Tuesday 16 August 2011

బ్లాగుల్లోనూ మెజారిటీ రాజకీయాలే!


తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుకోవటానికి ముఖ్య కారణం రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు, అసెంబ్లీలో ప్రజాప్రతినిధులకు మెజారిటీ లేకపోవడం వలన. మెజారిటీ లేకపోవడం వలన తెలంగాణ నాయకులకెప్పటికీ అధికారం రాదు. అసెంబ్లీలో వారి మాట నెగ్గదు. మెజారిటీ ఆధ్రాంగా నడిచే ప్రజాస్వామయంలో మెజారిటీలేనివాడికి న్యాయం జరగదు కనుక.

కొందరు అతితెలివి కలిగినవారు మెజారిటీ లేకపోతే మాత్రం తెలంగాణనుండి ప్రజాప్రతింధులు లేరా, మంత్రులు లేరా? ప్రజాస్వామ్యంలో అందరూ కలిసే కదా నిర్ణయాలు తీసుకునేది అని అతితెలివి చూపుతారు, కానీ వాస్తవాలు అందరికీ తెలిసిందే. భేధాలు లేనంతవరకే మెజారిటీ నిర్ణయాలు ఆమోదనీయం, మనం కలిసి ఒక్క రాష్ట్రంగా ఉన్నా ఎన్నడూ ప్రజలుగా కలిసి లేము, అధికారంలో కూర్చున్నవారు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా కాక ప్రాంతాలకు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు.

ఇప్పుడు బ్లాగుల్లో జరుగుతుంది కూడా అదే. మెజారిటీ తెలుగు బ్లాగర్లు సీమాంధ్ర ప్రాంతం వారు. వీరిలో అధికభాగం పక్షపాతపూరితంగా తమది తప్పు అని తెలిసినా ఎదుటివారినే దెప్పిపొడుస్తారు. ఎవరైనా పొరపాటున తెలంగాణవాది తన బ్లాగులో ఒక చిన్న కవిత రాసుకున్నా అక్కడికి వెల్లి కావు కావుమంటూ కామెంట్లు అరిచి గీపెడతారు. పచ్చి అబద్దాలు చెబుతారు, అయినా ఎదుటివారివే అబద్దాలు అంతారు. కానీ మెజారిటీ ఉంది కదా.. ఎక్కువ కామెంట్లు వారివే కదా.. కనుక తెలంగాన వాదులు నోరుమూసుకుంటారు.

మచ్చుకు ఒక ఉదాహరణ: ఒక పెద్దమనిషి వెల్లి ఒక బ్లాగులో "ఏమిటి, మీ నల్లగొండలో ఫ్లోరసిస్ అని చెబుతున్నావు, నల్లగొండలో ప్రతి ఊరికి క్రిష్ణా నుండి తాగు నీరు వస్తుంది, 2000 సమవత్సరంలోనే ఫ్లోరసిస్ సమస్య తీరిపోయింది" అని గదమాయిస్తాడు. ఎదుటివారిని అబద్దాలు రాస్తున్నావని హుంకరిస్తాడు. ఎవరైనా అయ్యా నల్లగొండ జిల్లాలో ఏఊరికీ తాగునీరు క్రిష్ణా నుండి అందడం లేదు, ఫ్లోరసిస్ అలాగే ఉంది, ఘోరంగా ఉంది అని చెబితే మల్లీ దాని ఊసెత్తడు, కానీ అతనే మరో బ్లాగుకెల్లి తెలంగాణవారు అన్నీ అబద్దాలు చెబుతున్నారని గోలపెడతాడు. అక్కడ అతని మద్దతుగా మరో పది కాకులు కావుకావు మంటాయి. మధ్యలో సందట్లో సడేమియాల్లాగా రక్తచరిత్రలూ, సంకరులూ బయల్దేరుతారు, బూతు రాతలకు, హేళనలకు తెగబడుతారు, గోల చేస్తారు.

ఇక ఎవరో విశాలాంధ్ర వారు ఏదో సర్వేని ఒకటి చూపుతారు. వెంతనే మన బ్లాగు కాకులు కావు కావుమంటూ మల్లీ అదే సర్వేని దాని అసలు అర్ధాన్న్నే మారుస్తూ ప్రచారం చేస్తారు, కామెంటర్లు కామెంట్ల గోల పెడతారు. ఆఖరుకు బ్లాగుల్లో మేధావులుగా చలామనీ అయిపోయే కొందరు 14F లాంటి ఒక అన్యాయపు క్లాజును కూడా సమర్ధించడం, 14F తొలగింపును సీమాంధ్రలోనే అనేక నాయకులు, మేధావులు సమర్ధించినా అస్మెంబ్లీ నిర్ద్వంద్వంగా తొలగింపును సమర్ధించినా ఇంకా 14Fను వెనుకేసుకు రావడం, దానికి కొందరు కావు కావు మంటూ సమర్ధించడం అత్యంత శోచనీయం.

ఈగోలంతా భరించలేక చాలామంది తెలంగాణ వాద బ్లాగరులు తెలంగాణ గురించి రాయడం మానుకున్నారు, కొందరు తమ బ్లాగులను అగ్రిగేటర్లనుంచి తొలగించారు. కొందరు ఏదో తమకు నచ్చింది రాస్తున్నారు కానీ కామెంట్లను తీసివేశారు. ఇడీ ప్రస్తుత బ్లాగు మెజారిటీ రాజకీయాల పరిస్థితి.




మేమేది చేస్తే అదే న్యాయం



తేగీ!!
కలిసిరవసరం కోసమై పిలిచి వీరు,
వీరె తమ స్వార్ధ లాభమై వీడ జూచె!!
మేము విడిపోవ కోరగా, తామె మరల
నేడు సమైక్య నాటకం ఆడ సాగె !!




Monday 15 August 2011

లేని హక్కుల సాధనకోసం, హక్కులను కాలరాయడం కోసం ఉద్యమాలు


ఉద్యమాలు, నిరశనలు అనేవి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తమ హక్కుల సాధనకోసం ఉపయోగించే ఆయుధాలు. ప్రజలు ప్రజాస్వామ్యంలో తమందరి తరఫునా నిర్ణయాలు తీసుకోవడం కోసం కొందరు ప్రతినిధులను గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయిస్తారు. అలాంటి ప్రభుత్వం తమ న్యాయమైన హక్కులను కాలరాస్తే మనకు ఆప్రభుత్వాన్ని వెంటనే దించివేసే హక్కులేదు, ఐదేళ్ళదాకా ఆగాల్సిందే. కనుక ప్రజలు తమ హక్కుల సాధనకోసం ఉద్యమాలు, నిరశనలు చేస్తారు. ఈనిరశనలు బందులూ, రాస్తారోకోలూ, సమ్మెలూ లాంటి అనేక విధానాలద్వారా చేస్తారు.

అయితే ప్రజలు లేని హక్కులకోసం ఉద్యమాలు చేస్తే అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చెయ్యడమే. ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతోందదే. ఆరోజోన్లో ఉద్యోగాలు ఆరోజోన్ వాసుల హక్కు. దానికోసం సీమాంధ్ర వారు బందులు చెయ్యడం, ఉద్యమాలు చెయ్యడం తమకు లేని హక్కును కోరడమే కాక ఆరోజోన్ ప్రజల హక్కులు హరించడమే. ఈసాంప్రదాయం ఇలాగే కొనసాగితే రేప్పొద్దున రాజస్థాన్ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగాలకోసం కూడా ఇదే సీమాంధ్రులు ఉద్యమాలు చెయ్యగలరు..రాజస్థాన్ వారికి మాత్రం తమ ప్రభుత్వోద్యోగాల్లో అర్హత ఇస్తే ఒప్పుకోరు. ఇలాంటి అన్యాయపు డీమాండ్లను కొందరు చెయ్యడం, వారికి కొందరు రాజకీయ నాయకులు వత్తాసు పలకడం క్షమించరాని నేరం.

అసలు సమైక్యవాదులు అని చెప్పుకునే వారు చేసే ఉద్యమమే ఒక హాస్యాస్పద ఉద్యమం. దీనికి అబద్దాలను జోడించి కావూరి సాంబశివరావు లాంటి నేతలు తెలంగాణవారు తెలంగాణ కావాలనుకుంటే సీమాంధ్రలో ప్రజలంతా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి రాష్ట్రాన్ని విడదియ్యడానికి వీల్లేదని చెప్పడం హాస్యాస్పదం. ముందుగా సీమాంధ్రలో అందరూ సమైక్యరాష్ట్రాన్ని కోరుకోవడమే పచ్చి అబద్దం, ఇక ఒకవేళ ఇది నిజమనుకున్నా రాష్ట్రాన్ని కలిపి ఉంచాలని ఒక్కపక్షం వారే నిర్ణయించలేరు, అదివారి హక్కు కాదు.

ఒకభాగస్వామ్యం నచ్చనప్పుడు ఒకభాగస్వామి నాకీ పొత్తు నచ్చడం లేదు, నేను విడిపోతాను అని చెప్పగలడు, అలా చెప్పేహాక్కు ఒకభాగస్వామికి ఉంటుంది. అప్పుడు మరో భాగస్వామి మాత్రం విడిపోవడానికి వీల్లేదు, మనం కలిసే ఉండాలి అని చెప్పే హక్కు ఉండదు, ఉండేహక్కల్లా విడిపోయే పక్షంలో తన సమస్యలను పరిష్కరించుకోవడమే.

ఒకవేళ ఇద్దరు భాగస్వాములూ కలిసే ఉందామని ఇష్టపడుతున్నా ఎవరైనా బలవంతంగా విడగొడుతుంటే అప్పుడు ఇద్దరు భాగస్వాములూ కలిసి మేం కలిసే ఉంటామని చెప్పడం ఒక హక్కవుతుంది. దానికోసం, బలవంతపు విభజనకు వ్యతిరేకంగా ఇరు పక్షాలూ కలిసి ఉద్యమించవచ్చు. కానీ ఒక పక్షం వారంతా మేం విడిపోతాం మొర్రో అంటుంటే లేదు మీరు కలిసే ఉండాలని చెప్పడం హక్కు కాదు కదా, ఎదుటి వారి హక్కులను కాలరాయడమే.

ఇలా ఎదుటివారి హక్కులను హరించే ఉద్యమాలను కొందరు చదువుకున్నవారు కూడా సమర్ధించడం, దానికి రాజకీయనాయకులు వత్తాసు తెలపడం మాత్రమే కాక ఆనాయకులే ఇలాంటి ఉద్యమాలను సృష్టించడం మనదేశంలో ప్రజాస్వామ్య భావనకే ఒక దెబ్బ. ఇలాంటి దొంగ ఉద్యమాలను లేవదీసేవారు ఎంతమాత్రం క్షమార్హులు కారు.

వెక్కిరింతురు, నగుదురు ఫక్కుమనుచు!!

తేగీ!!
మీరు మేమంత ఒక్కటే వేరు కాదు
యనుచు విభజన కడ్డుగా జనుచు వారె,
తోటి యువకుల చావుల తూలనాడి,
వెక్కిరింతురు, నగుదురు  ఫక్కుమనుచు!!

Wednesday 10 August 2011

జగన్ తీహార్ జైలు వెలతాడా?


1)జగన్ ఆస్తుల కేసులో తీహార్ జైలుకెలతాడా?
2)జైలుకెలితే జగన్‌కు సీమాంధ్రలో మద్దతు తగ్గుతుందా లేక సింపతీవలన పెరిగుతుందా?
3) రాష్ట్రం విడిపోతే సింపతీ వోటుతో వైఎస్సార్ కాంగ్రేస్ సీమాంధ్రలో మెజారిటీ సాధిస్తుందా?
4) సీమాంధ్ర మొదటి ముఖ్యమంత్రిగా అప్పుడు విజయమ్మగారు అవుతారా?
5) జగన్‌తోపాటు ఇంకా ఎవరెవరు తీహార్ జైలుకెల్లొచ్చు?