Thursday, 23 December 2010

తొంభై ఐదేళ్ళ యువకుడు

శ్రీ కొండా లక్ష్మన్ బాపూజీ గారు ప్రస్తుత తరం ప్రజలకి అంతగా తెలియని వెనుకటి తరం కాంగ్రేస్ నాయకుడు. తొంభై అయిదు సంవత్సరాలు పైబడ్డ వయసులో కూడా కొండా లక్ష్మన్ గారు తెలంగాణా ఉద్యమంలో అత్యంత చురుగ్గా పాల్గొంటూ అనేక కార్యక్రమాలలో ముఖ్య అథిధిగా, వక్తగా ఉద్యమానికి తోడ్పడుతున్నారు..

స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న కొండా లక్ష్మన్ గారు 1956లొ ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాతి మొట్టమొదటి అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ఆ తరువాత రాష్ట్ర మంత్రిగా విభిన్న ప్రభుత్వాలలో పనిచేసిన ఈ నేత 1969లో తెలంగాణా ఉద్యమానికి మద్దతుగా తన పదవికి రాజీనామా చేశి ఉద్యమంలో భాగస్వామ్యం తీసుకున్నారు. ఆదిలాబాద్ వాస్తవ్యుడైనప్పటికీ నల్లగొండ జిల్లా నుండి అసెంబ్లీకి ప్రాతినిఘ్యం వహించారు. తెలంగాణా ప్రజా సమతి ఫౌండింగ్ మెంబర్ కూడా అయిన కొండా లక్ష్మన్ గారు నేటికీ అదే ఉద్యమస్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు.

సుమారు నలభై ఏళ్ళుగా తెలంగాణా ఆశయం కోసం పనిచేసిన కొండా లక్ష్మన్ గారు టీఆరెస్ పార్టీ ఆఫీసు కోసం తన నివాస గృహాన్ని అద్దె లేకుండానే ఇవ్వగా అక్కసుతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టాంక్‌బండ్ పక్కన ఉన్న వారి ఇంటిని అధికారబలంతో రాత్రికి రాత్రి నేలమట్టం చేయించాడు.

తన ఇద్దరు కొడుకులలో ఒక కొడుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో పైలట్‌గా పని చేసి విమాన ప్రమాదంలో మృతి చెందగా మరో కొడుకు అమెరికాలో ఉంటూ ఇటీవలే అనారోగ్యంతో చనిపోయారు. తొంభై ఏల్ల వయసులో కూడా తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న బాపూజీ గారు ఈ వయసులో కూడా ఉద్యమానికి సంబంధించి ఎవరు ఏ సమావేశానికి ఆహ్వానించినా తప్పకుండా వెలుతారు. ఈ తొంభై అయిదేళ్ళ యువకుడి ఉద్యమస్ఫూర్తికి నా జోహార్లు.

Wednesday, 25 August 2010

"రహస్య గూఢాచారి aka కణిక నీతి" (డా విన్‌చీ కోడ్ కు స్వేచ్చానువాదం)

గోల్కొండ కోటలో తానీషా జైలు దగ్గర ఉండే వాచ్‌మన్ ఒకరోజు హఠాత్తుగా మరణిస్తాడు. ఎవరో అతన్ని తుపాకీతో కాల్చివేశారు. ఆ తరువాత బుల్లెట్ గాయంతో వాచ్‌మన్ 10 మీటర్లు నడిచి ఒక బురుజు దగ్గర హిందీ 'ర ' ఆకారంలో ముడుచుకుని ప్రాణం విడుస్తాడు. అప్పుడే ప్రఖ్యాత కుట్రకోణాల స్పెషలిస్టూ గోల్కొండ కోట చూడ్డానికి వస్తుంది. పోలీసులు ఆవిడే వాచ్‌మన్ను చంపిందేమో నని వెంబడిస్తారు.

ఆ తరువాత వరుసగా భీమోజి ఫిల్మ్ సిటీలో ఒక తోట మాలీ, తానియా గాంధీ సెక్యూరిటీ వాడూ, కిద్వానీకి అంట్లు తోమే వాడూ, టాటా కారు డ్రైవరూ అంతా ఒకేసారి హత్య కావించబడుతారు.

తనపై వచ్చిన నేరారోపణని తుడిచేయడం కోసం, ఈ నాలుగు హత్యల రహస్యం తెలుసుకోవడం కోసం హీరోయిన్ అయిన కుట్రకోణాల స్పెషలిస్టూ ప్రయత్నం చేస్తుంది. తన పరిశోధనలో తెలిసేదేమంటే భారత దేశం ఆర్ధిక, రాజకీయ, ఇతిహాసాలపై నాలుగు వందల సంవత్సరాలుగా ఒక మహా కుట్ర జరుగుతుంటుంది. ఈ కుట్ర ఒక కణిక వ్యవస్థ నడుపుతుంటుంది. వీరంతా ఒక నెట్ వర్క్ లాగా ఏర్పడి తరతరాలుగా ఈ రహస్యాన్ని తరువాతి తరాలకి అందిస్తూ ఉంటారు.

వీరి కుట్ర యొక్క రహస్యం ఇంకో రహస్య గ్రూపుకి తెలిసి ఉంటుంది. ఈ రెండో రహస్య గ్రూపు కణిక వ్యవస్థలో ఒక్కొక్కరి ఇంటిలో పని వారు గానూ, వాచ్మన్, కారు డ్రవరుల్లాగా ఉంటారు. కణిక వ్యవస్థ నాయకుడైన భీమోజీకి ఈ రహస్యం తెలిసి ఒక కాంట్రక్ట్ కిల్లర్ ద్వారా అందరినీ ఒకే సారి చంపేస్తాడు. ఇప్పుడు ఆ రహస్యం తెలిసిన వారంతా చనిపోయారు, మరి మన కధానాయకురాలు ఈ రహస్యాన్ని ఎలా చేదిస్తుంది?

ఈ రహస్యాలను తెలిసిన భీమోజీ పత్రికలోని ఒక రిపోర్టర్ చిన్న చిన్న క్లూలను మనకు అందిస్తూ ఉంటాడు. అవి న్యూస్ హెడ్డింగులు గానూ, కార్టూన్ల రూపంలోనూ, అంతర్యామి లాంటి కాలంలలోనూ కనిపిస్తూ ఉంటాయి.

మధ్యలో ఫ్లాష్ బాక్ లో హీరోయిన్ హీరో ల సంభాషణ ద్వారా తెలిసేదేమంటే ఈ కణిక నెట్‌వర్క్ ఇప్పుడు మొదలు కాలేదు, బ్రిటిషు వారు ఇండియాను ఆక్రమించుకోవడానికీ, ఇందిరా గంధీ, రాజీవ్ గాంధీ ల హత్యలకీ, 911 సంఘటనకీ అన్నింటికీ మూలం ఈ కణిక వ్యవస్థే. త్వరలో విడుదల, గొప్ప అద్భుత థ్రిల్లర్.

Saturday, 31 July 2010

తెలంగాణా విద్యార్థి ఆత్మహత్య - మూఢ నమ్మకాల ఫలితం


మరో తెలంగాణా విద్యార్థి ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణాలో ఇప్పుడు విద్యార్థుల ఆత్మహత్యలు కొత్తవిషయం కాదు, వందలాది విద్యార్థులు తెలంగాణా ఉద్యమం కోసం ఆత్మహత్యలకు పాల్పడ్డారు, నేడు ఆత్మహత్య ఇషాన్‌రెడ్డి వంతయింది.

అయితే ఈ ఆత్మహత్య మిగతా ఆత్మహత్యలకంటే భిన్నమయినది. ఇషాన్ అందరిలా తెలంగాణా వాదం బలపడాలి అనో, లేక తన చావుతో కేంద్రం తెలంగాణా ఇస్తుందనో భ్రమ పడి ఆత్మహత్య చేసుకోలేదు. ఇతను పీసీసీ ప్రెసిడెంట్ డీఎస్ ఓడిపోవాలని మైసమ్మకు మొక్కుకొని, తన కోరిక నెరవేరడంతో మైసమ్మకు తన మొక్కును తీర్చుకోవడం కోసం ఆత్మహత్య చేసుకున్నట్లు అతని స్యూసైడ్ నోట్ ద్వారా తెలుస్తుంది.

మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, ఎల్లమ్మ అంతా తెలంగాణా పళ్ళెళ్ళో గ్రామ దేవతలు. ఇక్కడి ప్రజలు ఈ గ్రామదేవతలదగ్గర తమ కోరికలు తీరిస్తే కోడిని కోస్తాను, మేకను కోస్తాను అని మొక్కుకుంటారు. ఇషాన్ ఇంకాస్తా ముందుకెళ్ళి తన ప్రాణాలనే అర్పిస్తానని మొక్కుకున్నాడు.

కొందరు తమ కోరికలు నెరవేరితే తిరుపతి వెంకటేష్వరునికి తలనీలాలు ఇస్తామని, హుండీలో డబ్బులు వేస్తామనీ మొక్కుకుంటారు. మరికొందరు సత్యనారాయణ వ్రతం చేస్తానని మొక్కుకుంటారు. ఇంత సోఫిస్టికేటెడ్ కాని కొందరు పోచమ్మకు మేకని బలి ఇస్తానని, మైసమ్మకు కోడిని ఇస్తామని మొక్కుకుంటారు.నేడొక తెలంగాణా విద్యార్థి తన సొంత ప్రాణాలనే మొక్కుకున్నాడు. ఇతని చావుకు కారణం దేవుడు లంచాలు తీసుకుని మొక్కులు తీరుస్తాడని బ్రెయిన్ వాష్ చేసిన మన సమాజమే అని నాకనిపిస్తుంది.




Friday, 23 July 2010

శ్రీక్రిష్ణ కమిటీకి లోక్‌సత్తా చత్త నివేదిక


వోటు వేసినా, వేయక పోయినా మన రాష్ట్రంలో అందరూ గౌరవించే పార్టీ నీతివంతమయిన రాజకీయాలను తీసుకురావడానికి పూనుకున్న లోక్ సత్తా పార్టీ మాత్రమే. ఉచిత విద్యూత్తు, ఆరోగ్యశ్రీ, జనాకర్షణ పధకాలు, గనులు లాంటి అనేక విషయాలలో కప్పదాటులు లేకుండా నిర్ద్వందంగా తమ అభిప్రాయాన్ని చెప్పింది ఒక్క లోక్‌సత్త మాత్రమే.

అయితే ఒక్క తెలంగాణా విషయంపై మాత్రం లొక్‌సత్తా మరియూ జయప్రకాష్ నారాయణ మొదటి నుంచి కప్పదాటు ధోరణి అవలంబిస్తూ గోడమీది పిల్లి వాటం సమాధానాలు మాత్రమే చెప్పి తప్పించుకోజూషారు. కాకపోతే కాంగ్రేస్, తెలుగు దేశం పార్టీల మాదిరిగా మేము తెలంగాణాకు వ్యతిరేకం కాదు అని చెప్పి మాట మార్చనందుకు వీరిని అభినందించాలి. అలాగే శ్రీక్రిష్ణ కమిటీ ఏర్పాటయి తమ అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పాల్సిన సమయంలో వీరు పార్టీ తరఫున ఒక నివేదికను ఇవ్వటం అభినందనీయం.

బహుషా ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణాలో గెలిచినందుకు కావొచ్చు వీరు ముందునుంచీ సుముఖంగా లేరు. తెలంగాణా రాష్ట్రం అవసరంలేదు, తమ పార్టీ విధానమయిన జిల్లా ప్రభుత్వాలద్వారా తెలంగాణాను అభివ్రుద్ధి పరచవచ్చు అనేది వీరి రిపోర్టు సారాంశం.లోక్‌సత్తా నివేదికను ఇక్కడ చూడవచ్చు. లగడపాటి లాంటి వారిచ్చిన వేల పేజీల నివేదిక అర్ధవంతంగా ఉంటుందని ఎవరూ ఆశించకపోయినా, జేపీ గారు ఇచ్చే నివేదిక మీద పెద్ద ఆశే పెట్టుకున్న నాబోటి వారికి ఈ నివేదిక చూస్తే ఆశాభంగమే.

ఈ రిపోర్టులో తమ వాదనను సమర్ధించడం కోసం వీరు అనేక టేబుల్లను, డాటాను జతపరచారు. నాకు మాత్రం వీరి డాటా, రిపోర్టూ అంతా కూడా తాము ముందే అనుకున్న సారాంశాన్ని నిరూపించడానికి వండిన డాటా లాగా అనిపించింది తప్ప డాటా ఉపయోగించుకుని కంక్లూజన్‌కి రాలేదనిపించింది. మేము ఇంజనీరింగు చదివే రోజుల్లో ల్యాబు ఎక్షాముల్లో గ్రాఫులను కరెక్టుగా రావడానికి అవసరమయిన డాటా మాత్రమే తీసుకునే వాళ్ళం. ఇది కూడా అలాగే ఉంది. మనకు కంక్లూజన్ ఎలా కావాలో అలాంటి డాటాని సేకరించడం పెద్ద కష్టం కాదు.

తెలంగాణా అవసరాన్ని నిర్ణయించడానికి వీరు ఎన్నుకున్న విధం 1) తెలంగాణాపై పై వ్యవస్తీక్రుత వివక్ష ఉందా అని 2) వివిధ ప్రాంతాలలో అభివ్రుద్ధి రేటు. తెలంగాణా పై పాలనాపరమయిన వివక్ష లేదు అని చెప్పడానికి వీరి ఉదాహరణలు వివిధ ప్రాంతాలలో తెల్ల కార్డుల సంఖ్య, రెండు రూపాయలు కిలో బియ్యం, ఆరోగ్యశ్రీ లాంటి పధకాల అమలు.కనీసం రోజూ ఒక సారి ఇదే జయప్రకాష్ నారాయణ ఇవి వోట్లకోసం ప్రజలను బిచ్చగాళ్ళుగా మార్చే పధకాలు అని చెబుతాడు. మరి వోట్లు తెలంగాణాలోనయినా ఆంధ్రాలో నయినా ఊరికే రావు కనుక ప్రజలను బిచ్చగాళ్ళుగా మార్చే పధకాలు ఎక్కడయినా సమానంగానే ఉంటాయి. వీటిని చూపించి వివక్ష ఏమీ లేదనడం ఎలా సబబో జేపీగారే చెప్పాలి.


అతిముఖ్యమయిన నదీ జలాల పంపకాల విషయంలో మనకు స్పష్టంగా కప్పదాటు ధోరణి కనిపిస్తుంది. ఆంధ్రా ప్రాంతం కొద్దిగా ఎక్కువ నీరు పొందడానికి కారణం ప్రయర్ యూసేజ్ (రాష్ట్ర ఆవిర్భావానికి ముందే ఉపయోగంలో ఉన్న ప్రాజెక్టులు అని అర్ధం??) మరియు టోపాలజీ (నైసర్గిక స్వరూపం) మాత్రమే కారణమని చెప్పుకొచ్చారు. మరి ఏ టోపాలజీ మరియూ ప్రయర్ యూసేజ్ కారణంగా శ్రీశైలం ఎడమకాలువకి ఎన్నటికీ మోక్షం రాకపోయినా కుడి కాలువ శుబ్బరంగా కర్నూలు, తిరుపతి, మద్రాసుతో పాటు రాజా వారి సిమెంటు కంపనీకి కూడా నీరిస్తుందో చెప్పలేదు. ఏ టోపాలజీ కారణం వల్ల నాగార్జున సాగర్ ఎడమ కాలువ కుదింపు, రాజోలి బండ పేలుళ్ళు, శ్రీరామ సాగర్‌కు నలభై ఏల్లకు కూడ మోక్షం రాకపోవడం కారణమో వివరించలేదు.


తెలంగాణా వెనుకబడలేదు అని నిరూపించడానికి వీరు చెప్పింది తలసరి ఆదాయము తెలంగాణాలోని ఐదు జిల్లాలు:హైదరాబాద్, రంగారడ్డి,నల్గొండ, మెదక్,కరీంనగర్ రాష్ట్ర సగటు తలసరి ఆదాయం కంటే ఎక్కువ అని. ఇందులో నాలుగు జిల్లాలు ఎక్కువ పరిశ్రమలున్న హైదరాబాదు, దాని చుట్టు పక్కల జిల్లాలు కాగా, మిగిలిన కరీం నగర్ బొగ్గు గనులు ఎక్కువగా ఉన్న జిల్లా. పరిశ్రమలలో ఎక్కువ శాతం ఉద్యోగులు ఆంధ్రా ప్రాంతం వారన్నది నిస్సందేహం కాగా కరీం నగర్ బొగ్గు గనులలో ఉన్నతోద్యోగుల్లో ఎక్కువ ఆంధ్రా ప్రాంతం వారే. ఈ తలసరి ఆదాయంలో సగటు తెలంగాణా జీవి ఆదాయం ఎంతో తెలియదు.

చివరగా వీరిచ్చే సజెషన్స్ తెలంగాణా సమస్య జిల్లా ప్రభుత్వాలవల్లే సాధ్యమని చెప్పడం, రీజనల్ కమిటీలు. ఎనభై శాతం ప్రజలు వ్యవసాయంపైన ఆధారపడ్డ మనదేశంలో జలవణరులు లేకుండా అభివ్రుద్ధి చెందిన ప్రాంతం ఏదీ లేదు. మరి తమ ప్రాంతపు జలవణరులను తమకే కాకుండా చేస్తున్న ప్రభుత్వాల నుంచి జిల్లా ప్రభుత్వాలు తమకు ఎలా మేలు చేయగలవో జేపీ గారే చెప్పాలి.

పాజిటివ్ అంశాలు తీసుకుంటే విడిపోతే తెలంగాణా కోల్పోయే తీర ప్రాంతపు ఆక్సెస్, వ్యవసాయానికి ఎక్కువగా పంపుసెట్లపై ఆధారపడే తెలంగాణాకు వచ్చే విద్యుత్ లోటు లాంటి వాటిని చక్కగా వివరించారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణా వాదులని భయపెట్టే ప్రయత్నం చేసారు.

వీరి రిపోర్టులో వివక్ష గురించి చెప్పినప్పుడు, సచివాలయ, న్యాయశాఖ, ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో వివక్ష ఉందో లేదో కొన్ని సర్వేలు నిర్వహించి తెలుసుకుంటే బాగుండేది. 1956లో ఆంధ్ర ప్రదేష్ రాష్ట్రం ఏర్పడకముందు పరిస్తితులూ, పెద్దమనుషుల ఒప్పందం లాంటి విషయాలు నివేదికలో ఎక్కడా కనపడవు. ఏదేమైనా వీరి రిపోర్టు స్టాటిస్టిక్స్ ద్వారా దేన్నైనా నిరూపించవచ్చుననే సామెతను మాత్రం నిరూపించింది.


Sunday, 18 July 2010

లాజికల్ కన్సిస్టెన్సీ టెస్టు


దేవుడు ఉన్నాడా లేడా అన్న విషయంపై ఎవరి ఫిలాసఫికల్ స్టాండు వారిది. అయితే తమ తమ స్టాండులో ఎంత కన్సిస్టెంటుగా మనుషులు ఉండగలరు? ఈ క్రింది టెస్టు వారి లాజిక కన్సిస్టెన్సీని టెస్టు చేస్తుంది. మీరూ ట్రై చెయ్యండి

మరి!!

**********

Can your beliefs about religion make it across our intellectual battleground?

In this activity you’ll be asked a series of 17 questions about God and religion. In each case, apart from Question 1, you need to answer True or False. The aim of the activity is not to judge whether these answers are correct or not. Our battleground is that of rational consistency. This means to get across without taking any hits, you’ll need to answer in a way which is rationally consistent. What this means is you need to avoid choosing answers which contradict each other. If you answer in a way which is rationally consistent but which has strange or unpalatable implications, you’ll be forced to bite a bullet.


http://www.philosophersnet.com/cgi-bin/god_game1.cgi?num=0&hits=0&bullets=0&bulletcount=0&hitcount=0





Saturday, 5 June 2010

ఆడిన మాట తప్పకూడదా?


"మాట తప్పని, మడమ తిప్పని వంశం మాది", "రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యం", "రాజశేఖర్ రెడ్డి పధకాలకు ఈ ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది", "పావురాల గుట్టపైనే నేను మాట ఇచ్చాను" ఇవన్నీ గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్సార్, జగన్ చెప్పిన కొన్ని మాటలు మరియూ సాక్షి పేపరులో ఎడిటొరియల్సూ!

వైఎస్సారు, జగన్ తమని తాము ఆడిన మాట తప్పని రాచవంశీకులుగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నమే ఈ మాటలు. వీరు నిజంగానే మాట తప్పరా అన్న విషయం జోళికి వెల్లకుండా, అసలు మాట తప్పడం అంత పెద్ద నేరమా, మాట తప్పకపోవడం రాజకీయాల్లో పెద్ద క్వాలిఫికేషనా అని ఒక సారి చర్చిద్దాం.

వెనుకటికి రాజులు ఇచ్చిన మాత నిలబెట్టుకోవడానికి అవసరమయితే రాజ్యాలనే వదులుకున్నారని పుస్తకాల్లో, కధల్లో చదువుకున్నాం. అయితే ఇప్పుడున్నది రాచరిక పాలన కాదు, ప్రజాస్వామ్యం. వ్యక్తుల ఈగోలకన్నా, ప్రజల సంక్షేమం ముఖ్యం. పనికిరాని వాగదానాలు ఇచ్చినప్పుడు వాటిని పాటించడం మరో తప్పిదమే కానీ అది ఎన్నటికీ ఒక క్రెడిట్ కాదు. చత్త హామీలను నిలబెట్టుకుంటే విశ్వసనీయత పెరుగదు, తగ్గుతుంది.

ఎన్నికల్లో గెలవడానికి అన్ని పార్టీలు తలా కొన్ని ఆచరణ సాధ్యం కాని పధకాలను, హామీలుగా ఇచ్చేసింది. ఇందులో ఏ పార్టీ మినహాయింపు కాదు. కనీసం గెలిచాకనయినా ఆ హామీలు ప్రభుత్వం నడ్డి విరుస్తున్నాయి అని తెలుసుకున్నప్పుడు వాటిని వదిలివేయాలా లేక మాట ఇచ్చాము కదా అని కొనసాగించాలా?

మాట నిలపెట్టుకోవడం ముఖ్యం కాదు, ప్రజల శ్రేయస్సు ముఖ్యం అంటే, మరి రాజకీయ పార్టీలు ఎడా పెడా ఎన్నికలముందు వాగ్దానాలు చేయడం సమర్ధనీయమేనా అంటే కానే కాదు. సాధ్యాసాధ్యాలతో, ప్రజల శ్రేయస్సుతో, దేశ అభివృద్ధితో సంబంధం లేకుండా కేవలం వోట్లకోసం వాగ్దానాలు చెయ్యడం ఎంతమాత్రమూ సమర్ధనీయం కాదు. అయితే ఇలాంటి రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెల్లే వాగ్దానాలు చెయ్యడం ఒక నేరం కాగా మాట ఇచ్చాం కదా అని వాటిని ఎలాగయినా నిలుపుకోవాలని పంతానికి పోయి దేశాన్ని ఇంకొంచెం వెనక్కి తీసుకెల్లడం మరో నేరం అవుతుంది.

రోశయ్య గారూ, ఇకనైనా సాక్షి పత్రిక ఏదో రాస్తుంది, జగన్ వర్గం తప్పు పడుతుంది అని భయపడి ఈ సం"క్షామ" పధకాలను కొనసాగించకుండా వాటిని ఒక్కసారి కడిగేయండి. మీరు వీటిని అమలు చేసినా, చెయ్యకపొయ్యినా వచ్చే ఎలక్షనులో ఏ వోటరూ వాటిని చూసి వోటేయడు. ఒకవేళ ఏసినా ముఖ్యమంత్రిగా ఉండేది మీరు ఎలాగూ కాదు కాబట్టి మీకా భయం అస్సలు అవసరం లేదు.