Monday 11 July 2011

రాయలసీమ, కోస్తాంధ్ర కలిసి ఉంటాయా?

ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఒక నిర్ణయాత్మక దశకు వచ్చింది. తెలంగాణకు చెందిన పార్లమెంటు, శాసనసభ ప్రతినిధులందరూ రాజీనామా చేసిన తరువాత కేంద్రానికి ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. ఇక సమస్యను నాంచుడు కార్యక్రమం ఎక్క్వకాలం చెయ్యలేరు. ముందు టపాల్లో చెప్పుకున్నట్లు మరో మూడేల్లు ఆగితే ఎన్‌డీయే ఎలాగూ తెలంగాణ ఇస్తుంది కనుక ఈలోపట తెలంగాణ ఇస్తే కాంగ్రేస్‌కే మంచిది.

అయితే విభజనకు ముందు రాష్టృఆన్ని ఏరకంగా విభజించాలనే విషయంలో స్పష్టత అవసరం. దీనికి విభజన తరువాత రాయలసీమ, కోస్తాంధ్ర కలిసి సమైక్యంగా ఉండగలవా అనేది చాలా ముఖ్య్మైన అంశం. తెలంగాణ ప్రజలు విడిపోతామంటే తమతమ స్వార్ధ ప్రయోజనాలకోసం, ఇప్పటివరకూ తెలంగాణతో కలిసి ఉండడం వలన మితిమీరిన లబ్దిపొందుతూ అదెక్కడ పోతుందో అనే అసహనంతో రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలు కలిసి సమైక్య ఉద్యమం చేపట్టారు కానీ వీరికి తెలంగాణ ప్రజలమీద ఎలా ప్రేమలేదో, వీరిలో వీరికి కూడా అలాగే ఎలాంటి ప్రేమలు లేవనేది అందరికీ తెలిసిన వాస్తవమే.

మద్రాసు రాష్ట్రంతో కలిసిఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతం వారు తమకు ప్రత్యేక రాష్ట్రం కొరకు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయితే రాయలసీమకు చెందిన నాయకులకు కోస్తాంధ్ర వారిపై ఉన్న అనుమానాలతో వారు ఒక్క రాష్ట్రంగా ఉండడానికి ఒప్పుకోకపోవడంతో ఆడిమాండ్ వెనుకబడిపోయింది. చివరికి శ్రీబాగ్ ఒప్పందం కుదిరి రాయలసీమకు కొన్ని ప్రతిపత్తులు ఇస్తామని ఒప్పుకున్న తరువాత మాత్రమే ప్రత్యేకాంధ్ర రాష్ట్ర డిమాండ్ ముందుకు వెల్లింది. ఆశ్రీబాగ్ ఒప్పందం ఫలితంగా ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధాని అయ్యింది.

అయితే శ్రీబాగ్ ఒప్పందం సరిగా అమలు కాలేదని రాయలసీమ నాయకులకు అసంతృప్తి ఇప్పటికీ ఉంది. అలాగే శ్రీబాగ్ ఒప్పందంతో మేము నష్టపొయ్యామని కొందరు అప్పటికే ధనబలం కలిగిన మధ్యకోస్తా భూస్వామ్య వర్గానికీ ఉంది. మొత్తానికి తెలంగాణతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినతరువాత ఈరెండుప్రాంతాలవారికీ మరో సాఫ్ట్ టార్గెట్ దొరకడం వలన రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలు రెండూ తెలంగాణను ఎక్స్‌ప్లాయిట్ చేసి లాభం పొందాయి కనుక ఈభేదలు ఇంతకుముందు బయటపడలేదు.

అయితే తెలంగాణ విడిపోతే రాయలసీమ, కోస్తాంధ్ర ఎంత్వరకు కలిసి ఉండగలవనేది సందేహమే. ఇప్పుడు క్రిష్ణా జలాల్లో తెలంగాణ వాటా పూర్తిగా నొక్కేయడం వలన రాయల్సీమకు నీరివ్వగలుగుతున్నారు. అయితే తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడ్డతరువాత ఒక రాష్ట్రంగా తెలంగాణకు రావాల్సిన నదీజలాల వాటాను ట్రిబ్యునల్ నిర్ణయిస్తుంది. అప్పుడు తెలంగాణ వాటా పోయిన తరువాత రాయలసీమకు నీరివ్వాలంటే నీటిదాహం విపరీతంగా గల మధ్యకోస్తా నాయకులు ఒప్పుకోరు, స్వతహాగా అంతా తమకే చెందాలనుకుంటారు.

రాయలసీమ తెలంగాణలాగా సాఫ్ట్ టార్గెట్ కాదు. రాజకీయబలం బాగా ఉండి, ముఠాకక్షలకు పేరుగాంచినా ఇక్కడి నాయకులు మధ్యకోస్తా పెత్తనాన్ని ఎంతమాత్రం ఒప్పుకోరు. నిజానికి ఇప్పుడు సమిక్యాంధ్రప్రదేశ్ లోనే ఎప్పుడూ అతితక్కువ జనాభా కల రాయలసీమ నుండే ముఖ్యమంత్రులు ఉంటున్నారంటే సీమాంధ్ర రాష్ట్రంలో కూడా వీరే ముఖ్యమంత్రులు అవుతారు. మరి సీమాంధ్ర రాజకీయబలాన్ని కోస్తాంధ్ర ధనబలం గౌరవిస్తుందా? ఈప్రశ్నలన్నింటికీ సమాధానాలకోసం వేచిచూడాల్సిందే.

ఇప్పుడు తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడానికి కలిసి ఉన్నట్లు నటించే ఈరెండుప్రాంతాలు, కేంద్రం విభజనకు ఒప్పుకున్న మరుక్షణం కత్తులు దూసుకోవడం ఖాయం. ఏతావాతా తెలిసేదేమంటే తెలుగుజాతి ఐక్యత, సమైక్య నినాదం అంతా నేతిబీరకాయలో నెయ్యే.

No comments:

Post a Comment