Friday 21 January 2011

ఒక ఉద్యమం అంతా అబద్ధమే - 2



తెలంగాణా ఉద్యమం ఏల్లతరబడి ప్రభుత్వపు పాలనా వివక్ష ఫలితంగా ఏర్పడ్డ ఆకలి పోరాటం అయితే సీమాంధ్ర ఉద్యమం అక్కడి నాయకుల, వ్యాపారస్థుల ధన దాహం, ఆరాటం. ఒక ప్రజా ఉద్యమం పూర్తిస్థాయికి చేరుకోవడానికి ఎంతో సమయం, శ్రమ, ఎన్నో త్యాగాలు అవసరమవుతాయి. ఉద్యమం ఒక గతిని, రీతినీ తీసుకోవడానికి ముందు ఎన్నో బాలార్ష్టాలను ఎదుర్కుంటుంది. కానీ డబ్బూ, అధికారం, మీడియాల సహాయంతో తయారయిన కృత్రిమ ఉద్యమాలకు ఇవేవీ అక్కరలేదు..రాత్రికి రాత్రే ఊపందుకుంటాయి, అంతే వేగంగా కనుమరుగయితాయి.

ఈ సీమాంధ్రా కృత్రిమ ఉద్యమాన్ని సమర్ధించుకోవడానికి వారి నాయకులూ కొందరు బ్లాగరులూ ఎంటో కష్టపడ్డారు. అందులో ఒకతనంటాడు: "మా ఉద్యమం ప్రజలనుంచి రావలసిన అవసరం లేదు, మా నాయకులు మా ప్రయోజనాలకోసం మా తరఫున మొదలు పెట్టారు. మాలో రాజకీయ చైతన్యం ఎక్కువ అని." మరి ఇదే నాయకులు ఒకరోజు మందర అమ్మా సోనియా మీరేం నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాము అని ఎందుకన్నారు? బిల్లు పెట్తండి మేము సమర్ధిస్తాము అన్నారు? ఇక తెలుగు దేశంలో నయితే ఎవరి అధ్వర్యంలో పార్టీ కమీషను ఏర్పాటు చేసి తెలంగాణాకు మద్దతు ప్రకటించిందో అతనే చివరికి కౌంటరు ఉద్యమం మొదలు పెట్టాడు. ఏ ప్రజలు అధికారం ఇచ్చారు వీరికి ఇలా కప్పగంతులు వేయమని? నిజంగా ప్రజలనుండి వ్యతిరేకత వస్తే అప్పుడు ఉద్యమం ప్రారంభించినా ఒక అర్ధం వుంది, కానీ నిముషాల్లోనే ఉద్యమం శృష్టించారే? పోనీ తాము ఒక మాటకు కట్టుబడి ఉంటే కనీసం మర్యాదన్న దక్కేది సీపీఎం లాగా. అదికూడా లేదే? ఎందుకీ నయవంచన?

1 comment: