీ ఎలాగూ అభివృద్ధి చెందిన ప్రాంతం వారే పెడతారు కాబట్టి కీలక పదవుల్లో అంతా వారి చుట్టాలో పక్కాలో అభివృద్ధి చెందిన ప్రాంతం వారే ఉంటారు. చప్రాసీ ఉద్యోగాలకు కూడా తమ ప్రాంతంలోనే ఉన్న వెనుకబడిన వర్గాలను తెచ్చుకుంటే సరి. అంటే వెనుకబడిన ప్రాంతంలో ఒక్కరి ఆదాయం కూడా పెంచకుండానే అక్కడి జీడీపీని అమాంతం పెంచవచ్చు. అయినా బలిసిన వారు ఎక్కడన్నా తాముండే ప్రాంతంలో పరిశ్రమలు పెట్టుకుని తమప్రాంతంలో కాలుష్యం పెంచుకుంటారా మన పిచ్చిగానీ?<br />
<br />
మరి బ్లాగుల్లో జీడీపీలూ, తలసరి ఆదాయాల లెక్కలు చూపించి తెలంగాణాయే అభివృద్ధి చెందిందని చెప్పే చౌదర్లకు ఇవన్నీ తెలియవా అంటే అన్నీ తెలుసు. కానీ చదివేవాల్లని అందర్నీ అమాయకులకింద జతకట్టేసి ఇలాంటి అవాకులు రాస్తుంటారు. ఇలాంటి అబద్ధపు రాతలు రాయడం ఎందుకు? రాష్ట్రం కలిసుంటే వీరికేం లాభం అంటారా? అదో చిదంబర రహస్యం. సమైక్య రాష్ట్రంలో వీరిది చాలా బలమయిన లాబీ. వ్యాపారాలు, రాజకీయాలు, మీడియా అన్నీ వీరిచేతుల్లోనే ఉంటాయి. విడిపోతే తెలంగాణా, మరీ ముఖ్యంగా హైదరాబాదు వీరి చేతుల్లోంచి బయటికి పోతుంది, అక్కడి కాంట్రాక్టులు వీరి వర్గం వారికి రావు అనేదే వీరి బాధ. </div>సత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.com12tag:blogger.com,1999:blog-4596590595254101156.post-89210197295334289892011-11-01T08:16:00.000+02:002011-11-01T08:15:27.938+02:00ఎవరి బాగుకై సమైక్య?<div dir="ltr" style="text-align: left;" trbidi="on"><br />
<br />
<b><span class="Apple-style-span" style="font-size: large;">తేగీ!!</span></b><br />
<b><span class="Apple-style-span" style="font-size: large;">ఆరు వందల పదిజీవొ అమలుకాదు,</span></b><br />
<b><span class="Apple-style-span" style="font-size: large;">సాగునీటిపై దోపిడీ సమిసిపోదు</span></b><br />
<b><span class="Apple-style-span" style="font-size: large;">నిధుల తరలింపు ఆగదు నేటివరకు</span></b><br />
<b><span class="Apple-style-span" style="font-size: large;">ఎవరి బాగుకై సమైక్య? ఏది నీతి?</span></b></div>సత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.com2tag:blogger.com,1999:blog-4596590595254101156.post-79840657623891135352011-10-20T10:33:00.006+03:002011-10-31T21:44:56.299+02:00ఇద్దరన్నదమ్ముల కథ<div dir="ltr" style="text-align: left;" trbidi="on">అనగనగా ఒక ఊర్లో ఇద్దరన్నదమ్ములు. అన్న ఏపని చేసేవాడు కాదు. ఉట్టినే బలాదూరుగా తిరగడం వల్ల ఊర్లో మంచి పలుకుబడి సంపాదించుకున్నాడు. తమ్ముడు అదో ఇదో పనిచేసి సంపాదిస్తే వచ్చిన డబ్బుతో కుటుంబం గడిచేది. సంపాదించేది తమ్ముడయినా పెద్దవాల్లు కాబట్టి ఇంట్లో అన్నా, అన్న భార్యల పెత్తనమే సాగేది.గంపెడు చాకిరీ చేస్తే తమ్ముడి భార్యకు తినడానికి కడుపునిండా భోజనం కూడా దొరికేది కాదు. <br />
<br />
తమ్ముడి పెల్లయినప్పుడు తమ్ముడి భార్యకు అరణంగా పుట్టింటివారు ఒక ఆవును ఇచ్చారు. కాలం గడుస్తున్నకొద్దీ ఆవు పెద్దదయి బాగానే పాలిస్తుంది. అయితే పాలన్నీ అన్న పిల్లలే తాగేవారు. తమ్ముడి పిల్లలకు పాలూ, పెరుగు దొరికేవి కావు. ఇంట్లో ఒక దానిమ్మ చెట్టుండేది. ఆ దానిమ్మ పల్లు కూడా అన్ని అన్న పిల్లలే తినేవారు. కాలం గడుస్తున్నకొద్దీ సరైన ఆహారం దొరక్క తమ్ముడు, తమ్ముడి భార్యా పిల్లలూ బక్కచిక్కిపొయ్యారు. దాంతో వీరికంటే బలంగా తయారయిన అన్న పిల్లలు ఇంకాస్త దౌర్జన్యం చేసే వారు, తమ్ముడి పిల్లలను గేలిచేసేవారు.<br />
<br />
<br />
కొన్నాల్లకు వల్లుమండిన తమ్ముడి భార్య భర్తతో మనం దోపిడీకి గురవుతున్నాం, ఇలాగయితే కష్టం, ఉమ్మడి కుటుంబంలో తమకు ఇబ్బందిగా ఉంది, విడిపోదామని తెగేసి చెప్పింది. ఊర్లో పెద్దమనుషుల పంచాయితీ పెట్టి ఇలా నామొగుడు పనిచేసి సంపాదిస్తున్నా మాకు సరిగ్గా తిండి కూడా దొరకట్లేదు, అందుకే విడిపోవాలనుకుంటున్నామని చెప్పింది.<br />
<br />
<br />
అప్పటిదాకా తమ్ముడి సంపాదనతో ఏ పనిచెయ్యకుండానే చక్కగా తింటున్న అన్నకుటుంబానికి ఈపరిణామం ఒక్కసారిగా షాక్ కొట్టినట్టయింది. అమ్మో విడిపోతే రేపటినుంచి తాను ఏం చేసి కుటుంబాన్ని పోషించాలి అని అన్న అనుకున్నాడు. అమ్మో ఇప్పుడు ఉన్నపళంగా విడిపోతే నాఇంటిపనీ, వంటపనీ నేనే చేసుకోవాలి ఎలాగా అని అన్న భార్య అనుకుంది. అమ్మో ఇప్పుడు చక్కగా ఆవు పాలూ, పెరుగు తాగుతున్నాం, విడిపోతే ఈ ఆవు మనకు దక్కదు అని అన్న పిల్లలనుకున్నారు. అంతా కలిసి ఎలాగయినా తమ్ముడి కుటుంబం విడిపోకుండా అడ్డుకోవాలనుకుని తామూ విడిపోడానికి వీల్లేదంటూ పద్దమనుషులదగ్గర ఎదురు పంచాయితీ పెట్టారు. ఇక పంచాయితీ మొదలయింది.<br />
<br />
<br />
అదేంటి, మేం విడిపోవడానికి వీల్లేదంటూ చెప్పే హక్కు మీకెక్కడుంది? కలిసుండాలా విడిపోవాలా అని నిర్ణయించుకునే హక్కు మాకుంది. మేం విడిపోతామంటే సొమ్ములు ఎలా పంచుకోవాలనే విషయంపై పంచాయితీ పెట్టాలి గానీ విడిపోవాడానికి వీల్లేదంటూ పంచాయితే పెడితే ఎలా అంటూ తమ్ముడు నోరుబాదుకున్నాడు. మనది ఒకే వంశం, ముందు నుండీ కలిసే ఉన్నాం, మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలి, ఇదంతా ఆపక్కింటి ఎల్లయ్యగాడి కుట్రగని లేకపోతే విడిపోవాలనే పాడు బుద్ది నీకెలా వస్తుంది? అంటూ అన్న ఎదురు ప్రశ్న వేశాడు.<br />
<br />
<br />
"చూడు తిండిసరిగా దొరక్క నాడొక్క ఎలా ఎండిపోయిందో? ఇన్నాల్లూ నాసంపాదన మీరు దోచుకున్నారు, ఇక మీతో కలిసి ఉండడం నాకు సాధ్యం కాదు" అంటూ వల్లుమండిన తమ్ముడు చెప్పాడు. అమ్మో అమ్మో మీ సంపాదన మేం దోచుకున్నామా? మమ్మ్మల్ని దోపిడీ దొంగలంటావా? ఇల్లాగయితే నిన్నస్సలు విడిపోనివ్వం అంటూ అన్న భార్య హుంకరించింది.<br />
<br />
<br />
నీడొక్క ఎండిపోతే దానికి మేమెలా భాద్యులం? నీసమస్యకు మమ్మల్ని కారణమంటావేం అంటూ అన్న లాజిక్ పెట్టాడు. నాసమస్యకు కారణం నువ్వనడం లేదు, అసలు నాసమస్యే నువ్వు అందుకే విడిపోతున్నాం. తమ్ముడు బుర్ర గొక్కుంటూ సనిగాడు.<br />
<br />
<br />
మమ్మల్ని దోచుకున్నామని నువ్వు, నీభార్యా ఫలానా రోజు పెద్దమనుషుల దగ్గర అన్నారు, మీరు లెక్కలు తీసుకొచ్చి మేము మిమ్మల్ని నిజంగానే దోచుకున్నట్టు నిరూపిస్తేగానీ విడిపోవడానికి వీల్లేదు. మమ్మల్ని ఈసంఘం దృష్టిలో దోపిడీదారులను చేద్దామనా నీ ఐడియా? అన్న భార్య హుంకరించింది. ఇంట్లో లెక్కలు రాసేదీ, సామాన్లూ కొనుక్కొచ్చేదీ అన్నీ అన్నే చేస్తాడు కాబట్టి అన్న ముందే లెక్కల పద్దు తనకు అనుకూలంగా రాసుకున్నాడు. తమ్ముడు లెక్కలు చెప్పబోతే అవి చెల్లవు, నేను రాసిన ఈ మన ఉమ్మడికుటుంబం అధికారిక పద్దులు చూపిస్తేనే నేను ఒప్పుకుంటా, వేరే లెక్కలు నేనొప్పుకోను అంటూ అన్న తెలివి ప్రదర్శించాడు.<br />
<br />
<br />
అసలు కలిసి ఉండాలనేభావన ఒక ఉమ్మడి కుటుంబంలోని విలువ, దాన్నీ ఇద్దరూ గౌరవించి ఎవరికీ అన్యాయం జరగకుండా ఉంటే బాగానే ఉంటుంది, అలా కుదరనప్పుడు విడిపోవడం నాహక్కు దానికి అసలు ఏలెక్కలు మాత్రం ఎందుకు? లేని హక్కు కోసం నువ్వెలా పంచాయితీ పెడతావు? తమ్ముడు వాపోయాడు.<br />
<br />
<br />
నువ్వు విడిపోతామనేది మీకు అరణంగా మీపుట్టింటివారిచ్చిన ఆవు ఉంది కనుకే. ఆఅవు ఇప్పుడు మన ఉమ్మడి పెరట్లో గడ్డితిని బలిసింది కనుక అది ఉమ్మడి ఆస్థి, దాన్ని నువ్వొక్కడివే కొట్టేద్దామని చూస్తున్నావ్! అన్న తెలివి ప్రదర్శించాడు. అయ్యో అది నాకు మాపుట్టింటివారిచ్చిన ఆవు, ఇన్నాల్లూ మీరే మా ఆవు పాలు తాగారు, విడిపోతే నాఅవు నాకుదక్కాలనుకోవడం కూడా తప్పేనా అనుకుంది తమ్ముడి భార్య.<br />
<br />
<br />
ఇదీ కథ! మాఇంట్లో జరిగిన కథ, రాష్ట్రంలో జరుగుతున్న కథ. ముగింపు ఎలాగుంటుందనేది కాలమే నిర్ణయించాలి.</div>సత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.com15