Saturday 23 January 2010

సమైఖ్య వాద బ్లాగరుల కొన్ని వింత వాదనలు..మీ ప్రాంత అభివృద్ధికి మీ నాయకులని అడగండి!!??##


మైఖ్య సీమంధ్ర వాదుల మరో ఆయుధం ఏమిటంటే, ఎ పాయింటు దొరకనప్పుడు మీ ప్రాంత అభివృద్ధి కోసం మీ నాయకులని నిలదియక రాష్ట్రం కావాలన్తారెంటి అంటారు. నిజమే, మా ప్రాంత నాయకులంతా వట్టి దగుల్బాజీలు. అయితే ఇలాంటి వాళ్లకి టికేట్లిచ్చి వాళ్ళని నాయకులని చేసింది అధికారం వెలగబెట్టే సిమాంధ్ర నేతలే కదా? ఇప్పుడు ఉద్యమం చేస్తుంది నాయకులు కాదు, ప్రజలు. మా రాష్ట్రం మాకిస్తే ఆ తరువాత మాకు కావలిసిన నాయకులని మేము ఎన్నుకుంటాము.

ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిలో మరో దారి లేక ఐ నాయకులంతా తెలంగాణా వాదం సమర్ధిస్తున్నారు..లేకపోతె ప్రజలలో చులకన అయిపోతామని తెలుసు కాబట్టి. కానీ వీల్లన్తా నిన్నటిదాకా జగన్ జపం లేక చంద్రబాబు జపం చేస్తున్న వాళ్ళే కదా? మరి ఇలాంటి వాళ్లకు ఎందుకు వోటు వేస్తున్నారు అంటే మరో దారి లేదు..అన్ని పార్టీలలో సీమాధ్ర నేతలే అధికారం గుఉపిట్లో ఉంచుకొని తమ కిలుబోమ్మలకి తికేట్లిస్తున్నారాయే. ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరికి వోటు వేయాలి కదా?

ఇక మరికొందరు సమైఖ్య వాదులు తమ బాణాలని కేసీఆర్ మిఇడ ఎక్కు పెడతారు. వాళ్ళు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే కేసీఆర్ తెలంగాణా వాదాన్ని సృష్టించలేదు. కేవలం దాన్ని వాడుకొన్నాడు. ఈ తెలంగాణా సమస్య ఇలా ఉన్నంతకాలం కేసీఆర్ లేకపోతె మరో డీసీఆర్ నాయకుదయ్యే వాడు. కాబట్టి వ్యక్తులపై విమర్శలు మాని సమైఖ్య వాదులు విషయంపై చర్చించడం మొదలు పెడితే అర్ధవంతంగా ఉంటుంది.

6 comments:

  1. ఏ పాయింటూ దొరక్కపోవడమేం? కాకపోతే మీరు ఏ పాయింట్లూ ఒప్పుకోరు. భయం!

    దగుల్భాజీలకి టిక్కెట్లు ఇస్తే మిమ్మల్ని ఓట్లెవరెయ్యమన్నారూ? ఎవరైనా సమర్థుడిని ఇండిపెండెంట్ గా నిలబెట్టి, అతడికి ఓట్లెయ్యకపోయారా?

    మీరంతా అడ్డగోలు వాదనలో కే సీ ఆర్ వారసులే! మీలాంటి వాళ్ల చేతుల్లో ఉద్యమం!

    ReplyDelete
  2. " అయితే ఇలాంటి వాళ్లకి టికేట్లిచ్చి వాళ్ళని నాయకులని చేసింది అధికారం వెలగబెట్టే సిమాంధ్ర నేతలే కదా?" - ఈ జోకు రాసేటప్పుడు మీరు కూడా నవ్వు ఆపుకోలేకపోయినట్టున్నారు. ఓపక్క అలా నవ్వుతూ రాయడంతో కాబోలు.. కొన్ని అచ్చుతప్పులు కనబడుతున్నాయి.

    "ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరికి వోటు వేయాలి కదా?" -సరిగ్గా చెప్పారు. ఉన్న ఎదవల్లో మనకు నచ్చిన ఎదవని ఎంచుకుని ఓటేస్తాం. లేదా మనకు ఎవడు ఎక్కువ డబ్బులిస్తే వాడికి వేస్తాం. అందరమూ అంటే! కాకపోతే మన ఖర్మకు, మనమూ మన నాయకులూ చేసిన తప్పులకు అవతలోడిమీదపడి ఏడవడమున్నది చూసారూ.. అదీ తె.వాదుల గొప్పతనం!

    ReplyDelete
  3. @చదువరి

    మా ఖర్మ గనుక మా ప్రాంతంలో ఎవడు గెలవాలో, ఎవడు మంత్రి కావాలో అన్నీ సిమాంధ్ర నేతలే చేస్తారు. ఈ సీమాంధ్ర కుల, ధన, ముఠా నాయకులు తమకు పావులాంటి వాల్లను, తము సీమాంధ్రకి జలయగ్నం పేరుతో నిళ్ళని తరలిస్తున్నా కిమ్మనకుండా ఉండే నాయకులని ఇక్కడినుంచి మంత్రులను చేస్తారు.

    సరిగ్గా అందుకే..ఇది మా ఖర్మ అనుకోకుండా మా ఖర్మలను మేమే రాసుకోవడానికి మేము ప్రత్యేక రాష్ట్రాన్ని అడుగుతున్నాము. అన్నట్టు జోకులు రాస్తున్నరని అన్నారు, ఏ జోకు? మీరు హైదరాబదు గురించి, అయోధ్య గురించి లేక వరి ఉత్పత్తి లెక్కల గురించి రాసిన జోకులా?

    ReplyDelete
  4. బాబు ఎవరికి వారు ఇక్కడ పని, పాత లెకుండ ఇల కొట్టుకుఛస్తుంటె, అక్కడ ఔస్త్రెలియా వాడు చెలరెగి పొతున్నాడు. చైనా వాడు సగం గోడెక్కి కూర్చున్నాడు.
    సరె! మాస్టారూ, ఒక్క కారణం చెప్పండి ఎందుకు ప్రత్యేక రాష్త్రం అడుగుతున్నారొ,సరైన కారణం
    మహానుభావ, ముందు మన వాళ్ళ చేత తాగుడు అలవాటు మానిపించండి . తరువాత చదువు (ఉరికె పుస్తకం పట్టించడం కాదు,వాటి సారాన్ని కుడా తలకెక్కించుకొండి) మీద అవగాహన కల్పించండి. ఆ తర్వాత బాబు, పొరాడుదురుగాని. ఎదో మన రాష్త్రం లోనె జరుగుతున్నట్లు, తెగ బెంబలెత్తుతారె, ఏ రాష్త్రమైన ఆ రాజధానిలో అన్ని ప్రాంతాలవారు వొచ్చి ఉండటం, వ్యాపారాలు చెసుకోవడం, మామూలే.

    ReplyDelete
  5. ఏ రాష్ట్రంలో నైనా నదీ పరివాహిక జిల్లాలకు నీళ్ళు అందకుండా, వేరే దూరపు జిల్లాలకు తరలిస్తున్నారా?

    ReplyDelete
  6. కుంభకర్ణా కాస్త నిద్ర మత్తు వదుల్చుకుని ఆలోచించు సోదరా...నిజం నీకే అర్ధమవుతుంది.

    ReplyDelete